News January 11, 2025

మూడు రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 13 నుంచి15 వరకూ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించిన లోగోను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. జాతీయ‌, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంట‌ల‌ను స్టాళ్ల‌లో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

News January 11, 2025

మద్యం తాగేవారికి క్యాన్సర్ ముప్పు: వైద్యులు

image

ఆల్కహాల్ వినియోగం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పెద్దపేగు & మల క్యాన్సర్ వస్తుందని పేర్కొన్నారు. రోజుకు 20 గ్రాముల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ 15శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. దీంతోపాటు రోజుకు 30గ్రా ఎర్రమాంసం తినడం వల్ల కూడా పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 8% ఎక్కువని తేలింది. ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్లను తగ్గించవచ్చు.

News January 11, 2025

భన్సాలీతో అల్లు అర్జున్ భేటీ.. త్వరలో క్రేజీ ప్రాజెక్ట్?

image

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ ఇటీవల ముంబైలో కలిశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మీడియాకు దూరంగా వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైనే చర్చలు సాగాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి సినిమాల తర్వాత భన్సాలీతో గ్లోబల్ స్థాయిలో మూవీ ఉంటుందని సమాచారం.

News January 11, 2025

హార్దిక్ పాండ్యకు BCCI ఝలక్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీని అతడికి కాకుండా మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కట్టబెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ <<15128809>>సిరీస్‌కు <<>>స్టార్ పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.

News January 11, 2025

మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్

image

TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News January 11, 2025

గాయంతో హీరోయిన్ రష్మిక(PHOTOS)

image

జిమ్‌లో గాయపడ్డ హీరోయిన్ రష్మిక తాజా ఫొటోలను పంచుకున్నారు. ‘కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్‌లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. ఆలస్యానికి నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా తిరిగొచ్చి యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తాను’ అని ఆమె పోస్ట్ పెట్టారు.

News January 11, 2025

విద్యార్థులకు శుభవార్త: లోకేశ్

image

AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.

News January 11, 2025

భారత్-ఇంగ్లండ్ T20 సిరీస్ షెడ్యూల్

image

☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.

News January 11, 2025

యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే

image

టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌కు మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. బీజీటీలో రాణించిన జైస్వాల్‌‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైస్వాల్ అద్భుత ఫామ్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మండిపడుతున్నారు. గత ఐపీఎల్‌లో కూడా ఆయన రాణించారని, సెలక్ట్ చేయాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.

News January 11, 2025

‘ఇండియన్-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు క్రాస్ చేసిన ‘గేమ్ ఛేంజర్’!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రెండో రోజూ భారీగానే కలెక్షన్లు వస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ వసూళ్లు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు దాటేసినట్లు తెలిపాయి. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.151 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కాగా, ‘గేమ్ ఛేంజర్’ మొదటి రోజే రూ.186 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.