News June 2, 2024

APPLY NOW.. 459 ప్రభుత్వ ఉద్యోగాలు

image

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌(CDSE)కు దరఖాస్తుల స్వీకరణ ఎల్లుండితో ముగియనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో మొత్తం 459 ఖాళీలున్నాయి. CDSEలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. అవివాహిత పురుషులు, మహిళలు జూన్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలను బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. వెబ్‌సైట్: upsc.gov.in

News June 2, 2024

భారత్‌తో మ్యాచ్ అంటే మాకూ టెన్షనే: బాబర్

image

భారత్‌తో మ్యాచ్ అంటే తమకూ కాస్త టెన్షనే అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నారు. ‘భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లుగా మాకెంతో ఉత్సాహం ఉంటుంది. అదే సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే కూల్‌గా ఆడితే విజయం వరిస్తుందని నమ్ముతా. అందుకు తగ్గట్లుగా సాధన చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. కాగా T20 WCలో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

News June 2, 2024

Results: నిజమైన ఎగ్జిట్ పోల్స్

image

ఉత్కంఠ మధ్య నిన్న విడుదలైన India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం విషయంలో నిజమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ సంస్థ అంచనాలకు తగ్గట్టే ఇవాళ తుది రిజల్ట్ వచ్చింది. అరుణాచల్‌లో బీజేపీకి 44-51 మధ్య వచ్చే ఛాన్స్ ఉందని India Today తెలపగా ఫలితాల్లో 46 సీట్లు వచ్చాయి. సిక్కింలో SKM పార్టీకి 24-30 వస్తాయని ప్రిడిక్ట్ చేయగా రిజల్ట్‌లో ఆ పార్టీ 31 సీట్లను కైవసం చేసుకుంది.

News June 2, 2024

39 ఏళ్లలో తొలిసారి ఓడిన మాజీ సీఎం

image

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష SDF పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్, మాజీ CM పవన్ కుమార్ చామ్లింగ్ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓడారు. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఆయన MLAగా గెలుపొందారు. 1994-2019 వరకు సిక్కిం సీఎంగా పవన్ కుమార్ పనిచేశారు.

News June 2, 2024

జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య

image

ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో మున్నాకు వాగ్వాదం చెలరేగింది. దీంతో కొందరు ఖైదీలు అతణ్ని రాడ్‌తో తలపై కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 1993 MAR 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మరణించారు. ఈ కేసులో దోషి మున్నా కొల్హాపూర్‌ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

News June 2, 2024

ఈ విజయం చరిత్రాత్మకం: పెమా ఖాండు

image

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని సీఎం పెమా ఖాండు అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించిన సహకారానికి ప్రజలు తిరిగి చెల్లించారని చెప్పారు. బీజేపీకి మరో ఐదేళ్లు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. జూన్ 4న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో దేశం మొత్తం ఇదే జోరు విస్తరిస్తుందని పేర్కొన్నారు.

News June 2, 2024

సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

image

AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు <<13358298>>తీర్పును<<>> సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అధికారిక సీల్, హోదా లేకున్నా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ రేపు తమ పిటిషన్ విచారించాలని YCP సుప్రీంకోర్టును కోరింది. కాగా ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది.

News June 2, 2024

ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా మహిళా వ్యాపారవేత్త

image

ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా టోమస్‌డోత్తిర్ ఎన్నికయ్యారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. మాజీ ప్రధాని కత్రిన్ జాకోబ్స్‌డోత్తిర్‌పై ఆమె విజయం సాధించారు. 55 ఏళ్ల హల్లాకు 34.3 శాతం ఓట్లు రాగా, కత్రిన్‌కు 25.5 శాతం వచ్చాయి. కాగా హల్లా B టీమ్ కంపెనీ సీఈవోగా ఉన్నారు.

News June 2, 2024

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు

image

కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ టీ20 వరల్డ్ కప్‌లో చెత్త రికార్డు నమోదు చేశారు. USAతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తొలి స్థానంలో ఉన్నారు. 2007 T20 WCలో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు ఇచ్చారు.

News June 2, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు

image

భారత బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, అమిత్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లియు చువాంగ్‌పై అమిత్ విజయం సాధించారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో మరైన్ కమరాను 5-0 తేడాతో జైస్మిన్ చిత్తు చేశారు. దీంతో వీరిద్దరూ పారిస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. కాగా ఈ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి.