News June 3, 2024

గాజాపై ఆగని దాడులు.. 19 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఖాన్‌యూనిస్‌లోని సౌత్ సిటీలో వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులున్నారు. గాజాలో హమాస్ అధికారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఇజ్రాయెల్ మంత్రి గల్లాంట్ తెలిపారు. ఇటు కాల్పుల విరమణ చేపట్టి బందీలను విడుదల చేయాలన్న అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నట్లు హమాస్ తెలిపింది.

News June 3, 2024

ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది: సీతారాం ఏచూరి

image

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 3, 2024

‘ఎలక్షన్ ప్రూఫ్’ రంగాలివే!

image

స్టాక్ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేయగల అంశాల్లో ఎన్నికలు కూడా ఉంటాయి. కొత్త ప్రభుత్వంలో పాలసీలు, నిర్ణయాల అంచనాలతో స్టాక్స్ ఒడుదొడుకులకు లోనవుతాయి. అయితే కొన్ని రంగాలపై అంతగా ప్రభావం ఉండదు. వాటిలో ఆటోమొబైల్స్, పవర్, టెక్నాలజీ, ఇన్సూరెన్స్, ఫెర్టిలైజర్స్&కెమికల్స్, టెలికాం, ఫార్మా, గ్లోబల్ కమోడిటీస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమయంలోనైనా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచిస్తున్నారు.

News June 3, 2024

వైసీపీ అభ్యర్థి పిటిషన్ కొట్టేసిన సుప్రీం

image

AP: చంద్రగిరిలో <<13249712>>ఫాం-17A<<>>(ఓటర్ల జాబితా పరిశీలన), ఇతర డాక్యుమెంట్లు మరోసారి పరిశీలించాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.

News June 3, 2024

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్‌బామ్!

image

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్‌బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్‌కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.

News June 3, 2024

స్టాక్ మార్కెట్ల జోరు.. ₹12.48L cr లాభం

image

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ <<13366755>>లాభాల్లో<<>> కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.12.48 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందారు. PSU బ్యాంకులు, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, రియాల్టీ, ఆటో రంగాలు 3-5 శాతం లాభాలు పొందాయి. ఇవాళ ఒకానొక దశలో సెన్సెక్స్ 2,621 పాయింట్ల లాభంతో 76,583, నిఫ్టీ 800 పాయింట్ల లాభంతో 23,227 పాయింట్ల గరిష్ఠాలను తాకాయి.

News June 3, 2024

టెన్షన్.. టెన్షన్

image

AP ఎన్నికల కౌటింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్. మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు వెలువడనుండగా.. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ నలుగురు వ్యక్తులు కలిసినా రిజల్ట్‌పైనే చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ భిన్న అంచనాలను వెల్లడించడంతో ఓటర్ల తీర్పు ఎవరికీ అర్థం కావడం లేదు. వైసీపీ, టీడీపీ మాత్రం అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రేపు ఈ సమయానికి ఓటర్లు ఏ గట్టున ఉన్నారన్న విషయం తేలిపోనుంది.

News June 3, 2024

ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: ఈసీ

image

దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు.

News June 3, 2024

దొంగతనానికి వెళ్లి AC ఆన్ చేసుకుని నిద్రపోయాడు

image

UPలోని లక్నోలో ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. పోలీసులు అతడిని నిద్రలేపి అరెస్టు చేశారు. ఓ డాక్టర్ కుటుంబం పనిమీద వారణాసికి వెళ్లగా, పీకలదాకా మద్యం తాగిన దొంగ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఏసీ ఆన్ చేసుకుని నేలపై పడుకున్నాడు. బయట గేట్ ఓపెన్ చేసి ఉండటంతో పక్కింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు.

News June 3, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,110 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కు చేరింది.