India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర వృద్ధి ఒక్క శాతానికి పడిపోవడం సిగ్గుచేటు అని KTR ట్వీట్ చేశారు. ‘కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధిని గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న TGని అట్టడుగుకి పడేశారు. మతిలేని CM చేస్తున్న ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయి’ అని విమర్శించారు.

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ మూడో రోజు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇటీవల మరణించిన పాలవలస రాజశేఖరం మృతికి సభ్యులు నివాళులర్పిస్తారు. అనంతరం రూ.3.22 లక్షల కోట్లతో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభ్యులు చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల్లో డీఎస్సీ నోటిఫికేషన్, గోదావరి పుష్కరాలు, వక్ఫ్ ఆస్తుల రికార్డు డిజిటలైజేషన్ తదితరాలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘పట్టుదల’ మూవీ OTTలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలోనూ ప్రసారమవుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. మాగిజ్ తిరుమనేని తెరకెక్కించిన ఈ మూవీలో త్రిష, రెజీనా, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకోగలనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధీమా వ్యక్తం చేశారు. గత వారం ఖనిజాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఏకాభిప్రాయం కుదరకపోవడంపై స్పందించారు. ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని పేర్కొన్నారు. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు.

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సూపర్ హిట్ కావడంతో పార్ట్-2పై డైరెక్టర్ కొరటాల శివ కసరత్తు చేస్తున్నారు. ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే ఆయనకు కథను వినిపిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉ.గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ, TGలో MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి పోలింగ్ జరిగింది. కాగా టీచర్ స్థానాలకు ఇవాళ సాయంత్రం. పట్టభద్రుల MLCలకు రెండు రోజుల వరకు కౌంటింగ్ కొనసాగనుంది.

TG: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగదీతపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఈ నెల 1న లక్ష కార్డులు <<15572734>>ఇస్తామని చెప్పగా<<>> అమల్లోకి రాలేదు. పరిశీలన ప్రక్రియ పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ విద్యుత్, ₹500కే సిలిండర్ లాంటి పథకాలకు రేషన్ కార్డే కీలకం. దీంతో కొత్త కార్డులు, పాత కార్డుల్లో మార్పుల కోసం 18Lపైనే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15నాటికి రూ.లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. వారికి దశలవారీగా రూ.5లక్షలు ఇవ్వనున్న విషయం <<15529635>>తెలిసిందే.<<>>

– వాక్కు <<15631947>>ముందు <<>>వార్మప్ చేయకుంటే అంతర్గత గాయాలు/ కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి
– మొబైల్ వాడుతూ నడిస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది
– పరగడుపున నడక వద్దు. తేలికపాటి ఆహారం లేదా పాల వంటి డ్రింక్స్ తీసుకుని బయల్దేరండి
– భోజనం తర్వాత 30ని.లోపు వాకింగ్ చేయకండి
– ఫుట్వేర్తో పాదాలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. సరైన ఫుట్వేర్తోనే వాకింగ్ స్పీడ్, నేలపై గ్రిప్, గాయాల నుంచి తప్పించుకోవచ్చు

AP: కృష్ణా జిల్లా నాగాయలంక(మ) గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం DRDO రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.