News September 4, 2024

1,53,278 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

image

TG: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయని, పంట నష్టం 4 లక్షల ఎకరాలకు పెరగొచ్చని అన్నారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు కొత్త పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు.

News September 4, 2024

అక్టోబర్ 18 నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11

image

ప్రో కబడ్డీ లీగ్(PKL) సీజన్ 11 అక్టోబర్ 18న ప్రారంభం కానుంది. మొత్తం 3 వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. 18వ తేదీ నుంచి HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో, నవంబర్ 10 నుంచి నోయిడాలో, డిసెంబర్ 3 నుంచి పుణేలో మ్యాచులు నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్ గేమ్స్ వేదికలు ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. గత సీజన్‌లో పుణేరి పల్టాన్ విజేతగా నిలిచింది.

News September 4, 2024

బుడమేరు వాగు గురించి తెలుసా?

image

విజయవాడలో ముంపునకు కారణమైన ‘బుడమేరు’ మైలవరం కొండల్లో పుట్టింది. ఆరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలవుతుంది. కొల్లేరు సరస్సుకు నీటిని సరఫరా చేస్తుంది. దీనిలో ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో నీళ్లుంటాయి. సాధారణంగా ఏటా గరిష్ఠంగా 10,000-11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తుంది. ఇది చాలా మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుండడంతో ఎక్కువ ప్రవాహం వస్తే నీరు గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంది.

News September 4, 2024

గూగుల్ క్రోమ్‌ యూజర్లకు అలర్ట్

image

డెస్క్‌టాప్ యూజర్లు గూగుల్ క్రోమ్‌ను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని CERT-In సూచించింది. క్రోమ్ బ్రౌజర్‌లో బగ్స్ ఉన్నాయని, వాటితో హ్యాకర్లు క్రోమ్‌లోని డేటాను కాపీ చేయొచ్చని తెలిపింది.
☛క్రోమ్ అప్‌డేట్ చేసేందుకు రైట్ సైడ్ టాప్‌లో ఉన్న 3 వర్టికల్ డాట్స్‌పై క్లిక్ చేసి HELPపై నొక్కాలి. తర్వాత about google chromeపై నొక్కితే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. తర్వాత రీలాంచ్‌ చేయాలి.

News September 4, 2024

డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం.. షెడ్యూల్ విడుదల

image

TG: డిగ్రీ ఫస్టియర్‌లో ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ సీట్లు రానివారు డిగ్రీలో చేరేందుకు వీలుగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. ₹400తో ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 11న సీట్ల కేటాయింపు, 11-13 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, 12, 13న కాలేజీల్లో రిపోర్టింగ్‌ జరగనుంది.

News September 4, 2024

తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి

image

వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్‌పర్సన్ నారా భువనేశ్వరి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

News September 4, 2024

ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు: CM

image

AP: ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని CM CBN తెలిపారు. ‘బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తాం. వాగు నీరు నేరుగా కృష్ణా నదికి వచ్చేలా ఉండే అడ్డంకులు తొలగిస్తాం. విజయవాడకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడతాం. గోదావరి వరదను పర్యవేక్షిస్తున్నాం. ఇంటింటికి ఆహారం సరఫరా చేస్తాం. పశువులకు దాణా అందిస్తాం. అస్నా తుఫాను ఇటు రాదంటున్నారు. అయినా అలర్ట్‌గా ఉంటాం’ అని చెప్పారు.

News September 4, 2024

నిద్రను త్యాగం చేసి ఉద్యోగం చేస్తున్నారా?

image

వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను అర్థం చేసుకోకుండా చాలా మంది తమ సమయాన్ని ఉద్యోగం కోసమే త్యాగం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన యువ పారిశ్రామికవేత్త కృతార్థ్ మిట్టల్ నిద్ర పోకుండా, ఆహారం తీసుకోకుండా పనిచేసి కెరీర్‌లో సక్సెస్ అయ్యారు. కానీ 25 ఏళ్లకే వివిధ ఆరోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. 5 గంటల కంటే తక్కువ నిద్రపోయి డైట్ పాటించకపోవడంతో ఇలా జరిగిందని, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.

News September 4, 2024

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో 5 మెడల్స్

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ మరో 5 పతకాలు గెలిచింది. దీంతో ఇప్పటివరకు గెలిచిన మెడల్స్ సంఖ్య 20కి చేరింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని మెడల్స్ సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. తాజాగా జరిగిన పోటీల్లో స్ప్రింటర్ దీప్తి జీవన్‌జీ కాంస్యం, మెన్స్ హై జంప్ t63 ఈవెంట్‌లో శరద్ సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలిచారు. మెన్స్ జావెలిన్ త్రో f46 ఈవెంట్‌లో అజీత్ సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ గెలుచుకున్నారు.

News September 4, 2024

ఇండియాVSమారిషస్‌ మ్యాచ్ డ్రా.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం

image

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో ఇండియా, మారిషస్ తలపడగా, ఏ జట్టూ గోల్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో మూడు జట్ల మధ్య 3 మ్యాచులు (రౌండ్ రాబిన్ ఫార్మాట్) జరగనుండగా, సెప్టెంబర్ 6న మారిషస్VSసిరియా, 9న ఇండియాVSసిరియా మ్యాచులు జరగనున్నాయి.