India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చి తనను చాలా సార్లు తిట్టారని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తానెప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. రాహుల్ కాంగ్రెస్ను రక్షించడానికి పోరాడితే తాను మాత్రం దేశం కోసం ఫైట్ చేస్తానని చెప్పారు. మరోవైపు ఢిల్లీని పారిస్గా మారుస్తానని చెప్పిన కేజ్రీవాల్ కాలుష్యంతో ఎవరూ నగరంలో తిరగకుండా చేశారని రాహుల్ సెటైర్లు వేశారు.
సంక్రాంతి రోజైన ఇవాళ సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. దీంతో దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. కాగా ఈ పండుగ అన్నింటిలోకెల్లా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇవాళ సూర్యుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఉత్తరాయణంలో చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
నేటి నుంచి ఢిల్లీ వేదికగా ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది. పెళ్లి తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నీ ఇదే. అంతకుముందు గత ఏడాది ఆమె SMAT ఉమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచారు. సింధు తొలి రౌండ్లో చైనీస్ తైపీ ప్లేయర్ యువోయున్తో తలపడనున్నారు. మరోవైపు డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్పైనే అందరి దృష్టి నెలకొంది. ఇక పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, ప్రణయ్ ఫేవరెట్లుగా ఉన్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరిగిన రోజే భారత్కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ఆ రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలని చెప్పారు. రామ మందిర ఉద్యమం ఏ ఒక్కరినీ వ్యతిరేకించడానికి కాదని తెలిపారు. ఈ క్రమంలో భారత్ స్వతంత్రంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడుతుందని పేర్కొన్నారు. కాగా గత ఏడాది జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే.
TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తెలంగాణ పరిస్థితి Kakistocracyగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థం పనికిరాని లేదా తక్కువ అర్హత కలిగిన చిత్తశుద్ధి లేని పౌరుల చేతిలో పాలన ఉండటం. బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ మూవీ కలెక్షన్లపై దర్శకుడు RGV సెటైర్లు వేశారు. ఒకవేళ GC తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే ‘పుష్ప-2’ రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు. గేమ్ ఛేంజర్కు రూ.450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న RRR మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో అబద్దాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు రాసుకొచ్చారు.
ఇటీవల Dy.CM పవన్ ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో SMలో దీని గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ బుక్ రచయిత విక్టరీ ఫ్రాంక్ అనే మానసిక వైద్యుడు. ‘మనిషి నిస్సహాయ స్థితిలో ఉండి అర్థం లేని బాధని, అణచివేతని భరిస్తున్నపుడు దానిని తట్టుకొని ఎలా ముందుకు వెళ్లాలి’ అని స్వీయ అనుభవాన్ని ఇందులో రాసినట్లుగా చెబుతున్నారు.
1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
1980: సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి మరణం
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై డీజీపీ జితేందర్కి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. స్టేషన్ బెయిల్పై కౌశిక్ను విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేను అనూహ్యంగా త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. జడ్జి ముందుకు ప్రవేశపెట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆయనకు స్టేషన్లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.