News January 13, 2025

బీసీసీఐ కొత్త సెక్రటరీ, ట్రెజరర్ ఎవరంటే?

image

బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణమే వీరు తమ బాధ్యతలను చేపడతారని పేర్కొంది. నిన్న జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. జైషా, ఆశిష్ షెలార్ స్థానాలను భర్తీ చేస్తున్న వీరు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు.

Similar News

News February 18, 2025

తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

image

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.

News February 18, 2025

కేసు వాదిస్తుండగా గుండెపోటుతో లాయర్ మృతి

image

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది పసునూరు వేణుగోపాల రావు మరణించారు. ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కోర్టు హాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. లాయర్ మృతితో మిగతా కోర్టు హాళ్లలో రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.

News February 18, 2025

ముస్లిం ఉద్యోగులకే పండుగా.. హిందువుల సంగతేంటి?: రాజాసింగ్

image

TG: రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయేందుకు వెసులుబాటు కల్పించడంపై బీజేపీ MLA రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని ట్వీట్ చేశారు. ‘ఉద్యోగులు త్వరగా ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ హిందువుల పండుగలను విస్మరించింది. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. లేదంటే ఎవరికీ ఉండకూడదు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!