News June 4, 2024

ఈటలకు ఈజీనేనా?

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం అయిన మల్కాజిగిరిలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. బలమైన నేత ఈటల రాజేందర్‌ను బరిలో దింపడం, ప్రధాని మోదీ అక్కడ రోడ్‌షో నిర్వహించడంతో గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? సునీతా మహేందర్‌రెడ్డికి జనం జై కొడతారా?లేక బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డివైపు జనం చూస్తారా? అనేది ఉత్కంఠ నెలకొంది.

News June 4, 2024

వీరు ఓడినా.. గెలిచినా పదవిలోనే!

image

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానంలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్, BRS నుంచి లోకల్ MLA పద్మారావుగౌడ్ నువ్వానేనా అంటున్నారు. అయితే.. MP పదవిని వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ వీరు ఓడినా MLAలుగా కొనసాగనున్నారు. గెలిస్తే MP అవుతారు. ఇక్కడ సిట్టింగ్ MP కిషన్‌రెడ్డి(BJP)ని వీరు ఢీకొంటున్నారు.

News June 4, 2024

ELECTIONS: మర్యాద ముఖ్యం బిగులు!

image

కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు, అభ్యర్థులు మర్యాదగా వ్యవహరించాలని ఈసీ కోరింది. కౌంటింగ్ పరంగా ఏవైనా సందేహాలుంటే వాటిని నిర్దేశిత పద్ధతిలో తెలియజేయాలని పేర్కొంది. అలా కాకుండా అల్లర్లు చేసేందుకు, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 53(4) సెక్షన్ కింద వారిని కౌంటింగ్ కేంద్రం నుంచి బహిష్కరించడంతో పాటు కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

News June 4, 2024

రాయలసీమ ముద్దు బిడ్డ ఎవరు?

image

AP: రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల ప్రజలు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో నెలకొంది. 2019లో 52 అసెంబ్లీ స్థానాలకు(కడప-10, కర్నూలు-14, చిత్తూరు-14, అనంతపురం-14)గాను ఏకంగా 49 చోట్ల YCP విజయం సాధించింది. 8 MP స్థానాలనూ సొంతం చేసుకుంది. హిందూపురం(బాలకృష్ణ), ఉరవకొండ(పయ్యావుల కేశవ్), కుప్పం(చంద్రబాబు) మాత్రమే TDP నుంచి గెలిచారు. ఈసారి మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని ఇరుపార్టీలూ ధీమాగా ఉన్నాయి.

News June 4, 2024

సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతున్నారా? జాగ్రత్త!

image

AP: కౌంటింగ్ వేళ రాజకీయ పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రత్యర్థులను బెదిరిస్తూ ఫొటోలు, వీడియోలతో పోస్టులు పెట్టినా, షేర్లు చేసినా <<13368661>>కఠిన చర్యలు<<>> తప్పవని DGP ఇప్పటికే హెచ్చరించారు. కాబట్టి ఏ పార్టీ మద్దతుదారులైనా సంయమనం పాటించండి. పంతాలు, ఇగోలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు.#BE CAREFUL

News June 4, 2024

ఉత్తరాంధ్రలో ఆధిక్యం ఎవరిదో?

image

AP: ఉత్తరాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో YCP 34 స్థానాలకు గాను 28 స్థానాల్లో గెలిచింది. TDP కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. VSPలో 4, SKLMలో 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. VZMలో ఒకస్థానంలో కూడా గెలవలేదు. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొనడంతో ప్రజలు ఏ పార్టీకి పట్టంగట్టారోనన్న ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది.

News June 4, 2024

డబుల్ డిజిట్ దక్కేదెవరికో?

image

TG: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. BRS 0-1 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో.. డబుల్ డిజిట్ సీట్లు కాంగ్రెస్, BJPల్లో ఎవరికి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణలో డబుల్ డిజిట్ ఎవరిని వరిస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ ద్వారా తెలియజేయండి.

News June 4, 2024

కోడ్‌ ముగిసినా పలు రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు

image

ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా AP సహా కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బలగాల సేవలను కొనసాగించాలని EC నిర్ణయించింది. కోడ్‌ ముగిసినా బలగాలను మోహరించడం ఇదే తొలిసారి కానుంది. AP, బెంగాల్, UP, మణిపుర్‌ వంటి రాష్ట్రాల్లో 15 రోజుల పాటు ఇవి అందుబాటులో ఉంటాయి. హింసకు ఆస్కారం ఉండదని తాము నమ్ముతున్నా, అలాంటి అవకాశం తలెత్తే రాష్ట్రాల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

News June 4, 2024

అందరిచూపు మాధవీలతపైనే..

image

TG: పోటీచేస్తున్న తొలిసారే ప్రధాని మోదీ చేత ప్రశంసలు అందుకున్న బీజేపీ HYD అభ్యర్థి కొంపెల్లి మాధవీలత భవితవ్యం కాసేపట్లో తేలనుంది. హిందూత్వమే ప్రధాన అస్త్రంగా ఆమె ప్రచారంలో దూసుకెళ్లారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. MIM కంచుకోటను ఆమె బద్దలు కొడతారా? వరుసగా 4సార్లు ఎంపీగా విజయం సాధించిన అసదుద్దీన్ ఓవైసీతో ఏమేరకు పోటీ ఇవ్వగలరనేది ఆసక్తిగా మారింది.

News June 4, 2024

కాసేపట్లో ప్రజాతీర్పు

image

AP ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఉ.8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8.30 గంటలకు EVMల కౌంటింగ్ షురూ కానుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది. రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో తొలి ఫలితం రానుండగా.. అమలాపురం ఫలితం ఆలస్యం కానుంది. EVM కౌంటింగ్‌కు ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాలు పట్టనుండగా మ.1 కల్లా మెజార్టీ ఎవరిదో తేలనుంది.