India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, నాని ఓకే చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని హిట్-3తో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు.
పోర్చుగీస్ ఫుట్బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు. అన్ని ప్లాట్ఫామ్లలో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ‘ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నిదర్శనం. నా కుటుంబం, మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు.
TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఈనెల 20న లేదా నాలుగో వారంలో దీక్షను ప్రారంభించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలను ఎంపీ లక్ష్మణ్కు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.
AP: ప్రభుత్వ CBSE స్కూళ్లలో టెన్త్ చదువుతున్న 78వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించాలని నిర్ణయించింది. ఇటీవల అసెస్మెంట్ పరీక్షల్లో 90శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పబ్లిక్ పరీక్షలు కూడా CBSEలో రాసి ఫెయిలైతే విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
AP:విజయవాడ రైల్వేస్టేషన్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. వార్షికాదాయం ₹500 కోట్లు అధిగమించి, NSG-1 హోదాను సాధించి దేశంలోని టాప్-28 స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. SCR పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన స్టేషన్గా నిలిచింది. ఏటా ₹500cr కంటే ఎక్కువ ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణించే స్టేషన్కు దక్కే ఈ హోదాను విజయవాడ గతంలో తృటిలో చేజార్చుకోగా, తాజాగా ₹528cr వార్షికాదాయం పొంది సాధించింది.
ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్షిప్లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈ నెల 21న క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో కూడా పాల్గొంటారని పేర్కొంది. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్లో జరిగే ఈ సదస్సులో క్వాడ్ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రకృతి వైపరీత్యాలపై స్పందన, సముద్ర భద్రత వంటి విషయాలపై చర్చించనున్నారు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఈ ఏడాది పవర్ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 192.32 స్ట్రైక్ రేట్తో 1,027 పరుగులు బాదారు. అతడి తర్వాత ఫిల్ సాల్ట్ (827), డుప్లెసిస్ (807), అలెక్స్ హేల్స్ (792), జేమ్స్ విన్స్ (703) ఉన్నారు. ఓవరాల్గా ఈ ఏడాది హెడ్ 181.36 స్ట్రైక్ రేట్తో 1,411 రన్స్ సాధించారు.
Sorry, no posts matched your criteria.