News May 31, 2024

రేపు అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు

image

AP: మే నెల పెన్షన్ డబ్బులను రేపటి నుంచి 2 విధానాల్లో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 65.30 లక్షల మంది పెన్షనర్లలో 47.74 లక్షల మందికి DBT ద్వారా వారి అకౌంట్లలో జమ చేయనుంది. మిగతా 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు జూన్ 1 నుంచి 5వ తేదీలోగా పంపిణీ చేస్తారని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది.

News May 31, 2024

జూన్ 5లోపు ఏపీలోకి రుతుపవనాలు: IMD

image

AP: నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ప్రీ మాన్‌సూన్ వల్ల APలో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. 2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని చెప్పింది.

News May 31, 2024

గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికిపెట్టండి.. పోలీస్ రిప్లై ఇదే!

image

తనకు గర్ల్ ఫ్రెండ్‌ను వెతికిపెట్టాలని ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులను కోరారు. తాను సిగ్నల్ (సింగిల్‌ అనకుండా సిగ్నల్) అని, ఎప్పుడు దొరుకుతుందని పోలీసులను ప్రశ్నించాడు. తనకు గర్ల్ ఫ్రెండ్‌ని వెతికి పెట్టడంలో సహాయం చేయాలని కోరగా.. ఢిల్లీ పోలీసులు రిప్లై ఇచ్చారు. ‘ఆమె తప్పిపోతే తనని గుర్తించేందుకు హెల్ప్ చేస్తాం. ఒకవేళ మీరు సిగ్నలైతే గ్రీన్‌లో ఉండాలని కోరుకుంటాం’ అని సెటైరికల్ రిప్లై ఇచ్చారు.

News May 31, 2024

PMగా నా ఛాయిస్ రాహుల్‌.. ప్రియాంక పోటీ చేయాల్సింది: ఖర్గే

image

INDIA కూటమి అధికారంలోకి వస్తే PMగా తన ఛాయిస్ రాహుల్‌ గాంధీ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’తో మోదీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. అటు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంకను ప్రోత్సహించానని, ఆమె పోటీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. INDIA కూటమి తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని NDA విమర్శిస్తున్న నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

News May 31, 2024

పోస్టల్ బ్యాలెట్‌ వ్యవహారం.. వైసీపీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

AP: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వేసిన <<13343011>>పిటిషన్‌పై<<>> తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌ ఓటుపై సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ చెప్పగా.. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది.

News May 31, 2024

చివరి త్రైమాసికంలో అంచనాలకు మించి వృద్ధి: కేంద్రం

image

2023-24 చివరి త్రైమాసికం(Jan-Mar)లో అంచనాలకు మించి భారత GDPలో వృద్ధి(7.8%) నమోదైనట్లు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తెలిపింది. వార్షిక వృద్ధి 8.2%కి చేరవచ్చని అంచనా వేసింది. తాత్కాలిక వార్షిక వృద్ధి, త్రైమాసిక వృద్ధికి సంబంధించి నివేదిక విడుదల చేసింది. భారత GDP మొత్తంగా ₹173.82 లక్షల కోట్లు అని తెలిపింది. 2022-23FYలో GDP వృద్ధి 7.0% ఉందని వివరించింది.

News May 31, 2024

గొర్రెల స్కాం కేసు.. తలసాని మాజీ ఓఎస్డీ అరెస్ట్

image

TG: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గొర్రెల స్కాం కేసులో ఆయనతో పాటు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రాంచందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.2.10 కోట్లను వీరు ఇతరుల ఖాతాల్లోకి మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేసింది.

News May 31, 2024

ఏపీ అప్పులపై వివరాలు కోరాం: పురందీశ్వరి

image

AP: కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని BJP రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి ఆరోపించారు. గవర్నర్ నజీర్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరిన ఆమె కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లాయని మండిపడ్డారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని ఫైరయ్యారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల వివరాలు అడిగినట్లు ఆమె వెల్లడించారు.

News May 31, 2024

రేపటి మ్యాచ్‌ను తేలికగా తీసుకోం: రోహిత్ శర్మ

image

రేపు బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌ను తాము తేలికగా తీసుకోబోమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. ‘గతంలో ఎప్పుడూ ఇక్కడ మేం ఆడలేదు. టోర్నీకి ముందు అమెరికా పిచ్, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకుంటాం. మా బ్యాటర్లు, బౌలర్లు లయను అందిపుచ్చుకోవడానికి ఈ మ్యాచ్‌ను వాడుకుంటాం’ అని ICC ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పారు. కాగా రేపు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

News May 31, 2024

దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ వస్తానన్నారు: ప్రభుత్వ సలహాదారు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి సూచనతో మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. HYD నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం రాసిన లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరామని, తప్పకుండా వస్తానని కేసీఆర్ చెప్పినట్లు వేణుగోపాల్ తెలిపారు.