News March 3, 2025

పుతిన్ కంటే వారే ప్రమాదం: ట్రంప్

image

అమెరికాకు పుతిన్ కంటే అక్రమ వలసలని నిరోధించటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు. హంతకులు, డ్రగ్స్‌మాఫియా, రేపిస్టులను దేశంలోనికి రాకుండా నిరోధించటం వల్ల తమ దేశం యూరప్‌లా మారకుండా ఉంటుందన్నారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు భారీగా తగ్గించామని ‘అమెరికాపై దండయాత్ర ముగిసిందని’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్ ప్రభుత్వంలో నెలకు 3లక్షలకు పైగా అక్రమ వలసదారులు దేశంలో ప్రవేశించేవారని అన్నారు.

News March 3, 2025

‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వచ్చేసింది

image

నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఓదెల శ్రీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2026, మార్చి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అసభ్య పదాలు ఉన్న కారణంగా వీడియోను ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు. వీడియో కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 3, 2025

ఆదిలాబాద్‌కు అన్యాయమేనా?

image

TG: పేరులోనే ఆది ఉంది కానీ అభివృద్ధికి మాత్రం ఆదిలాబాద్ దూరంగానే ఉంటోందని ప్రజలు నిరాశ చెందుతున్నారు. వరంగల్ తర్వాత ఆదిలాబాద్‌లోనూ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని వారు కన్న కలలు కల్లలయ్యాయి. ఎక్కడా లేని విధంగా ADBలో స్థలం అందుబాటులో ఉండగా, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ADBతోపాటు కొత్తగూడెం, రామగుండంలోనూ ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 3, 2025

టెన్త్ అర్హతతో 1,124 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

image

CISFలో 1,124 ఖాళీలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో 845 కానిస్టేబుల్/డ్రైవర్, 279 డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్ పాసై డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. PET, PST, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు ₹21,700-₹69,100 ఉంటుంది. వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in

News March 3, 2025

త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

image

AP: మెగా DSCపై YCP సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. మన బడి-మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద ₹3K కోట్లతో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తామని చెప్పారు. అన్ని విద్యాసంస్థల్లో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ క్యాంపెయిన్‌ను చేపట్టామన్నారు. గత ప్రభుత్వ విధానాలతో పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని ఆరోపించారు.

News March 3, 2025

బంగారంతో పోలిస్తే ప్రాపర్టీకే మహిళల ఓటు!

image

పెట్టుబడికైనా ధరించడానికైనా బంగారాన్ని ఇష్టపడని మహిళలు అత్యంత అరుదు. కొన్నేళ్లుగా వారి ఆలోచనలు మారుతున్నట్టు అనిపిస్తోంది. పెట్టుబడి పరంగా ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ప్రాపర్టీ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని అనరాక్ నివేదిక పేర్కొంది. 2022 H2లో 8% గోల్డుకు, 65% ప్రాపర్టీకి ఓటేయగా 2024 H2లో వరుసగా 12%, 70% ఎంచుకున్నారు. స్టాక్‌ మార్కెట్‌ను ఎంచుకునేవాళ్లు 20 నుంచి 2%కి తగ్గారు. దీనిపై మీ కామెంట్.

News March 3, 2025

రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్: కాంగ్రెస్ నేత

image

రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్, అత్యంత ఆకట్టుకోని కెప్టెన్ అని కాంగ్రెస్ మహిళా నేత డా.షామా చేసిన ట్వీట్‌పై ఫ్యాన్స్‌, BJP నేతలు మండిపడుతున్నారు. ‘రోహిత్ ఫ్యాట్‌గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. గంగూలీ, సచిన్, కోహ్లీతో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో ‘రాహుల్ నాయకత్వంలో పని చేసే మీకు కెప్టెన్సీ గురించి ఎలా తెలుస్తుందిలే’ అంటూ BJP నేతలు ఫైరవుతున్నారు.

News March 3, 2025

కాంగ్రెస్ నాయకురాలి హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు?

image

హరియాణాలో కాంగ్రెస్ నాయకురాలు <<15630501>>హిమానీ(22)<<>> హత్య కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు హిమానీతో రిలేషన్‌లో ఉండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆమె బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంతో చంపేసినట్లు అనుమానిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి. అయితే మీడియాలోని పుకార్లను నమ్మబోమని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

News March 3, 2025

GOOD NEWS: ప్రతి నెలా 24-28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు

image

AP: ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అయితే రాష్ట్రంలో 11L మంది చిన్నారులకు ఆధార్ లేదు. అలాగే ఆధార్ నమోదు చేయించుకున్నప్పటికీ 42L మంది బయోమెట్రిక్ చేయించుకోలేదు. వారందరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా 24-28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు నిర్వహించనుంది. స్కూళ్లు, అంగన్వాడీలు, సచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 3, 2025

రైల్వే స్టేషన్లలో డ్వాక్రా సంఘాల స్టాల్స్

image

TG: డ్వాక్రా సంఘాలతో 50 రైల్వేస్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత 14 స్టేషన్లకు పర్మిషన్ వచ్చింది. సికింద్రాబాద్‌లో పిండి వంటలు, WGL స్టేషన్‌లో తృణధాన్యాలు, ఘన్‌పూర్‌లో చేతి ఉత్పత్తులు, శంకర్‌పల్లిలో జూట్, క్లాత్ బ్యాగులు, VKBలో గాజులు, పూసలు, హారాలు, భువనగిరిలో పిండివంటలు, చర్లపల్లిలో పోచంపల్లి చీరలు, సిర్పూర్‌లో సకినాలు, మురుకులు అందుబాటులో ఉంచనున్నారు.