News March 2, 2025

రేవంత్.. చేతనైతే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు: హరీశ్ రావు

image

TG: సీఎం రేవంత్‌కు చేతనైతే కృష్ణా నీటి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై యుద్ధం ప్రకటించాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. చంద్రబాబు యథేచ్ఛగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నారని, దానిని అడ్డుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. ‘బీజేపీతో పగలు కుస్తీ, రాత్రి దోస్తీ చేస్తున్నారు. SLBC సందర్శనకు వస్తే మమ్మల్ని ఆపారు. కానీ BJP వాళ్లకు ఎందుకు స్వాగతం పలికారు?’ అని ప్రశ్నించారు.

News March 2, 2025

షాకింగ్.. కేంద్ర మంత్రి కూతురికి వేధింపులు

image

మహారాష్ట్ర ముక్తాయ్‌నగర్‌లో తన కూతురిని కొందరు యువకులు వేధించారని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డుకున్న సెక్యూరిటీపైనా వారు దురుసుగా ప్రవర్తించారన్నారు. ఒక కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే ఇతరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై CM ఫడణవీస్ స్పందిస్తూ ఇప్పటికే కొందరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.

News March 2, 2025

అక్కసుతోనే సునీల్ సస్పెన్షన్: RS.ప్రవీణ్

image

AP CID మాజీ చీఫ్ సునీల్‌ను <<15629157>>సస్పెండ్<<>> చేయడాన్ని మాజీ ఐపీఎస్ RS.ప్రవీణ్ తప్పుబట్టారు. ‘SC వ్యక్తి DGP అవుతాడేమోనన్న అక్కసుతో సస్పెండ్ చేశారు. వ్యక్తిగత సెలవుకు అప్లై చేసినప్పుడే తాను విదేశాలకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. కండక్ట్ రూల్‌ను అప్లై చేస్తే సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండవుతారు. ఏ మాత్రం నిజాయితీ ఉన్నా బాబు గారు తమ విదేశీ టూర్ల షెడ్యూల్స్‌ను బయటపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.

News March 2, 2025

ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

image

తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్టియర్, 6 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత కాలేజీల లాగిన్‌లలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, తాజాగా వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్ నంబర్/SSC హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News March 2, 2025

ఉత్కంఠ: రన్స్ కోసం కివీస్.. వికెట్ల కోసం భారత్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-కివీస్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. రన్స్ కోసం న్యూజిలాండ్, వికెట్ల కోసం టీమ్ ఇండియా ప్లేయర్లు చెమటోడుస్తున్నారు. 14 ఓవర్ల తర్వాత ఎట్టకేలకు మిచెల్ వికెట్‌ను కుల్దీప్ తీశారు. దీంతో 26 ఓవర్లలో కివీస్ స్కోర్ 104/3గా ఉంది. రన్‌రేట్ మెల్లగా పెరుగుతోంది. విల్ యంగ్ 22, రచిన్ 6, మిచెల్ 17 పరుగులకు ఔటయ్యారు. క్రీజులో విలియమ్సన్ 45, టామ్ లాథమ్ 5 ఉన్నారు.

News March 2, 2025

మార్చి 31లోపు రైతు భరోసా: భట్టి

image

TG: రాష్ట్రంలోని రైతులందరికీ ఈనెల 31లోపు ‘రైతు భరోసా’ అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రూ.2,000 అధికంగా ఇస్తున్నామని వనపర్తి సభలో తెలిపారు. ఏప్రిల్ 14న డా.బి.ఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు రూ.6,000 కోట్ల నిధులతో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

News March 2, 2025

SLBC ఘటనపై రాజకీయం తగదు: CM

image

TG: SLBC ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదమని, దీనిపై విపక్షాలు రాజకీయం చేయడం తగదని సీఎం రేవంత్ అన్నారు. ‘సొరంగంలో గల్లంతైన వారి కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ సమస్య కొలిక్కి రావడానికి 2, 3 రోజులు టైమ్ పడుతుంది. అవసరమైతే రోబోలు వాడే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సొరంగంలో చిక్కుకున్న వారు కచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది ఇంకా గుర్తించలేదు’ అని స్పష్టం చేశారు.

News March 2, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు

image

AP: విశాఖ రుషికొండ బీచ్ ప్రతిష్ఠాత్మక బ్లూఫ్లాగ్ హోదా కోల్పోయింది. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో తాత్కాలికంగా ఆ హోదా రద్దయ్యింది. దీంతో పర్యాటకంగా రాష్ట్ర పరువు పోయిందని ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు. బీచ్ నిర్వహణ ఆధారంగా డెన్మార్క్ సంస్థ బ్లూఫ్లాగ్ ఇస్తుంది. ఆ బీచ్‌లకే విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతారు. 2020 నుంచి రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ హోదా ఉండేది.

News March 2, 2025

ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM

image

TG: SLBC టన్నెల్ వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

News March 2, 2025

సెబీ మాజీ ఛైర్‌పర్సన్ మాధవీపై FIR.. కోర్టు ఆదేశం

image

ఆర్థిక అవకతవకల వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్‌పర్సన్ మాధవీపురి బుచ్, మరో ఐదుగురిపై FIR నమోదు చేయాలని ముంబై ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆమె పదవిలో ఉండగా రెగ్యులేటరీ ఉల్లంఘనలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగాయంటూ ఓ జర్నలిస్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు చేసి 30 రోజుల్లో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని అధికారులను ఆదేశించింది.