News June 4, 2024

మండపేట, నంద్యాల లోక్‌సభలో టీడీపీ లీడింగ్

image

AP: మండపేటలో టీడీపీ లీడ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు నంద్యాల లోక్‌సభలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

255కు పైగా NDA, 161 సీట్లలో INDIA కూటమి లీడింగ్

image

దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 255కు పైగా సీట్లలో ఎన్డీఏ, 161 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వయనాడ్‌, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గాంధీ నగర్‌లో అమిత్ షా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

BIG BREAKING: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువగా చెల్లనివే

image

పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా చెల్లనివి నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు చెల్లనివిగా తేలడంతో దీనిపై ఇరు వర్గాలు ఎలా స్పందిస్తాయనేది ఉత్కంఠగా మారింది.

News June 4, 2024

BREAKING: ఖమ్మంలో కాంగ్రెస్ లీడ్

image

ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

కరీంనగర్, మహబూబ్ నగర్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం

image

కరీంనగర్, మహబూబ్ నగర్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

వారణాసిలో మోదీ ముందంజ

image

వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ లీడింగులో ఉన్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆయన ఆధిపత్యం ప్రదర్శించారు. అలాగే తొలిరౌండులోనూ ఆయనకే గంపగుత్తగా ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈసారి శివుడికి అత్యంత ఇష్టమైన నగరంలో రికార్డులు సృష్టించడం ఖాయమే. 2014, 2019లోనూ ఆయన భారీ మార్జిన్‌తో గెలుపొందడం విశేషం. ఇక్కడ ఆయన స్థాయికి తగిన ప్రత్యర్థి లేకపోవడం గమనార్హం.

News June 4, 2024

ఆదిలాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ లీడింగ్

image

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ లీడింగ్‌లో ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి గోదం నగేశ్ బరిలో నిలిచారు.

News June 4, 2024

వారణాసిలో మోదీ.. వయనాడ్‌లో రాహుల్ ఆధిక్యం

image

వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు మండిలో BJP MP అభ్యర్థి కంగనా రనౌత్ వెనుకబడగా, బారామతిలో NCP శరద్ వర్గం నుంచి బరిలో నిలిచిన సుప్రియా సూలే లీడ్‌లో ఉన్నారు. మరోవైపు బీహార్‌లో లాలూ కూతుళ్లు ఇద్దరూ వెనకబడ్డారు. పాటలీపుత్రలో మీసా భారతి, సరన్ నుంచి రోహిణి NDA అభ్యర్థుల కంటే వెనకంజలో ఉన్నారు.

News June 4, 2024

EVMలో లెక్కింపు ప్రారంభం

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా EVMలో లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌ల ఓట్ల లెక్కింపు 8గంటలకు ప్రారంభం కాగా, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది.

News June 4, 2024

మోదీ Vs దీదీ.. గెలుపెవరిది?

image

2024 ఎన్నికల్లో భాజపా ఎక్కువగా ఫోకస్ చేసిన ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ 2014లో 34, 2019లో 22 సీట్లు గెలుచుకుంది. 2014లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2019లో ఆ సంఖ్యను 18కి పెంచుకుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు వెలువడే ఫలితాలు బెంగాల్‌లో కీలకంగా మారనున్నాయి.