India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయకుడి విగ్రహమంటే గజ ముఖంతోనే చూస్తుంటాం. తమిళనాడులోని తిలాతర్పణపురి ఆదివినాయకర్ ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది. ఇక్కడ పిండప్రదానం పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి.
పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత ఇంగ్లండ్కు చెందిన సెరీన్ ప్రైస్కు సరిగ్గా సరిపోతుంది. వయసు ఆరేళ్లే అయినా మొరాకోలోని 13,600 అడుగుల ఎత్తైన మౌంట్ టౌబ్కల్ పర్వతాన్ని అధిరోహించింది. ఈక్రమంలో అత్యంత పిన్నవయసులో ఈ పర్వతం ఎక్కిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. తన ప్రాణాలు రక్షించిన ఓ ఆస్పత్రికి నిధులు సమీకరించేందుకు ఆమె ఈ సాహసం చేసింది. యూరప్లోని మాంట్ బ్లాంక్ను ఆమె త్వరలో అధిరోహించనుండటం విశేషం.
TG: హైడ్రా <<14051102>>కూల్చివేతలపై<<>> నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమన్నారు. కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని కూలుస్తున్నట్లు తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న యజమానులకు భారీ ఊరట కలిగింది.
AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో. జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. దీంతో GVMC అప్రమత్తమైంది. 184 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, సాయం కోసం 180042500009 నంబర్కు ఫోన్ చేయాలని సూచించింది.
NSA అజిత్ దోవల్ ఈ వారం రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్య పరిష్కారానికై శాంతి ప్రయత్నాలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో PM మోదీ ఫోన్ సంభాషణ సందర్భంగా, తన ఉక్రెయిన్ పర్యటన అనంతరం దోవల్ రష్యాలో పర్యటించి శాంతి ప్రయత్నాలపై చర్చిస్తారని మోదీ పేర్కొన్నట్టు తెలిసింది. బ్రిక్స్-NSA సమావేశంలో కూడా దోవల్ పాల్గొంటారని సమాచారం.
AP: జనం వరదల్లో ఉంటే జగన్ ప్యాలెస్లో రిలాక్స్ అవుతున్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు. బురద రాజకీయాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారని దుయ్యబట్టారు. పాస్పోర్ట్ సమస్య లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. బుడమేరు ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం రూ.464 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
చైనాలో 58 ఏళ్ల వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి నిద్రపోతుండగా ముక్కు ద్వారా బొద్దింక గొంతులోకి వెళ్లింది. అసౌకర్యంగా అనిపించినప్పటికీ అలాగే నిద్రపోయాడు. 3 రోజుల తర్వాత శ్వాసలో దుర్వాసన వచ్చింది. దగ్గు పెరిగింది. ENT స్పెషలిస్టు దగ్గరకు వెళ్లగా పరీక్షల్లో ఏమీ కనిపించలేదు. బ్రోంకోస్కోపీ చేయగా శ్వాసనాళంలో కఫంతో నిండిన బొద్దింక కనిపించింది. వైద్యులు దాన్ని శుభ్రం చేసి డిశ్చార్జ్ చేశారు.
TG: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని ఇస్తామని తెలిపింది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
AP: రాష్ట్రంలో వరదల కారణంగా 45 మంది మరణించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారని పేర్కొంది. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 3,913 KMల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిపింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు వెల్లడించింది.
ఒకప్పుడు సీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన JC దివాకర్ రెడ్డి (80) ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. దివాకర్ రెడ్డి తాజా ఫొటోను ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి Xలో షేర్ చేశారు. కుమారుడు పవన్ రెడ్డి, మనవడితో కలిసి దివాకర్ రెడ్డి కనిపించారు. గతంలో ఖరీదైన గ్లాసెస్, గంభీరంగా కనిపించే దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా డీలా పడ్డారు. ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిందని, నడవడం కూడా ఇబ్బందిగా ఉందని పలువురు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.