News January 14, 2025

ఈ ఏడాదీ బాదుడే.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?

image

గత ఏడాది 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచిన టెలికం కంపెనీలు కొత్త సంవత్సరంలోనూ బాదుడుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 10 శాతం ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5G సేవలకు నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంటున్నాయి. ధరల పెంపుతో జియో, ఎయిర్‌టెల్, VIల యావరేజ్ రెవెన్యూ కనీసం 25 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 14, 2025

ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు: మంత్రి గొట్టిపాటి

image

AP: రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ YCP దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ఎప్పుడూ లేనివిధంగా పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడినవారు పండుగకు సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. ‘₹6,700 కోట్ల బకాయిల విడుదలకు CM ఆమోదం తెలిపారు. ₹850 కోట్లతో రోడ్లను బాగు చేశాం. రైతులకు 24గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.

News January 14, 2025

వారెన్ బఫెట్ వారసుడిగా హువర్డ్

image

ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం వారెన్ బఫెట్(94) తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి వారసుడిగా రెండో కొడుకు హోవర్డ్‌(70)ను ఎంపిక చేశారు. $1 ట్రిలియన్ విలువైన సంస్థకు ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని తెలిపారు. తనకు ముగ్గురు పిల్లల మీద నమ్మకం ఉందని, హువర్డ్ తన బిడ్డ కాబట్టే అవకాశం లభించిందని పేర్కొన్నారు. హోవర్డ్ 30ఏళ్లకు పైగా కంపెనీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదువు పూర్తైనప్పటి నుంచి తండ్రి బాటలో నడుస్తున్నారు.

News January 14, 2025

తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా: వరలక్ష్మి

image

తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత సీఎం జయలలితే స్ఫూర్తి అని, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. ఆమె తండ్రి శరత్ కుమార్ కూడా AISMKని స్థాపించి తర్వాత బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల <<15069754>>త్రిష కూడా<<>> పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

News January 14, 2025

Stock Market: పండగపూట కొంత ఊరట

image

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ముగిశాయి. ప్రీ-మార్కెట్‌లో జ‌రిగిన బిజినెస్ వ‌ల్ల‌ భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభ‌మైన సూచీలు క‌న్సాలిడేట్ అవుతూ క‌దిలాయి. చివ‌రికి సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 76,499 వ‌ద్ద‌, నిఫ్టీ 90 పాయింట్లు ఎగ‌సి 23,176 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. IT, FMCG స్టాక్స్ మిన‌హా అన్ని రంగాల షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించింది. Adani Ent 7%, Adani Ports 5% మేర లాభ‌ప‌డ్డాయి.

News January 14, 2025

అమరావతి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: రాజధాని కోసం భూములిచ్చిన దాదాపు 28 వేల మంది రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. వార్షిక కౌలు, భూమి లేని నిరుపేదలకు పెన్షన్ల డబ్బును వారి అకౌంట్లలో జమ చేసింది. పలు కారణాలతో కొందరికి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించింది. దాదాపు రూ.255 కోట్లను అమరావతి రైతులకు అందజేసింది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News January 14, 2025

అప్పుడు లేఖ రాయడానికి తుమ్మలకు పెన్ను దొరకలేదా?: అర్వింద్

image

TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్‌కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.

News January 14, 2025

పవన్ ‘OG’ సినిమా ఏ OTTలోకి వస్తుందంటే?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది. దీనితో పాటు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, మ్యాడ్ స్క్వేర్, సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ ఓటీటీ రైట్స్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

News January 14, 2025

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలివే

image

☛ వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు
☛ ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి, 2023-24లో కనీసం 20 రోజులు పనులు చేసిన వారు అర్హులు.
☛ ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాన్ని యూనిట్‌గా గుర్తిస్తారు. లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికీ భూమి ఉండకూడదు. ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు.
☛ ₹6వేల చొప్పున రెండు విడతల్లో ₹12,000 ఖాతాల్లో జమ
☛ ఈనెల 26న తొలి విడత అమలు

News January 14, 2025

పండగ వేళ 19% పెరిగిన అదానీ షేర్లు.. ఎందుకంటే!

image

అదానీ షేర్లలో నేడు సంక్రాంతి కళ కనిపిస్తోంది. గ్రూప్ షేర్లు నేడు గరిష్ఠంగా 19% వరకు ఎగిశాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే లంచం కేసులో గౌతమ్ అదానీ, సంబంధీకులకు క్లీన్‌చిట్ ఇస్తారన్న వార్తలే ఇందుకు కారణం. ప్రస్తుతం అదానీ పవర్ 19, గ్రీన్ ఎనర్జీ 13, ఎనర్జీ సొల్యూషన్స్ 12, టోటల్ గ్యాస్ 9, NDTV 8, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8, APSEZ 5, ACC, అంబుజా సిమెంట్స్ 4%, సంఘి ఇండస్ట్రీస్ 3.2% మేర ఎగిశాయి.