News June 4, 2024

మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

image

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి చల్లా బాబు లీడింగులోకి వచ్చారు. రాజంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా.. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

News June 4, 2024

BIG BREAKING: మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

News June 4, 2024

గన్నవరంలో వల్లభనేని వంశీ వెనుకంజ

image

AP: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు లీడ్‌లో ఉన్నారు. బాపట్ల MP స్థానంలో TDP అభ్యర్థి కృష్ణప్రసాద్ లీడింగ్‌లో ఉన్నారు. అవనిగడ్డలో జనసేన నేత బుద్ధప్రసాద్ ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ లీడింగ్‌లో ఉన్నారు. ఇటు విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

మెదక్‌లో బీఆర్ఎస్‌కు షాక్

image

మెదక్‌లో BRSకు షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముందంజలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో గెలుపొందడంతో మరోసారి గెలుస్తామని బీఆర్ఎస్ ఆశించినా తొలి రౌండ్‌లో నిరాశే ఎదురైంది.

News June 4, 2024

ఏపీలో కూటమి హవా

image

ఏపీలో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకబడ్డారు. ప్రస్తుతానికి NDA కూటమి 80+ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

AP: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ బరిలో నిలిచారు. అటు బొబ్బిలిలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

దర్శిలో వైసీపీ ఆధిక్యం

image

AP: దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

NDA vs INDIA: క్రాష్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

image

ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.

News June 4, 2024

పాణ్యంలో టీడీపీ అభ్యర్థి 2,365 ఓట్ల లీడింగ్

image

బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ లీడింగులో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత 2,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో తొలి రౌండులో సీఎం జగన్‌ 1,888 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. పెనుకొండలో సవిత వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ లీడింగులో ఉన్నారు.

News June 4, 2024

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యం

image

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3,773 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3,214 ఓట్లు పడ్డాయి.