News June 4, 2024

ఎన్నికల ముఖచిత్రం

image

★ మొత్తం ఓటర్లు: 96.9 కోట్లు
★ మొదటిసారి ఓటేసిన వారు: 1.8 కోట్లు
★ 20-29 ఏళ్ల మధ్య వారు: 19.74 కోట్లు
★ మొత్తం పోలింగ్ బూత్‌లు: 10,00,000+
★ ఎన్నికల విధుల్లో ఉద్యోగులు: 1.5 కోట్ల మంది
★ వినియోగించిన ఈవీఎంలు: 55 లక్షలు
★ మొత్తం లోక్‌సభ స్థానాలు: 543
★ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు: ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం

News June 4, 2024

కిషన్‌రెడ్డి, మాధవీలత పూజలు

image

TG: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ పూజలు చేసిన ఆయన మరోసారి కేంద్రంలో ఎన్డీయేదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని అన్నారు. అటు హైదరాబాద్ BJP అభ్యర్థి మాధవీలత సైతం లాల్‌దర్వాజ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. తనదే విజయమని తెలిపారు.

News June 4, 2024

కారు భవితవ్యం ఏమిటో?

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పార్లమెంట్ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనన్ని సీట్లు గెలుపొందేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ప్రచారం నిర్వహించారు. మరి ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేసి వీలైనన్నీ సీట్లు గెలుపొంది పార్టీకి ఊపు తీసుకొస్తారా? బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతుందో కాసేపట్లో తేలనుంది.

News June 4, 2024

TGలో అత్యల్పం.. అత్యధిక రౌండ్లు ఎక్కడంటే?

image

తెలంగాణలోని ఆర్మూరు, భద్రాచలంలో అత్యల్పంగా 13 రౌండ్లలో ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్ల పాటు కౌంటింగ్ సాగనుంది. సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2.18లక్షల మంది ఓట్లు వేశారు.

News June 4, 2024

2019లో ‘సీమ’ ఎంపీల మెజార్టీలు..

image

✒ నంద్యాల-2,26,550(పోచా బ్రహ్మానందరెడ్డి)
✒ తిరుపతి(SC)- 2,12,055(బల్లి దుర్గా ప్రసాద్)
✒ రాజంపేట- 1,57,655(మిథున్ రెడ్డి)
✒ కడప- 1,53,686(అవినాశ్ రెడ్డి)
✒ కర్నూలు- 1,42,947(సంజీవ్ కుమార్)
✒ అనంతపురం- 1,40,439(తలారి రంగయ్య)
✒ హిందూపురం- 1,38,137(గోరంట్ల మాధవ్)
✒ చిత్తూరు(SC)- 1,35,518(రెడ్డప్ప)
ఈసారి ఎవరికి రికార్డు మెజార్టీలు దక్కుతాయో?

News June 4, 2024

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం

image

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన 30నిమిషాల తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అంటే 8.30గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేస్తారు. అటు పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144సెక్షన్ విధించారు.

News June 4, 2024

గోదావరి జిల్లాలో సత్తా చాటే వారిదే అధికారం!

image

AP: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 34 స్థానాలున్న ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే అధికారం కైవసం చేసుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో ప.గో(D)లో 15 స్థానాలకు గాను YCP 13, TDP 2 స్థానాల్లో నెగ్గింది. తూ.గో(D)లో 19 సీట్లలో YCP 15, TDP 4 స్థానాల్లో గెలిచాయి. 5 MP స్థానాలనూ YCPనే సొంతం చేసుకుంది. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

News June 4, 2024

కంటోన్మెంట్: పాగా వేయాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని BRS!

image

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికీ పోలింగ్ జరిగింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ఈ స్థానంలో గెలిచి కంటోన్మెంట్‌లోనూ పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో పట్టు కోల్పోవద్దని BRS చూస్తోంది. BJP సైతం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ నివేదిత(BRS), శ్రీగణేశ్(కాంగ్రెస్), వంశ తిలక్(BJP) పోటీలో ఉన్నారు.

News June 4, 2024

రాయలసీమలో ‘మెజార్టీ’ రికార్డులు బ్రేకయ్యేనా?

image

AP: 2019లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(90,110)తో సీఎం జగన్ పులివెందుల(కడప)లో విజయం సాధించారు. రాయలసీమ జిల్లాలవారీగా చూసుకుంటే గుంతకల్లు(అనంతపురం)లో వెంకట్రామిరెడ్డి 48,532 ఓట్లు, తంబళ్లపల్లి(చిత్తూరు)లో ద్వారకానాథ్ 46,938 ఓట్లు, పత్తికొండ(కర్నూలు)లో కంగాటి శ్రీదేవి 42,065 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈసారి ఈ రికార్డులు ఎవరు బ్రేక్ చేసే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

News June 4, 2024

BREAKING: టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు

image

AP: ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్ టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యారు. నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తికి ఏజెంట్‌గా అధికారులు అవకాశం కల్పించారు.