News January 11, 2025

APPLY NOW: బ్యాంకులో 1,267 ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలోని పలు విభాగాల్లో 1,267 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 చివరితేదీ. ఆయా పోస్టులను బట్టి డిగ్రీ, PG, MBA, MCA, బీటెక్ చేసిన వారు అర్హులు. జనరల్, EWS, OBCలకు అప్లికేషన్ ఫీజు రూ.600, మిగతా వారికి రూ.100. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/

News January 11, 2025

బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా

image

TG: BRS పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు, తమ ధర్నాతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు నల్గొండలో జరిగే కార్యక్రమంలో KTR సహా కీలక నేతలు పాల్గొనాల్సి ఉంది. పండుగ తర్వాత కొత్త తేదీని ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.

News January 11, 2025

27న తెలంగాణకు రాహుల్, ఖర్గే

image

TG: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

News January 11, 2025

‘ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశా.. కారణాలు ఇవే’

image

Infosys పుణే క్యాంప‌స్‌లో సిస్టం ఇంజినీర్‌గా ప‌నిచేసే భూపేంద్ర ఉద్యోగానికి రిజైన్ చేయ‌డానికి చెప్పిన కార‌ణాలు వైర‌లవుతున్నాయి. *హైక్ లేని ప్ర‌మోష‌న్‌ *హైరింగ్ జ‌ర‌ప‌కుండా ఉన్న ఉద్యోగుల‌పైనే అధిక వ‌ర్క్‌లోడ్‌ *కెరీర్ గ్రోత్ లేక‌పోవ‌డం *టాక్సిక్ క్లైంట్ కల్చర్ *పని విషయంలో సీనియ‌ర్లు ప్రశంసించినా జీతాలు పెరగకపోవడం* ఆన్‌సైట్ పంపేవారిని మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లాడే భాషా ప్రామాణికంగా ఎంపిక చేయడం.

News January 11, 2025

BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.

News January 11, 2025

వెంకటేశ్‌గారితో 10, 12 సినిమాలు చేస్తానేమో: అనిల్ రావిపూడి

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 3వ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ నెల 14న రానున్న ఈ మూవీ ప్రమోషన్ల సందర్భంగా అనిల్ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇద్దరు లేడీస్ మధ్య వెంకటేశ్‌గారు ఇబ్బంది పడితే ఆ సినిమా పక్కా సూపర్ హిట్. మా సినిమాకు, సంక్రాంతికి సంబంధం ఉంది. అందుకే ఆ పేరు పెట్టాం. వెంకటేశ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మున్ముందు ఓ 10, 12 సినిమాలు ఆయనతో చేస్తానేమో’ అని పేర్కొన్నారు.

News January 11, 2025

సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ: TPCC చీఫ్

image

TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.

News January 11, 2025

తిరుపతి ఘటనలో బాబే తొలి ముద్దాయి: రోజా

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో తొలి ముద్దాయిగా CM చంద్రబాబు పేరును చేర్చాలని YCP నేత రోజా డిమాండ్ చేశారు. ఘటన జరిగి 3 రోజులవుతున్నా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో ఒక్కరు చనిపోతేనే 16 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. తిరుపతిలో ఆరుగురు చనిపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు కారకులైన CM, Dy.CM, TTD EO, JEO, SPలపై కేసు నమోదు చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

News January 11, 2025

‘గ్రీన్ ఎనర్జీ’లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం

image

AP: అనకాపల్లి(D) పూడిమడకలో త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని CM చంద్రబాబు చెప్పారు. దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయన్నారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి ₹10లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్‌ను వాడితే వేడి తగ్గుతుంది. రిలయన్స్ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది’ అని పేర్కొన్నారు.

News January 11, 2025

బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి వీరే

image

బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ ఎంపిక కానున్నారు. ఆ పదవులకు పోటీలో ఉన్నది వీరిద్దరే కావడంతో వారి ఎన్నిక లాంఛనం కానుంది. బీసీసీఐ ఎన్నికల అధికారి అచల్ కుమార్ జోటి ఈ విషయాన్ని వెల్లడించారు. రేపు ముంబైలో జరిగే స్పెషల్ జనరల్ మీటింగ్‌లో వీరి పేర్లను బోర్డు ప్రకటించనుంది. ఇప్పటి వరకూ బీసీసీఐ కార్యదర్శిగా చేసిన జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.