India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్కప్లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్ ఫామ్లో లేనందున ఇదే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో విరాట్ అద్భుతంగా ఆడారన్నారు. ఉత్తమ ప్లేయర్లు ఎక్కడ ఆడినా మంచి ప్రదర్శనే చేస్తారని తెలిపారు. కాగా బంగ్లాతో వార్మప్ మ్యాచులో రోహిత్తో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశారు.
తేది: జూన్ 3, సోమవారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు అసర్: సాయంత్రం 4:50 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:48 గంటలకు ఇష: రాత్రి 8.09 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 3, సోమవారం బ.ద్వాదశి: అర్ధరాత్రి 12.18 గంటలకు అశ్విని: అర్ధరాత్రి 12:05 గంటల వరకు దుర్ముహూర్తం: సాయంత్రం గం.12:31 నుంచి 01:23 వరకు తిరిగి మధ్యాహ్నం గం.03.06 నుంచి 03.58 వరకు వర్జ్యం: రాత్రి 08:20 నుంచి 09:50 వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
* TG: మూడు జోన్లుగా తెలంగాణ: రేవంత్ రెడ్డి
* TG: ఇప్పుడు ఎన్నికలొస్తే BRSకు 105 సీట్లొస్తాయని అంచనా: KCR
* TG: ‘జయ జయహే తెలంగాణ’ పాటను ఖూనీ చేశారు: శ్రవణ్
* అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: అరుణాచల్ ప్రదేశ్లో BJP, సిక్కింలో SKM గెలుపు
* ఏపీలో కూటమిదే అధికారం: ఇండియా టుడే
* ఏపీని తాకిన రుతుపవనాలు
తాజాగా India Today Axis My India వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్లో ఏపీలో <<13363723>>కూటమి<<>> ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 37-40, వైసీపీకి 130-135, జనసేనకు 0-1 వస్తాయని ఈ సంస్థ పేర్కొంది. తుది ఫలితాల్లో వైసీపీకి 151, టీడీపీ 23, జనసేనకు 1 సీట్లు వచ్చాయి. దీంతో ఈ సారి ఫలితాల్లో ఇండియా టుడే సర్వే నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి 2898 AD’ నుంచి ట్రైలర్ రిలీజ్పై రేపు ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి క్యారెక్టర్లను రివీల్ చేస్తూ విడుదల చేసిన టీజర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ మూవీని ఈ నెల 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై వెల్లడైన ఎగ్జిట్ పోల్స్కు విలువ లేదని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. వీటిని 2 నెలల క్రితమే ఇంట్లోనే మీడియా కోసం తయారుచేశారని అన్నారు. ఈ సర్వేలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవన్నారు. బెంగాల్లో గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని దుయ్యబట్టారు. మరోవైపు బెంగాల్లో TMC కంటే BJPకే ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు పేర్కొన్నాయి.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి మరోసారి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ మంత్రి వర్గంలో చేరేందుకు ఆయన తన పదవిని వదులుకుంటారని చర్చ నడుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. ఈ క్రమంలో నితీశ్కు మోదీ 3.0 కేబినెట్లో చోటు కల్పించి బిహార్లో బీజేపీ అభ్యర్థిని సీఎం చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఇవాళ ఢిల్లీలో కాషాయపార్టీ పెద్దలతో నితీశ్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఏపీ వ్యాప్తంగా ఇవాళ రాత్రి విస్తృతంగా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకిన ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల 40-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.