India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు TTD ఛైర్మన్ BR నాయుడు సూచించారు. ఏర్పాట్లలో లోపాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. TTD ఛైర్మన్, EOకు పడటం లేదని, బోర్డులో సమన్వయ లోపం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని EO శ్యామలరావు ఖండించారు. తిరుపతిలోని ఓ స్కూల్ వద్ద జరిగిన ఘటనను తిరుమలలో జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బరి వద్ద కనీసం రూ.20వేల-రూ.30 వేల వరకు పందెం నడుస్తోంది. మొత్తంగా రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయి. మరికొన్ని చోట్ల ఎడ్ల పోటీలు జరుపుతున్నారు. ఈ పందేలు, పోటీలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ, హిందీ భాషల్లో ఈనెల 17న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
రోహిత్ శర్మ ఎప్పటికీ గొప్ప కెప్టెనే అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ‘రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ FINALకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఫామ్ లేమి కారణంగా మ్యాచ్ నుంచి తనకు తానుగా తప్పుకున్న సారథిని నేనిప్పటి వరకు చూడలేదు. తన తొలి ప్రాధాన్యత జట్టేనని రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే అతడి గొప్పతనం’ అని కొనియాడారు.
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్నట్టుగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నారు కరుణ్ నాయర్. కర్ణాటక నుంచి విదర్భకు వెళ్లాక కసికసిగా ఆడుతున్నారు. ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపర్చుకున్న అతడు తాజాగా లిస్ట్A క్రికెట్లో వరుసగా ఐదో సెంచరీ బాదేశారు. SMAT, రంజీల్లోనూ మురిపించారు. IPLలో తననెవరూ చిన్నచూపు చూడొద్దన్న కసితో ఉన్నాడతను. వేలంలో రెండో దఫాలో రూ.50Lకు సొంతం చేసుకున్న ఢిల్లీకిక పండగే!
ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని మాజీ సీఎం KCR పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు ₹4.5లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ను ఆవిష్కరించారు. నెల రోజుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్ రూం (అటాచ్డ్ బాత్రూం) ఉంటాయి. ఈ స్కీంలో భాగంగా ఒక్క ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు ఇస్తుంది. జనవరి 26 నుంచి ఈ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు.
TG: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్ ట్రేడ్ సెంటర్తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించనుంది. 3 ఎకరాల్లో ₹582 కోట్లతో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. వరల్డ్లోనే టాప్-10లో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డ్ చేయనుంది. ఇప్పటికే బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 36 నెలల్లో హోటల్ను అందుబాటులోకి తేవాలని పేర్కొంది.
కెనడాను అమెరికాలో భాగం చేసుకోవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్కు న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్ జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటాం. ఒకవేళ మాతో ఫైట్ చేయాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా దేశంపై ట్రంప్ టారిఫ్స్ వేస్తే మేమూ అదే పని చేస్తాం’ అని హెచ్చరించారు. కాగా మాజీ PM ట్రూడోకు NDP గతంలో మిత్రపక్షంగా ఉండేది.
Sorry, no posts matched your criteria.