India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లకు చేరువ చేసేందుకు రచన, దర్శకత్వం, ప్రమోటింగ్ అంశాల్లో ప్రతి ప్రయాణాన్ని తాను ఆస్వాదించినట్లు తెలిపారు. ‘మా పక్క పండగ సినిమాతో ఈ సంక్రాంతిని రెట్టింపు ఎనర్జీతో అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని రాసుకొచ్చారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
✒ తిథి: బహుళ పాడ్యమి తె.3.41 వరకు
✒ నక్షత్రం: పునర్వసు ఉ.10.52 వరకు
✒ శుభ సమయం: సా.4.20-5.20 వరకు
✒ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.రా.10.46-11.36 వరకు
✒ వర్జ్యం: రా.6.58-8.35 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.8.28-10.02 వరకు
✒ కుంభమేళా.. తొలి రోజే కోటి మంది పుణ్యస్నానాలు
✒ ఒకే రోజు 23 పైసలు డౌన్.. 86.27కు రూపాయి
✒ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ, చిరంజీవి
✒ APలో మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!
✒ నారావారిపల్లెలో సీఎం CBN సంక్రాంతి వేడుకలు
✒ TTDలో సమన్వయ లోపం లేదు: ఛైర్మన్, ఈవో
✒ TG: కౌశిక్ రెడ్డి అరెస్ట్.. దుర్మార్గమన్న కేటీఆర్
✒ TG: కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు
✒ TG: రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
FY2024-25లో ఈ నెల 12 వరకు రూ.16.89 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. FY2023-24లో ఇదే సమయంతో పోలిస్తే 15.88 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.8.74 లక్షల కోట్లు, కార్పొరేట్ పన్ను రూ.7.68 లక్షల కోట్లు, సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూ.44,538 కోట్లు, ఇతర పన్నులు రూ.2,819 కోట్లు ఉన్నాయంది.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందే ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు కౌశిక్ను అరెస్ట్ చేయడం అక్రమమని హరీశ్ రావు అన్నారు.
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో ఉన్న వీడియో చూసినప్పుడు ఎమోషనల్ అయినట్లు పీవీ సింధు చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నారు. ‘నా ఆదాయం, పన్నుల వ్యవహారాన్ని పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ను భర్త దత్తసాయి మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాలేదు. అందుకు నేను సంతోషిస్తున్నా’ అని పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. రేపు సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.
AP: తిరుమల శ్రీవారి పరకామణిలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.అర కోటి ఉంటుందని తెలిపారు.
తెలంగాణలోని నిజామాబాద్లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావద్దేశానికి సంక్రాంతి కానుక అని తెలిపారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
Sorry, no posts matched your criteria.