India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2016, 2019లో సరిగ్గా ఇదేరోజు ఒకే ప్రత్యర్థిపై సెంచరీల మోత మోగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచుల్లో 2016లో 163 బంతుల్లో 171, 2019లో 129 బంతుల్లో 133 రన్స్ చేసి ఔరా అనిపించారు. అయితే, డబుల్ సెంచరీలను సైతం అలవోకగా చేసే సత్తా ఉన్న రోహిత్.. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్లో తడబడుతుండటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రస్తుతానికి ఎలాంటి సమస్యల్లేవని హీరో విశాల్ చెప్పారు. ‘మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్లే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. నేను పని నుంచి తప్పించుకుంటానని, 3-6 నెలలకోసారి సినిమాల నుంచి రెస్ట్ తీసుకుంటానని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నా చేతులు వణకట్లేదు. అంతా బాగానే ఉంది’ అని “మద గజ రాజు” ప్రీమియర్ షోలో వ్యాఖ్యానించారు.
ప్రజలు తమ పాపాలు కడుక్కొనేందుకే గంగలో మునుగుతారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. అందుకే వారంతా ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాకు వెళ్తారని పేర్కొన్నారు. వారి కోరికలు స్వార్థమైనవని అన్నారు. దీంతో ఆయనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎంఐఎం, ఇప్పుడు కాంగ్రెస్ కుంభమేళాను అవమానించాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ ఇంతేనని అంటున్నాయి.
కారు కొనాలంటే డబ్బులుంటే చాలు అనుకుంటున్నారా? దానిని పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండాలంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం ఫడణవీస్ కొత్త రూల్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం కారు రిజిస్ట్రేషన్ సమయంలో ‘పార్కింగ్ ఏరియా’ సర్టిఫికెట్ సమర్పించాలి. ముంబై, నాగ్పుర్, పుణేతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.
పోప్ ఫ్రాన్సిస్కు అమెరికా సర్కారు తమ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటించింది. ఈ నెల 20న జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా పలు కీలక నిర్ణయాల్ని ఆయన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోప్నకు పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం. కాగా.. ప్రపంచ సుస్థిరత, శాంతికి అద్భుతమైన కృషి చేసినవారికి అమెరికా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటిస్తుంటుంది.
‘చంబల్’ నీటి కష్టాలు తీర్చేందుకు ఓ చీఫ్ ఇంజినీర్ ‘డాకు మహారాజ్’లా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. బాలయ్య క్యారెక్టర్ మేకోవర్, యాక్షన్ సీన్లు, తమన్ BGM గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 20 ని.లు హైలైట్. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ స్లో అవుతుంది. ఎమోషన్లకు పెద్దపీట వేసి, మాస్ ఎలివేషన్లను తగ్గించారు. క్లైమాక్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో పుంజుకున్నాయి. మార్కెట్ విలువ 1.20% పెరిగి $3.32Tకి చేరుకుంది. రేంజుబౌండ్లో చలించిన బిట్కాయిన్ $126 తగ్గి $94,599 వద్ద ముగిసింది. ప్రస్తుతం $94,597 వద్ద కొనసాగుతోంది. డామినెన్స్ 56.5 శాతంగా ఉంది. ఎథీరియం 1.14% పెరిగి $3279 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ డామినెన్స్ 11.9 శాతంగా ఉంది. XRP 8.98, BNB 0.44, SOL 0.74, DOGE 3.44, ADA 10, AVAX 2.26 శాతం లాభపడ్డాయి.
Sorry, no posts matched your criteria.