News June 4, 2024

కరీంనగర్, మహబూబ్ నగర్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం

image

కరీంనగర్, మహబూబ్ నగర్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

వారణాసిలో మోదీ ముందంజ

image

వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ లీడింగులో ఉన్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆయన ఆధిపత్యం ప్రదర్శించారు. అలాగే తొలిరౌండులోనూ ఆయనకే గంపగుత్తగా ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈసారి శివుడికి అత్యంత ఇష్టమైన నగరంలో రికార్డులు సృష్టించడం ఖాయమే. 2014, 2019లోనూ ఆయన భారీ మార్జిన్‌తో గెలుపొందడం విశేషం. ఇక్కడ ఆయన స్థాయికి తగిన ప్రత్యర్థి లేకపోవడం గమనార్హం.

News June 4, 2024

ఆదిలాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ లీడింగ్

image

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ లీడింగ్‌లో ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి గోదం నగేశ్ బరిలో నిలిచారు.

News June 4, 2024

వారణాసిలో మోదీ.. వయనాడ్‌లో రాహుల్ ఆధిక్యం

image

వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు మండిలో BJP MP అభ్యర్థి కంగనా రనౌత్ వెనుకబడగా, బారామతిలో NCP శరద్ వర్గం నుంచి బరిలో నిలిచిన సుప్రియా సూలే లీడ్‌లో ఉన్నారు. మరోవైపు బీహార్‌లో లాలూ కూతుళ్లు ఇద్దరూ వెనకబడ్డారు. పాటలీపుత్రలో మీసా భారతి, సరన్ నుంచి రోహిణి NDA అభ్యర్థుల కంటే వెనకంజలో ఉన్నారు.

News June 4, 2024

EVMలో లెక్కింపు ప్రారంభం

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా EVMలో లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌ల ఓట్ల లెక్కింపు 8గంటలకు ప్రారంభం కాగా, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది.

News June 4, 2024

మోదీ Vs దీదీ.. గెలుపెవరిది?

image

2024 ఎన్నికల్లో భాజపా ఎక్కువగా ఫోకస్ చేసిన ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ 2014లో 34, 2019లో 22 సీట్లు గెలుచుకుంది. 2014లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2019లో ఆ సంఖ్యను 18కి పెంచుకుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు వెలువడే ఫలితాలు బెంగాల్‌లో కీలకంగా మారనున్నాయి.

News June 4, 2024

యూపీని గెలిచినోడికే ‘ఢిల్లీ’ పీఠం

image

అతి పెద్ద బ్యాటిల్ గ్రౌండులో ఆరితేరినవాడే విజేతగా ఆవిర్భవిస్తాడు. లోక్‌సభ ఎన్నికల్లోనూ అంతే. అత్యధిక సీట్లున్న యూపీని ఒడిసిపడితేనే పార్లమెంటులో జయకేతనం ఎగరేస్తారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాకు ఇది బాగా తెలుసు. అందుకే ఈ జోడీ అంతలా శ్రద్ధపెట్టింది. కుల, మత, వర్గ సమీకరణాలతో పాటు సంక్షేమం, శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు 80కి 70+ సీట్లు వస్తాయని అంచనా.

News June 4, 2024

ఉరవకొండ, సింగనమల ‘స్పెషాలిటీ’ రిపీటయ్యేనా?

image

AP: రాష్ట్రంలో ఉరవకొండ, శింగనమల(అనంతపురంD) సెగ్మెంట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతుంది. శింగనమలలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో వీటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. శింగనమలలో వీరాంజనేయులు(YCP), శ్రావణి(TDP), శైలజానాథ్(INC), ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి(YCP), పయ్యావుల కేశవ్(TDP) బరిలో ఉన్నారు.

News June 4, 2024

కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

image

AP: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో టీడీపీ అధినేత చంద్రబాబు 1,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాసేపట్లో ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ వైసీపీ నుంచి KRJ భరత్ బరిలో ఉన్నారు.

News June 4, 2024

ఢిల్లీలో దూసుకెళ్తున్న బీజేపీ

image

దేశ రాజధాని పరిధిలోని 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీలో అధికార పార్టీగా ఉన్న ఆప్ కనీసం ఒక్క చోట కూడా లీడ్ కనబర్చడం లేదు. కేజ్రీవాల్ ఎన్నికల ముందు బెయిల్‌పై బయటకు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేదు అన్పిస్తోంది.