News March 13, 2025

₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

image

భారత్‌లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.

News March 13, 2025

గాయపడ్డ నటి.. నుదిటిపై 13 కుట్లు!

image

సీనియర్ నటి, ఎవర్‌గ్రీన్ బ్యూటీగా పేరొందిన భాగ్యశ్రీ గాయపడ్డారు. పికిల్‌బాల్ ఆడుతుండగా ఆమె నుదిటిపై లోతైన గాయం తగిలింది. దీంతో నుదిటిపై 13 కుట్లు పడ్డాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా చివరగా ‘రాధేశ్యామ్’, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాల్లో నటించారు.

News March 13, 2025

కిడ్నీలను కాపాడుకుందామిలా

image

శరీరంలో మూత్రపిండాల పనితీరు చాలా కీలకం. వాటిని కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:
రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. పంచదార, ఉప్పు, కొవ్వులు పరిమితంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీరు పుష్కలంగా తాగాలి. డీహైడ్రేషన్ కిడ్నీలకు ప్రమాదకరం. ఇష్టారాజ్యంగా ఔషధాల్ని వాడకూడదు. రక్తపోటు, మధుమేహం, క్రియేటినిన్ స్థాయులపై కన్నేసి ఉంచాలి.
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

News March 13, 2025

ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

image

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్‌ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT

News March 13, 2025

ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

image

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 13, 2025

మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

image

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.

News March 13, 2025

తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

image

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్‌(₹)ను తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.

News March 13, 2025

KKR కెప్టెన్‌గా రహానే.. కారణం ఇదే

image

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్‌గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్‌ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

image

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

News March 13, 2025

నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

image

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.