India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మన దేశంలో చాలా రాష్ట్రాల్లో తమ కూతురు బాగుండాలని వరుడికి తల్లిదండ్రులు కట్న కానుకలు ఇవ్వడం కామన్. కానీ అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గలో తెగలో పెండ్లి కూతురికి కానుకలు ఇస్తారు. అరి అనే ఆచారంలో భాగంగా వధువుకు వరుడి కుటుంబం డబ్బులు, బహుమతులు, ఆస్తులు అందజేస్తారు. రెండు కుటుంబాల సత్సంబంధాలకు ఈ ఆచారాన్ని పాటించాలని వారు విశ్వసిస్తారు.

విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున 300 వన్డేలు ఆడిన ఏడో ప్లేయర్గా నిలిచారు. న్యూజిలాండ్ మ్యాచులో ఈ మైలురాయి చేరుకున్నారు. ఈ జాబితాలో సచిన్(463), ధోనీ(350), ద్రవిడ్(344), అజహరుద్దీన్(334), గంగూలీ(311), యువరాజ్(304) విరాట్ కంటే ముందు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా 22వ ప్లేయర్ కావడం గమనార్హం.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు గ్రూప్-Aలో తొలి స్థానంలో నిలవనుంది. హర్షిత్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారు.
భారత్: రోహిత్ (C), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YSR, సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ రోల్లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ IPLపై విషం కక్కారు. IPLను బాయ్కాట్ చేయాలని ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు పిలుపునిచ్చారు. ‘భారత క్రికెటర్లు ఏ ఇంటర్నేషనల్ లీగ్లలో పాల్గొనరు. కానీ ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ IPL ఆడతారు. భారత ప్లేయర్లు ఫారిన్ లీగ్స్ ఆడే వరకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు ఇండియాకు పంపొద్దు’ అని వ్యాఖ్యానించారు.

AP: ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారన్న వార్తను రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

కిడ్నీఫెయిలైన వారిలో 90శాతం బీపీ, షుగర్ పేషెంట్సేనని నెఫ్రాలజిస్ట్ డా. భూషణ్ రాజు తెలిపారు. ఏటా HYDలోనే 30 వేల నుంచి 40 వేల మంది వ్యాధికి గురవుతున్నారని పేర్కొన్నారు. వీరిలో మధుమేహం వల్ల 40%, బీపీ వల్ల 30% మందికి జబ్బు సోకుతుందన్నారు. చివరి దశలలో వ్యాధిని గుర్తించి ఆసుపత్రికి వచ్చినా ప్రయోజనం ఉండదని తెలిపారు. బీపీ, షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్త పడాలని స్క్రీనింగ్ చేయించాలని సూచించారు.

AP: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకుంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆయనపై ఆరోపణలు రావడంతో వాటిని విచారించేందుకు కమిటీని నియమించింది.

TG: గద్దర్ అవార్డులను ఉగాది రోజున ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక పోటీలు నిర్వహించి, నాటకాలను ప్రదర్శించే కళాకారులకు కూడా అవార్డులను ఇస్తామన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. సినిమా రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను ఈనెల 28న రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 29న రిలీజ్ చేయాల్సి ఉండగా, ఆరోజు అమావాస్య ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఒక రోజు ముందుగా రిలీజ్ చేయమని కోరారని వెల్లడించారు. అంతే తప్ప వేరే కారణం లేదని, అదే రోజు రిలీజ్ అవుతున్న నితిన్ ‘రాబిన్హుడ్’ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.