News January 11, 2025
27న తెలంగాణకు రాహుల్, ఖర్గే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736590171389_695-normal-WIFI.webp)
TG: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2025
సైఫ్పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737000658366_746-normal-WIFI.webp)
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై జరిగిన <<15167744>>దాడిపై<<>> యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్పై జరిగిన దాడి గురించి విని షాక్కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.
News January 16, 2025
Stock Markets: బెంచ్మార్క్ సూచీల దూకుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732502136538_1199-normal-WIFI.webp)
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హిండెన్బర్గ్ షట్డౌన్ అంశాలు పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. నిఫ్టీ 23,350 (+136), సెన్సెక్స్ 77,174 (+444) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు కళకళలాడుతున్నాయి. అదానీ షేర్లు పుంజుకున్నాయి. HDFCLIFE, ADANISEZ, SBILIFE, ADANIENT, SRIRAMFIN టాప్ గెయినర్స్.
News January 16, 2025
ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు: KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735985540660_367-normal-WIFI.webp)
TG: ఫార్ములా-ఈ కేసులో ED విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో KTR ట్వీట్ చేశారు. ‘HYDలో ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఇతరులు మన నగరాన్ని ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించింది. HYD బ్రాండ్ను పెంచడమే నాకు ముఖ్యం. FEOకి ₹46cr బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది. మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.