News September 7, 2024

అకౌంట్లలో డబ్బులు మిగల్చలేదు: చంద్రబాబు

image

AP: ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ అందజేయడానికి రేషన్ కార్డు అవసరం లేదని, ఫింగర్ ప్రింట్, ఐరిష్ ఉన్నా సరిపోతుందని CM చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం ఏ అకౌంట్లోనూ డబ్బులు మిగల్చలేదని అంతా ఊడ్చేసిందని తెలిపారు. ప్రాథమిక నివేదికను పంపితే కేంద్రం నుంచి సాయం త్వరగా వస్తుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. ఆధారాలు లేకుండా పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 7, 2024

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సెటైర్లు

image

TG: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ <<14035008>>ర్యాంకింగ్స్‌లో<<>> తెలంగాణ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ ఘనతను వర్ణించేందుకు తనకు మాటలు రావట్లేదని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలోనే స్వచ్ఛ్ బయో, వాల్ష్ కర్రా వంటి ఆవిష్కరణలు అవసరమని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తొమ్మిది నెలల పాలనలో ఇలా ఉంటే రాబోయే నాలుగేళ్లలో జరిగేవి తలుచుకుంటే భయమేస్తుందన్నారు.

News September 7, 2024

డిగ్రీ చ‌దివిన వారికి నెల‌కు రూ.5 వేలు.. బ్యాంకుల ఆఫర్!

image

డిగ్రీ పూర్తి చేసిన‌ 25 ఏళ్ల‌లోపు వ‌య‌సు గ‌ల‌వారిని బ్యాంకులు త్వ‌ర‌లో అప్రెంటీస్‌లుగా నియ‌మించుకొని నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వనున్నాయి. కేంద్ర బ‌డ్జెట్‌ ప్ర‌క‌ట‌న మేర‌కు గ్రాడ్యుయేట్స్‌కు ఇంట‌ర్న్‌షిప్‌పై కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ బ్యాంకుల‌తో స‌మావేశమైంది. మ‌రో నెల రోజుల్లో బ్యాంకులు ఈ నియామ‌కాలు ప్రారంభించవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏ బ్యాంకు ఎంత మందికి అవ‌కాశం క‌ల్పిస్తుందో తేలాల్సి ఉంది.

News September 7, 2024

ట్రంప్‌నకు ‘హిందూస్ ఫ‌ర్ అమెరికా ఫ‌స్ట్’ మద్దతు

image

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌న‌కు హిందూస్ ఫ‌ర్ అమెరికా ఫ‌స్ట్ సంస్థ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. డెమోక్రాట్ల అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్ భారత్-అమెరికా బంధానికి సమస్యాత్మకం కావచ్చని సంస్థ ఫౌండ‌ర్ ఉత్స‌వ్ సందుజా అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల‌ను ఆమె పరిష్కరించకపోవడం వల్లే అక్రమ వలసలతో నేరాలు పెరిగాయన్నారు. ఆమెకు వ్యతిరేకంగా 3 రాష్ట్రాల్లో ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

News September 7, 2024

మహాభారతం రాసేందుకు వినాయకుడు విధించిన షరతు ఏంటంటే..!

image

మహాభారతాన్ని వేదవ్యాసుల వారు బోధించగా వినాయకుడు రాసినట్లు పురాణ ప్రశస్తి. అయితే.. రాసేందుకు గణేశుడు ఓ షరతు విధించినట్లు కథనం ఉంది. దాని ప్రకారం.. రాయడానికి తనకు అంగీకారమేనని, కథ మొత్తం ఏకధాటిగా చెప్పాలని ఆయన షరతు పెట్టాడట. వ్యాసులవారు చెప్పడం ఆగితే తాను కూడా రాయడం ఆపేస్తానని అనడంతో ఏకధాటిగా మూడేళ్ల పాటు వ్యాసుల వారు భారతాన్ని వినిపించారని ఓ కథనం.

News September 7, 2024

అసలు ప్రభుత్వం ఉందా? లేదా?: జగన్

image

AP: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందా? గతంలో చాలా సార్లు 30 సెం.మీ పైగా వర్షం పడినా ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరోజులోనే రేషన్ సరుకులు పంపిణీ చేశాం’ అని తెలిపారు.

News September 7, 2024

వాళ్లను చూస్తే గుండె తరుక్కుపోతోంది: చంద్రబాబు

image

AP: బుడమేరు వరదతో ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాపాలతోనే ఈ వరద వచ్చిందన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో వారిని చూస్తే గుండె తరుక్కుపోతుందని చెప్పారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో నాలుగు అడుగుల నీళ్లతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇంకా 1 TMCకి పైగా నీరు విజయవాడ కాలనీల్లో ఉందన్నారు. వర్షాలతో మళ్లీ ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.

News September 7, 2024

‘జైలర్’ విలన్ అరెస్ట్?

image

రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ విలన్ వినాయకన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో అతడిపై RGI పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ నటుడిని అరెస్ట్ చేశారని వార్తలొస్తున్నాయి. గతంలో మహిళలను వేధించిన కేసులో వినాయకన్ అరెస్టైన సంగతి తెలిసిందే.

News September 7, 2024

మున్నేరుకు వరద.. పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి ఆదేశం

image

TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో మున్నేరు నదికి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News September 7, 2024

కృష్ణానదికి పెరిగిన వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి 2.70 లక్షలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అటు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి సైతం వరద పెరుగుతోంది. 65 గేట్లు ఎత్తి 3.05 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.