India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.

AP: పారా మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే ఆ సబ్జెక్టులను యాన్యువల్ ఎగ్జామ్స్తో పాటు మళ్లీ రాసేవారు. ఫలితంగా ఏడాదిపాటు వేచి ఉండాల్సి వచ్చి ఉపాధి అవకాశాలు కోల్పోయేవారు. కాగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో వారికి 2025-26 నుంచి తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. FEB 2, 3, 4 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 5వ తేదీవరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

‘కోల్డ్రిఫ్’ కాఫ్ సిరప్తో MP, రాజస్థాన్లలో పిల్లలు మరణించడం తెలిసిందే. దీనిపై WHO హెచ్చరికతో కేంద్రం సిరప్ల తయారీ, విక్రయ రూల్స్ కఠినం చేస్తోంది. సిరప్ పదాన్ని షెడ్యూల్ K నుంచి తొలగించింది. కాస్మొటిక్స్తో పాటు కాఫ్ సిరప్ల తయారీ, విక్రయాలకు ఈ షెడ్యూల్ రూల్స్ వర్తించేవి. ఇకపై ఇతర డ్రగ్స్ కేటగిరీలోకి ఇవి చేరనున్నాయి. ప్రిస్క్రిప్షన్పైనే విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది.

US మేరీల్యాండ్లోని గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో ఉన్న నాసా అతిపెద్ద లైబ్రరీ రేపు మూతపడనుంది. కాస్ట్ కటింగ్ పేరిట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన రీఆర్గనైజేషన్ ప్లాన్లో భాగంగా దీనిని శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నారు. 1959లో స్థాపించిన ఈ లైబ్రరీలో లక్షకుపైగా బుక్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1.270 ఎకరాల్లోని క్యాంపస్లో 13 బిల్డింగ్స్, 100కుపైగా సైన్స్ & ఇంజినీరింగ్ ల్యాబ్స్ మూతపడనున్నాయి.

మెట్ల కింద స్నానాల గది నిర్మించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు పాదాల కింద పవిత్రత లేని ప్రదేశం ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘మెట్ల కింద స్థలం చాలా ఇరుకుగా ఉండి, పైకప్పు తలకి తగిలే ప్రమాదం ఉంటుంది. గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించవు. అనారోగ్య సమస్యలు రావొచ్చు. మురుగునీటి పైపుల నిర్వహణ కష్టమవుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

ఈ ఏడాది తొలి పౌర్ణమిన సూపర్ మూన్ ఎల్లుండి కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు. సాధారణం కంటే 15శాతం బిగ్గర్గా 30శాతం ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. కాగా సూపర్మూన్ గత 4 నెలలుగా వరుసగా కనిపిస్తుండటం గమనార్హం. OCT, NOV, DECలోనూ కనువిందు చేసింది. ఇక ఈసారి సూపర్ మూన్ చూడటం మిస్ అయితే నవంబర్ వరకూ ఆగాల్సిందే.

TG: పాలమూరు-RR ప్రాజెక్టు వివాదం వేళ వార్తల్లో నిలిచిన ఇరిగేషన్ సలహాదారు <<18689807>>ఆదిత్యనాథ్<<>> దాస్ గురించి CM రేవంత్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉండటంతోనే AP నుంచి తీసుకొచ్చామన్నారు. ఆయనది అటు ఏపీ, ఇటు తెలంగాణ కాదని, దాస్ బిహార్కు చెందినవాడని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు దొంగతనాన్ని బయటపెడతాడనే భయంతోనే ఆయనపై BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

AP: మద్యం అమ్మకాలు డిసెంబర్(2025)లో గణనీయంగా పెరిగి ₹2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో ₹2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా ₹543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024లో ఇది ₹336 కోట్లు మాత్రమే. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ₹178.6 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారు.

TG: జల వివాదాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ‘ఎవరి బాగు కోసం పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కమీషన్లు ఎవరికి వెళ్లాయి. దీనిపై విచారణ జరగాలి’ అని వ్యాఖ్యానించారు. అబద్ధాల పోటీలో KCR, KTR, హరీశ్ రావుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు.

TG: నదీ జలాలపై పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాలా? అని BRS నేత హరీశ్ CM రేవంత్పై ధ్వజమెత్తారు. ‘మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చారు, సుంకిశాలను ఎలా కూల్చారో చూపిస్తారా? కృష్ణాపై హక్కులను KRMBకి ఎలా అప్పగించారో చెబుతారా?’ అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా? అని నిలదీశారు. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తమకూ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.