India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నందమూరి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్సులో అదరగొడుతున్నారు. అఖండ నుంచి వరుసగా 4 సినిమాలు హిట్ అయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీటికి ముందు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ మూవీలతో బాలయ్య పరాజయాలను ఎదుర్కొన్నారు. బాలకృష్ణ తన తర్వాతి సినిమా బోయపాటితో అఖండ-2 చేయబోతున్నారు.
ఇవాళ చాలా ప్రత్యేకమైనది. పుష్య మాసంలో సోమవారం రోజున భోగి, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు. ఏకాదశ రుద్రాలను పూజిస్తే లభించే ఫలితం ఇవాళ శివుడిని పూజిస్తే కలుగుతుందని అంటున్నారు. నువ్వుల నూనెతో దీపారాధన, పూజగదిలో శివ లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఓం నమ: శివాయ అని పఠిస్తే ప్రయోజనకరమని అంటున్నారు.
ఖో ఖో క్రీడా చరిత్రలోనే తొలి వరల్డ్ కప్ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. భారత ఖోఖో సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 23 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. భారత పురుషుల జట్టు నేడు నేపాల్తో, మహిళల జట్టు రేపు ద.కొరియాతో ఆడనుంది. రాత్రి 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, DD స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు. తెలుగు కుర్రాళ్లు శివారెడ్డి, జానకిరామ్(స్టాండ్ బై)కి జట్టులో చోటు దక్కింది.
భుగ్ అనే సంస్కృత పదం నుంచి ‘భోగి’ అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనది. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజున విష్ణువు వామనావతరంలో బలిని పాతాళానికి అణచివేశాడు. గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలకులను రక్షించారని చెబుతారు. వీటన్నింటికి ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పురాణ గాథ.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన స్క్వాడ్ ప్రకటించింది. కమిన్స్ సారథిగా ఉంటారని వెల్లడించింది.
టీమ్: కమిన్స్ (C), హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, షార్ట్, స్టాయినిస్, ఇల్లిస్, ఇంగ్లిస్, కారే, హార్డీ, మ్యాక్స్వెల్, జంపా, స్టార్క్, హేజిల్వుడ్.
సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.
సినీ అభిమానులకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. పైగా తమ ఫేవరేట్ హీరోల చిత్రాలు విడుదలైతే వారు చేసే సందడి మామూలుగా ఉండదు. అలాగే TFI బాగుండాలని కొందరు కోరుకుంటారు. ఈ క్రమంలో APలోని యడ్లపాడులో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. బాలయ్య, చెర్రీ, వెంకీమామ సినిమా పేర్లతో ‘మేం మేం బానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి’ అని సంక్రాంతి విషెస్ తెలిపారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.
TG: నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలకు 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు హాజరుకానున్నారు. దీంతో పాటు స్వీట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలు ఇక్కడి స్టాళ్లలో ప్రదర్శిస్తారు. ఈ వేడుకలకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు పోస్టర్ను రిలీజ్ చేశారు.
విజయ హజారే ట్రోఫీ తుది అంకానికి చేరింది. హరియాణా, కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర జట్లు సెమీస్ చేరాయి. ఈ నెల 15న హరియాణా, కర్ణాటక తలపడనుండగా, 16న విదర్భ, మహారాష్ట్ర పోటీ పడనున్నాయి. విజేతగా నిలిచిన టీమ్స్ ఈ నెల 18న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
నేటి నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.
Sorry, no posts matched your criteria.