News June 3, 2024

ఎక్కడా విద్యుత్ కోతలు లేవు: తెలంగాణ కాంగ్రెస్

image

తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చెట్ల కొమ్మలను తొలగించేందుకు, స్తంభాల మెయింటెనెన్స్ కోసం మాత్రమే విద్యుత్ నిలిపివేస్తున్నాం తప్ప కోతలు ఎక్కడా లేవు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అనవసరంగా విద్యుత్ నిలిపివేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. BRS నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించింది.

News June 3, 2024

అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ ఎవరంటే?

image

దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు BJP MP ప్రీతమ్ ముండే పేరిట ఉంది. తండ్రి గోపినాథ్ మరణంతో 2014లో జరిగిన ఉపఎన్నికలో మహారాష్ట్ర బీడ్ నియోజకవర్గం నుంచి ప్రీతమ్ బరిలోకి దిగారు. ఈ స్థానంలో 6.96 లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో CR పాటిల్(నవసరి) 6.89 లక్షలు, సంజయ్ భాటియా(కర్నాల్) 6.56 లక్షల మెజారిటీతో ఉన్నారు.

News June 3, 2024

image

https://d29i5havsxvi1j.cloudfront.net/cd-timer/exitpolls-cd-timer.html

News June 3, 2024

బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర!

image

గతనెల 20న బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహణలో నటి హేమ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురితో కలిసి ఆమె రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఇందులో డ్రగ్స్ కూడా వాడినట్లు తేలడంతో పార్టీలో పాల్గొన్న వారందరికీ టెస్టులు నిర్వహించారు. అందులో 86 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో హేమ కూడా ఉండటంతో తాజాగా ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 3, 2024

అరుదైన వ్యాధి.. మహిళ ప్రేగుల్లో ఆల్కహాల్ ఉత్పత్తి

image

కెనడాలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ(50)కు వైద్యులు చికిత్స అందించారు. ఈ వ్యాధి ఉన్నవారి ప్రేగుల్లో శిలీంధ్రాలు కిణ్వ ప్రక్రియతో ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వారు అస్పష్టంగా మాట్లాడుతూ, పగలు నిద్రపోతూ ఉంటారు. UTI సమస్యలకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుందట. యాంటీ ఫంగల్ ఔషధాలు, లో కార్బోహైడ్రేట్ ఆహారంతో ఆమెకు చికిత్స చేశారు.

News June 3, 2024

కాకతీయ కళాతోరణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సీతక్క

image

TG: రాష్ట్రీయ గీతాన్ని వివాదం చేయడం తగదని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం కొనసాగింపు లేదా తొలగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మెజారిటీ ప్రజల ఇష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 3, 2024

T20 WC: న్యూయార్క్‌ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్

image

T20 WC మ్యాచులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్‌ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఈనెల 12 వరకు ఇక్కడ జరిగే మ్యాచులకు స్పెషల్ వెపన్స్&టాక్టిక్స్ టీమ్స్‌తో పాటు స్నైపర్స్ భద్రతగా ఉంటారు. అలాగే డ్రోన్ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే వేదికలో ఈనెల 9న IND, PAK మ్యాచ్ జరగనుంది.

News June 3, 2024

వాట్సాప్‌లో ఫలితాల పేరుతో ఫేక్ ఫైల్స్.. ఓపెన్ చేయొద్దన్న పోలీసులు

image

రేపు కౌంటింగ్ జరగనుండగా ఎలక్షన్ ఫలితాల పేరుతో మోసగాళ్లు సైబర్ నేరాలకు తెరలేపారు. వాట్సాప్‌లో ఫేక్ ఫైల్స్, లింకులు పంపుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వాటిని ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీీసీఎస్ పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్‌ ఫైల్స్‌తో మొబైల్ హ్యాక్ లేదా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

News June 3, 2024

ISIకి రహస్య సమాచారం.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవితఖైదు

image

బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించింది. పాకిస్థాన్ ISIకి రహస్య సమాచారం చేరవేశారనే కేసులో అతడు దోషిగా తేలాడు. దీంతో కోర్టు నిషాంత్‌కు అధికారిక రహస్యాల చట్టం కింద మరో 14 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.3000 ఫైన్ వేసింది. నాగ్‌పూర్‌లోని మిస్సైల్ సెక్షన్‌లో టెక్నికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంజినీర్‌గా పనిచేసే నిషాంత్‌ను ATS అధికారులు 2018లో అరెస్ట్ చేశారు.

News June 3, 2024

హార్దిక్-నటాషా కలిసిపోయారా?

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య-నటి నటాషా విడాకులు తీసుకోలేదా? మళ్లీ కలిసి పోయారా? అంటే నటాషా ఇన్‌స్టా ఖాతాను చూస్తే అవుననే అనిపిస్తోంది. తన ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలను తొలగించి డివోర్స్ వార్తలకు ఛాన్స్ ఇచ్చిన ఆమె తాజాగా వాటిని రీస్టోర్ చేశారు. నటాషా ఖాతాలో పెళ్లి ఫొటోలు కనిపిస్తున్నాయి. దీంతో మనసు మార్చుకుని మళ్లీ ఇరువురూ కలిసిపోయినట్లు తెలుస్తోంది. వీరికి 2020లో పెళ్లి కాగా కొడుకు అగస్త్య ఉన్నారు.