India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై YCP సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూడు రాజధానులనేది ఆ రోజుకు మా విధానం. దానిపై ఇప్పుడు మా విధానం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతాం. అమరావతిని శాసన రాజధాని చేద్దామని అనుకున్నాం. అమరావతి శ్మశానంలా ఉందని నేను చెప్పింది వాస్తవమే. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భం మేరకు అలా మాట్లాడాను’ అని బొత్స తెలిపారు.

TG: ఎల్లుండి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షల కోసం 1,532 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఉ.9-మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని, 8.45amలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9am తర్వాత 5min లేటుగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

కుంభమేళా ముగిసి రోజులు గడుస్తున్నాయి. ఎటు చూసినా భక్తజనం, భగవన్నామస్మరణం, వ్యాపారాలు, రంగులతో 2నెలల పాటు సందడిగా కళకళలాడిన ప్రయాగ్రాజ్లో నేడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. శుభ్రం చేసేందుకు చెమటోడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కనిపిస్తున్నారు. అక్కడ సేకరించిన చెత్తనంతా రీసైక్లింగ్ ప్లాంట్కు తరలించనున్నట్లు UP ప్రకటించింది. ప్రయాగ పరిస్థితిని పైన ఫొటోల్లో చూడొచ్చు.

పోసాని, వల్లభనేని వంశీ కోసం ఇవాళ పీటీ వారెంట్లు దాఖలు అయ్యాయి. అసలు ఈ వారెంట్ ఏంటి? ఏ సమయంలో ఉపయోగిస్తారో చూద్దాం. PT వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. ఓ కేసులో అరెస్టై జైలులో ఉన్న వ్యక్తిని మరో కేసులో విచారించడానికి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లేందుకు పోలీసులు కోర్టు వద్ద అనుమతి తీసుకోవాలి. ఇలా అనుమతి తీసుకొన్నట్లు జైలు అధికారులకు అందించే పత్రాలను పీటీ వారెంట్ అంటారు.

నటి రష్మిక మందన్నకు బుద్ధి చెప్తామని KA కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆహ్వానించినప్పటికీ కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె రాకపోవడమే ఇందుకు కారణం. వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని మండి MLA రవికుమార్ మండిపడ్డారు. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. DyCM డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.

అయోధ్య రామమందిరాన్ని పేల్చేసేందుకు ISI భారీ కుట్ర పన్నినట్టు తెలిసింది. ఇందుకోసం ఫైజాబాద్ మటన్ వ్యాపారి, టెర్రరిస్టు అబ్దుల్ రెహ్మాన్ను నియమించుకుంది. రెక్కీ నిర్వహించాక ఫైజాబాద్ నుంచి హరియాణాలోని ఫరీదాబాద్కు చేరుకున్న రెహ్మాన్కు ఓ హ్యాండ్లర్ హ్యాండ్ గ్రెనేడ్లను ఇచ్చాడు. రైల్లో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుజరాత్ ATF, ఫరీదాబాద్ STF టీమ్స్ అతడిని పట్టుకున్నాయి.

దుబాయ్ తమ హోం గ్రౌండ్ కాదని, ఈ పిచ్ తమకూ కొత్తేనని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మఅన్నారు. ఇక్కడ తామాడిన మూడు మ్యాచులలో ప్రతి గేమ్కు పిచ్ పరిస్థితులు మారాయన్నారు. ILT20 టోర్నమెంట్ చూసినప్పుడు గ్రౌండ్ కండీషన్ అర్థమైందని పిచ్లు స్లోగా ఉండటం వల్లే 5గురు స్పిన్నర్లను ఆడించామని తెలిపారు. దుబాయిలోనే అన్నిమ్యాచులు ఆడటం ఇండియాకు కలసివచ్చిందని పలు దేశాల క్రికెటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, ప్రాజెక్టులపై ఆయనతో చర్చిస్తున్నారు.

స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,119 (-5), సెన్సెక్స్ 73,085 (-112) వద్ద స్థిరపడ్డాయి. భారీ నష్టాల నుంచి సూచీలు మధ్యాహ్నం రికవర్ అయ్యాయి. ఐటీ, మెటల్, రియాల్టి, హెల్త్కేర్, ఫార్మా, కన్జంప్షన్ షేర్లు ఎగిశాయి. బ్యాంకు, మీడియా, O&G స్టాక్స్ ఎరుపెక్కాయి. బీఈఎల్, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్, JSW స్టీల్, BCPL టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, కోల్ఇండియా, RIL, బజాజ్ ఫిన్సర్వ్, HDFC టాప్ లూజర్స్.

AP: మాజీ ఎమ్మెల్యే, YCP నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ సీఐడీ కోర్టు ఆయన్ను వర్చువల్గా విచారించి రిమాండ్ విధించింది. ఈ కేసులో వంశీ A71గా ఉన్న విషయం తెలిసిందే. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.