India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న 78,686 మంది భక్తులు దర్శించుకోగా.. 37,888 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వివరించారు.
అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. NPP 5, NCP 3, PPA 2, INC ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ మోర్చా) దాదాపు క్లీన్స్వీప్ చేసింది. 32 స్థానాలకుగాను ఏకంగా 31 చోట్ల విజయదుందుభి మోగించింది. SDF ఒక స్థానంతో సరిపెట్టుకోగా, BJP, INC ఖాతా తెరవలేదు.
TG: మంత్రి పదవి రాలేదనే కోపంతోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఉద్యమంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారని ఆరోపించారు. ఆయనకు ప్రజలపై ప్రేమ లేదని, అధికారం పోయిందనే బాధ ఉందని మండిపడ్డారు. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరని జోస్యం చెప్పారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘భారతీయుడు-2’ సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వెల్లడించారు. ‘భారతీయుడు-2’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు కాజల్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తీరా విడుదలకు ముందు దర్శకుడు ఈ ప్రకటన చేయడంతో ఈ విషయం ఆమెకు తెలుసా అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
TG: రాష్ట్రంలో అక్కడక్కడా 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 40-50Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.
AP: ఎగ్జిట్ పోల్స్లో లోకల్ సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ సర్వేలు మాత్రమే కూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయన్నారు. ‘ఎగ్జిల్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి. మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. ప్రజలంతా YCP వెంటే ఉన్నారు. కూటమి నేతలు కౌంటింగ్లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ సాధనలో ఎంతో మంది పాత్ర ఉన్నప్పటికీ పేటెంట్ రైట్స్ KCRకే దక్కాయని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గన్పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘పదేళ్లు పాలించిన KCR నీరు, నిధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారు. రాష్ట్రాన్ని కాకుండా కుటుంబసభ్యులను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు విపక్షంలో కూర్చున్నా ఆయనకు జ్ఞానోదయం కలగలేదు’ అని ఫైరయ్యారు.
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్సన్) అరుదైన ఘనత సాధించారు. 267M సబ్స్క్రైబర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. T-సిరీస్ 266M సబ్స్క్రైబర్లతో 2వ స్థానంలో ఉంది. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మిస్టర్ బీస్ట్ వినూత్న వీడియోలు చేస్తూ ఆదరణ పొందారు. అతడి వీడియోలను కోట్లాది మంది వీక్షిస్తుండటంతో యూట్యూబ్ ద్వారా రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారు.
రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెల 11న జరగనున్నట్లు టాక్. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైనే కలెక్షన్లు రాబట్టింది.
AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. ‘పెద్దాయన పేరు మరికొన్ని గంటల్లో పద్మనాభ రెడ్డిగా మారబోతుంది’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.