India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.

హోలీ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్తోన్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్ రోడ్స్, ప్లేసెస్లో రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉండనుంది.

TG: స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ‘సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అని జగదీశ్ రెడ్డి అన్నారు. “నీ” అన్న మాట ఆయన అనలేదు. “మీ” అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసనలు చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’ అని పేర్కొన్నారు.

దేశాలు వాణిజ్య యుద్ధాల్లోకి దిగడం ఎవరికీ మంచిది కాదని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. సుంకాల పోరు అన్ని దేశాలనూ దెబ్బ కొడుతుందని పేర్కొన్నారు. ‘మనం నేటికాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బతుకుతున్నాం. అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం అందరికీ ఉపయోగం. అదే వాణిజ్య యుద్ధంలోకి వెళ్తే విజేతలెవరూ ఉండరు’ అని స్పష్టం చేశారు.

హోలీ సందర్భంగా వాడే కృత్రిమ రంగులతో<<15741783>> చర్మ<<>>సమస్యలతో పాటు కంటికి ప్రమాదం. కనుక ఇంటి వద్ద లభించే వస్తువులతోనే రంగులు తయారు చేయవచ్చు. పసుపులో కొంత శనగపిండి కలిపితే రంగుగా మారుతోంది. ఎర్ర మందారం బియ్యంపిండి, కుంకుమపువ్వు కలపాలి. ఆకులను ఎండబెట్టి గ్రైండర్ పడితే గ్రీన్ కలర్ రెడీ. గులాబీ రేకులను పొడిగా చేసుకొని రుబ్బితే సరిపోతుంది. వీటితో పాటు కంటికి అద్దాలను ధరిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు.

AP: వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 15లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండేదని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇలా అరెస్టులు చేయడం పరిష్కారం కాదని, ఇది అంటువ్యాధిలాంటిదని మండిపడ్డారు. ఈ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్కు సినీ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ‘ఆమె ఇతర మహిళలకు పరువు నష్టం కలిగించడమే అజెండాగా పనిచేస్తుంది. నేనూ ఆమె బాధితురాలినే’ అని పేర్కొన్నారు.

TG: CM రేవంత్ అసెంబ్లీలో, బయటా అసత్యాలే మాట్లాడుతున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని హరీశ్ రావు విమర్శించారు. TVVP డాక్టర్లు, నర్సులు, హోం గార్డులు సహా ఇతర సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ’13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని TVVP సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. దుష్ప్రచారంతో ఇంకెంత కాలం వెళ్లదీస్తారు?’ అని ప్రశ్నించారు.

రతన్ అనే వ్యక్తికి 1992లో తన తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కొన్న <<15725743>>షేర్స్<<>> అగ్రిమెంట్ పేపర్స్ దొరికిన విషయం తెలిసిందే. వీటి విలువ దాదాపు రూ.12లక్షలు అయినప్పటికీ షేర్స్ను డిజిటలైజ్ చేసేందుకు ఆయన ఇష్టపడట్లేదు. ‘డిజిటలైజ్ చేసేందుకు మూడేళ్లు పట్టేలా ఉంది. కేవలం వారసుడిగా సర్టిఫికెట్ పొందేందుకే 8నెలలు పడుతుంది. ఇంత సమయాన్ని దీనికోసం వృథా చేయను. ఇండియాలో ఈ ప్రక్రియ వ్యవధిని తగ్గించాలి’ అని పేర్కొన్నారు.

భారత్లోని క్రికెట్ నైపుణ్యంపై ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ప్రశంసలు కురిపించారు. ‘ఒకేరోజు టెస్టు, ODI, T20 మ్యాచులు పెడితే వాటన్నింటికీ వేర్వేరు బలమైన జట్లను పంపించగల సత్తా భారత్కు మాత్రమే ఉంది’ అని చెప్పారు. టీమ్ఇండియా సమస్యల్ని పరిష్కరించే ఆటగాడిగా KL రాహుల్ ఉన్నారని పేర్కొన్నారు. ఓపెనింగ్, కీపింగ్, ఫీల్డింగ్, ఫినిషింగ్ ఇలా ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.