News February 26, 2025

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి పార్ట్‌నర్: CM రేవంత్

image

TG: KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్‌నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై మాట్లాడుతూ ‘పదేళ్ల నుంచి పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 30కి.మీ మేర టన్నెల్ పూర్తయింది. తర్వాత తనకు లాభాలు రావడం లేదని KCR పనులను ఆపేశారు’ అని పేర్కొన్నారు.

News February 26, 2025

సినీ నిర్మాత మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

image

TG: సినీ నిర్మాత కేదార్ <<15577363>>మృతిని<<>> KTRకు ముడిపెడుతూ CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా పలువురు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని సందేహం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, ఆ తర్వాత రాజలింగ మూర్తి, KTR సన్నిహితుడు కేదార్ చనిపోయారని తెలిపారు. ఈ మిస్టీరియస్ మరణాలపై ఆయన ఎందుకు స్పందించలేదని, విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కేదార్ డ్రగ్స్ కేసులో నిందితుడని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.

News February 26, 2025

SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు

image

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. BSF టన్నెల్ వర్క్స్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రప్పించింది. ప్రస్తుతం వారు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీబీఎం చేరే దారి కోసం వారు వెతుకుతున్నారు. సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా ఉన్న బురదను తొలగించేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిపుణులతో సమీక్ష జరిపారు.

News February 26, 2025

రికార్డు సృష్టించిన ‘లక్కీ భాస్కర్’

image

స్టార్ నటుడు దుల్కర్‪‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన 13 వారాల నుంచి ఈ చిత్రం ట్రెండ్ అయి రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. వరుసగా ఇన్ని వారాలు ట్రెండ్ అయిన తొలి సౌత్ఇండియా మూవీ ‘లక్కీ భాస్కర్’ అని ఓ పోస్టర్ విడుదల చేశారు. మీరూ ఈ సినిమా చూశారా?

News February 26, 2025

స్విగ్గీ మెనూలో బీఫ్ ఐటమ్స్.. యూజర్లు ఫైర్

image

స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లో బీఫ్ ఐటమ్స్‌ను లిస్ట్ చేయడంపై పలువురు యూజర్లు మండిపడుతున్నారు. HYDలోని ఓ రెస్టారెంట్ మెనూలో బీఫ్ ఐటమ్స్‌ను స్విగ్గీ చూపించింది. దీని గురించి ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘స్విగ్గీని అన్ ఇన్‌స్టాల్ చేస్తాం. బీఫ్ బిర్యానీ అమ్మడం లీగలేనా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని GHMC తెలిపింది.

News February 26, 2025

నేను BRSలోనే ఉన్నా: గద్వాల్ ఎమ్మెల్యే

image

TG: తాను BRSలోనే ఉన్నానని గద్వాల్ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నట్లు కొందరు ఫ్లెక్సీలు వేసి అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై గద్వాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో చేరి మళ్లీ బీఆర్ఎస్ గూటికి వచ్చిన విషయం తెలిసిందే.

News February 26, 2025

మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్!

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News February 26, 2025

రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. కృష్ణలంక పీఎస్‌లో 5 గంటలపాటు ఆయనను పోలీసులు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తీసుకెళ్తారు.

News February 26, 2025

టాప్-5లోకి కోహ్లీ

image

ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకుకు చేరారు. ఇక నం.1 స్థానంలో 817 పాయింట్లతో గిల్ కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్, రోహిత్ శర్మ, క్లాసెన్ ఉన్నారు. మరోవైపు వన్డేల్లో టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

News February 26, 2025

మార్చి 2 వరకు జాగ్రత్త!

image

తెలంగాణలో 5 రోజుల పాటు ( ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2) ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 40డిగ్రీలు చేరుకునే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో 34-37 డిగ్రీల మధ్య ఉండొచ్చని వెల్లడించింది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.