India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
<<15141868>>అంచనా<<>> వేసినట్టే దేశీయ స్టాక్మార్కెట్లు భారీ గ్యాప్డౌన్తో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 23,217 (-213), సెన్సెక్స్ 76,707 (-675) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో పొద్దున్నే రూ.3లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.85 పాయింట్లు పెరిగి 15.94కు చేరుకుంది. ఆటో, మెటల్, ఫార్మా, ఫైనాన్స్, రియాల్టి, హెల్త్కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు విలవిల్లాడుతున్నాయి.
ఇంటిల్లిపాది పండగ చేసుకుంటుంటే వారి ఇళ్లు మాత్రం బోసిపోతుంటాయి. తల్లిదండ్రులు, బామ్మా తాతలు, తోబుట్టువులు, మిత్రులతో కలిసి పిల్లలు సందడి చేస్తుంటే వారి ఇళ్లలోనేమో డ్యూటీకి వెళ్లిన నాన్న, అమ్మ ఎప్పుడొస్తారోనని ఎదురు చూస్తుంటారు. రైల్వే, RTC, పోలీస్, హాస్పిటల్, మీడియా సహా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్లు పండగ వేళల్లోనే ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. మనకోసం వేడుకను త్యాగం చేస్తున్న వారికి థాంక్స్ చెబుదామా!
యూపీలోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి 45 రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది. భూ మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా దీనిని పేర్కొంటారన్న సంగతి తెలిసిందే.
IPL చరిత్రలో ఎక్కువ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టుకు 17 మంది సారథులు వచ్చారు. అందులో యువరాజ్, సంగక్కర, జయవర్దనే, గిల్క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్, మయాంక్ అగర్వాల్, ధవన్, సామ్ కరన్, జితేశ్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీమ్ ఒక్క కప్పు కూడా కొట్టలేదు. తాజాగా శ్రేయస్ కెప్టెన్ అయ్యారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<15137555>>కౌశిక్ రెడ్డిపై<<>> 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని, సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీవో, గ్రంథాలయ ఛైర్మన్, సంజయ్ పీఏ వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు 3 కేసులను నమోదు చేశారు. నిన్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సందర్భంగా ‘నీది ఏ పార్టీ?’ అంటూ సంజయ్ను కౌశిక్ నిలదీయడంతో తోపులాట జరిగిన సంగతి తెలిసిందే.
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో స్తబ్ధుగా చలించాయి. మార్కెట్ విలువ 0.05% తగ్గి $3.31Tకు చేరుకుంది. నిన్న 0.36% తగ్గిన బిట్కాయిన్ నేడు వ్యవధిలోనే 1.34% పడిపోయింది. $95,920 నుంచి $94,150కు చేరుకుంది. అంటే $1770 (Rs 1.50L) మేర తగ్గింది. మార్కెట్ డామినెన్స్ 56.7%గా ఉంది. ఇక ఎథీరియం 0.79% పడిపోయి $3,258 వద్ద ట్రేడవుతోంది. XRP 0.12, BNB 1.0, DOGE 1.42, ADA 6.55, TRX 3.60, AVAX 2.55% మేర ఎరుపెక్కాయి.
రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ అందజేస్తోంది. అర్హులైన వారు రెండేళ్ల పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్ను చూడొచ్చు. యూజర్లు రూ.888, రూ.1199, రూ.1499, రూ.2499, రూ.3499 లలో ఏదైనా ప్లాన్ కలిగి ఉండాలి.
TGలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 4 ఏళ్లలో 7లక్షల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 75వేల మంది రైతులకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల్లో వెదురు సాగు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.
TG: వెదురు సాగుకు తొలుత 5వేల మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఎకరంలో 60 మొక్కల్ని నాటుతారు. 30 ఏళ్ల వరకూ సాగు చేసుకోవచ్చు. ఎకరాకు ₹20వేల పెట్టుబడితో ఏడాదికి ₹40,000-₹60,000 ఆదాయం వచ్చే ఛాన్సుంది. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీని సాగును ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయించింది.
స్టాక్మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో చలించొచ్చు. US జాబ్డేటా మెరుగ్గా ఉండటంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఫెడ్ వడ్డీరేట్లను కత్తిరించే అవకాశం లేకపోవడం ప్రతికూలంగా మారింది. US ట్రెజరీ యీల్డులు, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. జీవితకాల గరిష్ఠం నుంచి 11% మేర పతనమైన నిఫ్టీ 23,350 సపోర్టును మళ్లీ బ్రేక్ చేస్తే బేర్స్ విరుచుకుపడతాయని నిపుణుల అంచనా.
Sorry, no posts matched your criteria.