India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెంపుడు కుక్కలను సొంత పిల్లల్లాగా చూసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొందరు వాటికి పుట్టినరోజులు, సీమంతాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఝార్ఖండ్కు చెందిన సప్నా అనే మహిళ తన కుక్క బర్త్ డే కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. వేడుక కోసం రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్ను ఏర్పాటు చేయగా 300 మందికి ఆతిథ్యాన్ని అందించడం విశేషం.
TG: విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై రాష్ట్రం కోసం పని చేస్తాయని, తెలంగాణలోనూ ఆ సంప్రదాయం రావాలని తెలిపారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.
టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పని ఒత్తిడి వల్ల వారికి ఆడడం కుదరకపోతే ముందుగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనుమతి తీసుకోవాలని సమాచారం. దీనిని అతిక్రమించినవారిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లనే జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
AP: ఏ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగా తాను మారలేదని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. డబ్బు దోచుకునే వాళ్లలో కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటేనే భయమేస్తోందని, రానున్న రోజుల్లో పోటీ చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించారు. కల్కాజీ నుంచి పోటీ చేసేందుకు రూ.40లక్షలు కావాలంటూ లింకును షేర్ చేశారు. నిజాయితీగా పనిచేసేందుకు AAPకి సామాన్యులిచ్చే చిన్న చిన్న విరాళాలే సాయపడతాయని అన్నారు. ‘ఐదేళ్లు MLA, మంత్రి, ఇప్పుడు ఢిల్లీ CMగా ఉన్న నాకు మీరు వెన్నంటే నిలిచారు. మీ బ్లెసింగ్స్, సపోర్ట్ లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. మీ విరాళాలే నాకు తోడ్పాటునిస్తాయి’ అన్నారు.
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత రూ.6వేల చొప్పున నేరుగా అకౌంట్లలోకి జమ చేయనుంది. కాగా ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లినవారిని పరిగణనలోకి తీసుకోనుంది.
AP: తిరుమల ప్రసాదాన్ని కూటమి సర్కార్ రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ’ అని ఆయన ధ్వజమెత్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.
Sorry, no posts matched your criteria.