India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గ్రేస్ పీరియడ్లోనూ పాలసీదారులకు పూర్తి కవరేజ్ ఇవ్వాలని <<13340589>>IRDAI<<>> ఆదేశించింది. నెలవారీ ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు, క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ, యాన్యువల్ ప్రీమియం గల వారికి 30 రోజుల గ్రేస్ టైమ్ ఉంటుందని తెలిపింది. ఇప్పటివరకు ఈ పీరియడ్ కంపెనీని బట్టి వేర్వేరుగా ఉంది. అటు ఆ టైమ్లో కస్టమర్లు పాలసీ రెన్యూవల్ చేసుకోవచ్చు కానీ కవరేజ్ పొందే అవకాశం లేదు.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నా రాష్ట్ర గీతం లేదు. అందె శ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అనే గీతం ఉద్యమ సమయంలో ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది. ఇందులో 11 చరణాలు ఉండగా, 4 చరణాలను ఎంచుకుని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కానీ కుదరలేదు. తాజాగా కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతంగా దీన్ని ఎంపిక చేసింది. అయితే కీరవాణికి సంగీత బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది.
గాజాలోని రఫా సిటీపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఖండిస్తూ ‘All Eyes On Rafah’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆ ఫొటో సోమవారం నుంచి ఇప్పటి వరకు 44 మిలియన్ల ఇన్స్టా అకౌంట్లలో షేర్ అయ్యింది. అలాగే Xలో 3 రోజుల్లోనే రఫాకు సంబంధించి 27.5 మిలియన్ల మెసేజ్లు పబ్లిష్ అయ్యాయి. పాలస్తీనీయుల శరణార్థి శిబిరంపై ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 45 మంది అమాయకులు చనిపోగా, 249 మంది గాయపడిన విషయం తెలిసిందే.
AP: ఆరోగ్య శాఖలో పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి జీతం(మూల వేతనం+DA+HRA) అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 4 వేల మంది ప్రతి నెలా ₹10వేల నుంచి ₹12వేల చొప్పున నష్టపోతున్నారు. పూర్తిగా చెల్లించేలా గత ఏడాది SEP 14న ఇచ్చిన GO అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేడర్ స్ట్రెంత్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో 3,500 మంది గ్రేడ్-5 కార్యదర్శులకు 3 నెలలుగా జీతాలు అందడం లేదు.
TG: రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్కు చార్మినార్ ఐకాన్గా ఉంది. హైదరాబాద్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడమైన చార్మినార్ గుర్తొస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించాలనుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.
షిర్డీలోని పూల వ్యాపారి రవీంద్ర అష్టేకర్ (36) పెద్ద మనసు చాటుకున్నాడు. అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ గల ఓ మహిళ ఇండోర్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని వాట్సాప్లో తెలుసుకున్నాడు. ఇదే గ్రూప్ రక్తం గల రవీంద్ర సొంత ఖర్చుతో 440KM ప్రయాణించి రక్తదానం చేశాడు. ఇలా గతంలోనూ ఆయన పలువురి ప్రాణాలు కాపాడాడు. దేశంలో 179 మందికి మాత్రమే ఈ రకం బ్లడ్ ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఇది బ్లడ్ బ్యాంకుల్లోనూ దొరకదు.
AP: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్ను జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. AICTE అనుమతి పొందిన కాలేజీల్లోనే బీసీఏ, బీబీఏ కోర్సులను కౌన్సెలింగ్లో చేర్చనుంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ చేపట్టనుంది. ఈలోపు అనుబంధ గుర్తింపు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీల అనుమతుల పొడిగింపు ఫీజును చెల్లించాలని కాలేజీలకు వర్సిటీలు సూచించాయి.
బిహార్లోని జమూయ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా పని చేయలేదంటూ 13మంది టీచర్ల జీతంలో కోతలు విధించారు. ఆ విషయాన్ని ఓ సర్క్యులర్లో డీఈఓ తెలిపారు. అయితే ‘బ్యాడ్ పెర్ఫామెన్స్’కు బదులు ‘బెడ్ పెర్ఫామెన్స్’ అని తప్పు దొర్లడంతో ఆ నోటీసు కాస్త నెట్టింట నవ్వులపాలైంది. జోకులు పేలుతుండటంతో జిల్లా యంత్రాంగం వెంటనే వివరణ విడుదల చేసింది.
పోలింగ్ ప్రక్రియ ముగియక ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రసారం చేసిన ఒడిశాలోని సందీఘోష టీవీపై EC ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ ఛానల్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర CEOను ఆదేశించింది. జూన్ 1న చివరి దశ ఓటింగ్ జరగనుండగా, ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు. WAY2NEWS అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ను అందిస్తుంది. వేగంగా, విశ్లేషణలతో కూడిన కథనాలను తెలుసుకోవచ్చు.
AP: వర్షాలు, వరదలు లేకపోవడంతో ప్రధాన జలాశయాలు ఖాళీ అయ్యాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం, సోమశిల, గొట్టా, కండలేరులో 441TMCల నీటి నిల్వకు అవకాశం ఉండగా ప్రస్తుతం 69.77TMCలే ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా డెడ్ స్టోరేజీ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో నీటిని వాడుకునే పరిస్థితి లేదు. దీంతో భారీ వర్షాల కోసం ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.