India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హ్యాట్రిక్పై బీజేపీ ధీమా వెనుక ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ‘మోదీ ఇమేజ్ కీలక పాత్ర పోషించింది. కార్యకర్తలు, RSS అండ ఆ పార్టీకి బలంగా మారింది. ఆర్థికంగా బలంగా ఉండటమూ పార్టీకి కలిసొచ్చింది. మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా ప్రచారం చేసి ఓటర్ బేస్ పెంచుకునే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికల్లో ఓట్ షేర్ 45%కు పెరగడంతో ఈసారి కూడా ఆ ప్రభావం ఉండొచ్చని ధీమాగా ఉంది’ అని పేర్కొన్నారు.
రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా మొదలైన రాష్ట్రాలు ఈ రెండో జాబితాలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఆ 119 స్థానాలు గెలవడం సవాల్గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ 2019 లెక్కలను మార్చగలిగితే ఇప్పుడు ఆశిస్తున్న టార్గెట్ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే మళ్లీ అధికారమని అంచనా వేస్తున్నా ఇండియా కూటమి మాత్రం తాము 295 సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. అయితే కూటమికి అంతమొత్తంలో సీట్లు రావడం సవాల్తో కూడుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలు, యూపీ, బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, లక్షద్వీప్, అండమాన్, జమ్మూకశ్మీర్ నుంచి 295 స్థానాల్లో 176 గెలిచినా మిగతా రాష్ట్రాల్లో 119 సీట్లు గెలవాలి’ అని పేర్కొన్నారు.
కృత్రిమంగా తయారైన ఫ్రూట్ జ్యూస్లను ‘100% ఫ్రూట్ జ్యూస్’గా పేర్కొంటూ మార్కెట్లో సంస్థలు విక్రయించడాన్ని FSSAI తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాగ్ను తొలగించాలని తయారీ సంస్థలను ఆదేశించింది. ఇప్పటికే ప్రింట్ చేయించిన ఉత్పత్తులపైనా ట్యాగ్స్ను తొలగించేందుకు SEP 1 వరకు గడవు ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ప్రకారం కృత్రిమ పానీయాలను ‘100% ఫ్రూట్ జ్యూస్’గా పేర్కొనడం సరికాదని తెలిపింది.
నేడు వెల్లడికానున్న లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు NDAదే విజయమని, ఆ కూటమికి 350కిపైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తాము గెలుపొందుతామని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంచనాలకు తగినట్టు బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? లేక ఫలితాల్లో ట్విస్ట్ ఉంటుందా? అనేది చర్చనీయాంశమైంది.
ఇకపై టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను డీడీ స్పోర్ట్స్లో టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రసారభారతి ప్రకటించింది. జులై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ గేమ్స్నూ ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28-సెప్టెంబరు 8 మధ్య జరిగే పారాలింపిక్స్ గేమ్స్ కూడా లైవ్ చూడొచ్చని పేర్కొంది. మరోవైపు ఫ్రెంచ్ ఓపన్, వింబుల్డన్ ఫైనల్స్ కూడా టెలికాస్ట్ చేస్తామని వెల్లడించింది.
* 1897: స్వాతంత్ర్య సమరయోధుడు వెన్నెలకంటి రాఘవయ్య జననం
* 1946: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జననం
* 1961: సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి జననం
* 1968: నటుడు తొట్టెంపూడి వేణు జననం
* 1984: సినీ నటి ప్రియమణి జననం
* 1998: సాహితీవేత్త ఆరుద్ర మరణం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TGలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో తొలి ఫలితం నేడు మ.ఒంటి గంట కల్లా నిజామాబాద్ సీటులో వెలువడనుంది. ఇక్కడ కేవలం 15రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మరోవైపు కరీంనగర్, నల్గొండ, HYD నియోజకవర్గాల ఫలితాలు చివర్లో(24 రౌండ్లు) వచ్చే అవకాశముంది. ఇక చేవెళ్లలో 23, మల్కాజిగిరిలో 21, SEC 20, ADB 23, PDPL 21, ZHB 23, MDK 23, WGL 18, BNR 23, MHBD 22, KHM 21, MHBR 21, NGKL 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది.
టీ20 ప్రపంచకప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సఫారీల ధాటికి 77 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ మెండిస్ 19(30), కమిందు మెండిస్ 11(15), మాథ్యూస్ 16(16) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. దీంతో ప్రోటీస్ జట్టు 16.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. సఫారీ బౌలర్ నార్ట్జే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.
Sorry, no posts matched your criteria.