India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూయార్క్ గ్రౌండ్ సాఫ్ట్గా ఉన్నందున ప్లేయర్ల లోయర్ లెగ్, తొడ కండరాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. అందువల్ల భారత ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే మైదానంలో బంగ్లాదేశ్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో ఎల్లుండి ఐర్లాండ్తో, 9న పాక్తో, 12న USతో ఇండియా ఇదే స్టేడియంలో తలపడనుంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్టులో ఆయన పారిశ్రామిక దిగ్గజాలైన బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ని అధిగమించారు. మస్క్ ఆస్తుల విలువ 210.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్(201 బి.డాలర్లు), జెఫ్ బెజోస్(197.4 బి.డాలర్లు), ఫేస్బుక్ CEO జుకర్బర్గ్($163.9 B), ఓరాకిల్ కోఫౌండర్ లారీ ఎలిసన్($146.2 B) తర్వాతి 4స్థానాల్లో ఉన్నారు.
లోక్సభ-2024 ఎన్నికల్లో ఫేజ్-1లో అత్యధిక మంది ఓటేసినట్లు ఈసీ తెలిపింది. మొదటి దశలో 12.27 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఫేజ్-2లో 7.47 కోట్లు, ఫేజ్-3: 9.19 కోట్లు, ఫేజ్-4: 11.04 కోట్లు, ఫేజ్-5: 8.72 కోట్లు, ఫేజ్-6: 9.22 కోట్లు, ఫేజ్-7లో 4.09 కోట్ల మంది ఓటు వేశారని వివరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటేశారు.
TG: నైరుతి రుతుపవనాలు తెలంగాణ తీరాన్ని తాకాయి. నాగర్కర్నూల్, గద్వాల్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో పూర్తిగా రాష్ట్రంలో విస్తరించనున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఖాన్యూనిస్లోని సౌత్ సిటీలో వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులున్నారు. గాజాలో హమాస్ అధికారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఇజ్రాయెల్ మంత్రి గల్లాంట్ తెలిపారు. ఇటు కాల్పుల విరమణ చేపట్టి బందీలను విడుదల చేయాలన్న అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నట్లు హమాస్ తెలిపింది.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
స్టాక్ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేయగల అంశాల్లో ఎన్నికలు కూడా ఉంటాయి. కొత్త ప్రభుత్వంలో పాలసీలు, నిర్ణయాల అంచనాలతో స్టాక్స్ ఒడుదొడుకులకు లోనవుతాయి. అయితే కొన్ని రంగాలపై అంతగా ప్రభావం ఉండదు. వాటిలో ఆటోమొబైల్స్, పవర్, టెక్నాలజీ, ఇన్సూరెన్స్, ఫెర్టిలైజర్స్&కెమికల్స్, టెలికాం, ఫార్మా, గ్లోబల్ కమోడిటీస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమయంలోనైనా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచిస్తున్నారు.
AP: చంద్రగిరిలో <<13249712>>ఫాం-17A<<>>(ఓటర్ల జాబితా పరిశీలన), ఇతర డాక్యుమెంట్లు మరోసారి పరిశీలించాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.
మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.
ఎగ్జిట్పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ <<13366755>>లాభాల్లో<<>> కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.12.48 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందారు. PSU బ్యాంకులు, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, రియాల్టీ, ఆటో రంగాలు 3-5 శాతం లాభాలు పొందాయి. ఇవాళ ఒకానొక దశలో సెన్సెక్స్ 2,621 పాయింట్ల లాభంతో 76,583, నిఫ్టీ 800 పాయింట్ల లాభంతో 23,227 పాయింట్ల గరిష్ఠాలను తాకాయి.
Sorry, no posts matched your criteria.