India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
జట్టు: సూర్య (C), అభిషేక్ శర్మ, శాంసన్, రింకూ సింగ్, హార్దిక్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
*అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు T20లు జరగనున్నాయి.
AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఘోరమైన ఆరోపణలు చేసిన కూటమి నేతలు పాపపరిహారం చేసుకోవాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. డిక్లరేషన్ అనేది టీటీడీ, భక్తుడికి సంబంధించిన అంశమని చెప్పారు. ‘జగన్ తిరుమల వెళ్తానంటే దానిని రాజకీయం చేశారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు? గతంలో జగన్ పలుమార్లు తిరుమల వెళ్లినా అడగలేదు. మతం వ్యక్తిగతం అని సీఎం చంద్రబాబుకు తెలియదా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఒక్కో ఫ్రాంచైజీకి రిటెన్షన్ పర్స్ కింద రూ.75 కోట్ల వరకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. మొట్టమొదటగా రిటెన్షన్ చేసుకునే ఆటగాడికి, నాలుగో రిటెన్షన్ ఆటగాడికి రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. థర్డ్ రిటెన్షన్ రూ.11 కోట్లు, సెకండ్ అండ్ ఫిఫ్త్ రిటెన్షన్ ఆటగాడికి రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.120 కోట్లలో మిగతా రూ.45 కోట్లతో మెగా వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.
IPL 2025 కోసం BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పర్సు విలువను రూ.115 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పర్స్ వ్యాల్యూ రూ.90 కోట్లుగా ఉండేది. నవంబర్ రెండో వారంలో 2 రోజులపాటు మెగా ఆక్షన్ జరుగుతుందని సమాచారం. మరోవైపు ఐదుగురి రిటెన్షన్పై మెజారిటీ ఫ్రాంచైజీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
3 నెలలుగా HR టీమ్ నియామకాలు చేస్తున్నా కంపెనీలోకి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాకపోవడంతో ఓ మేనేజర్ విసుగు చెందారు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకోవడానికి తన CVని పంపగా నిమిషాల్లోనే తిరస్కరణకు గురైంది. HR సిస్టమ్లో లోపం వల్ల ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో HR టీమ్ మొత్తాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఉదంతాన్ని ఆయన Redditలో షేర్ చేయగా వైరలవుతోంది.
భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పేగుల్లో కదలికలు జరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తిన్న వెంటనే కాకుండా 5-10 నిమిషాల తర్వాత నడవాలని సూచిస్తున్నారు.
IPL-2025 మెగా వేలానికి ముందు BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్(తమ వద్దే ఉంచుకోవడం) చేసుకునేందుకు వీలు కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో స్వదేశీ, విదేశీ ప్లేయర్ల సంఖ్యతో సంబంధం లేదని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈసారి దుబాయ్ వేదికగా నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్లో మెగా ఆక్షన్ జరగనుంది.
2024 ప్రథమార్థంలో 4.78 మిలియన్ల మంది విదేశీయులు భారత్లో పర్యటించారు. US, బంగ్లాదేశ్ నుంచి అధికంగా వస్తున్నట్టు పర్యాటక శాఖ తెలిపింది. వరల్డ్ టూరిజం డే సందర్భంగా రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇది టూరిజం వృద్ధిని సూచిస్తున్నప్పటికీ కరోనా ముందు ఉన్న పరిస్థితుల కంటే వెనుకబడినట్టు స్పష్టం అవుతోంది. భారత టూరిజం హబ్ లక్ష్యాలను ఇది ప్రభావితం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది.
అప్పట్లో ఒకే సమయంలో చాలామందితో డేటింగ్ చేశానని నటి కల్కి కొచ్లిన్ తెలిపారు. అదొక ప్రత్యేక అనుభూతి అని ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం అలాంటి వాటి గురించి ఆలోచించడం లేదు. నాకు భర్త, పాప ఉన్నారు. ఇప్పుడు నా భర్తను పట్టించుకునేంత టైమ్ కూడా నాకు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా గయ్ హెర్ష్బర్గ్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’లో ఈమె హీరోయిన్గా నటించారు.
IPLలో ఆడే క్రికెటర్ల పంట పండనుంది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్కు కాంట్రాక్టెడ్ అమౌంట్కు అదనంగా రూ.1.05 కోట్లు ఇస్తామని వెల్లడించారు. మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60 కోట్లు కేటాయించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా Xలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.