India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: భారీ వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన <<13982784>>ఘటనలో<<>> మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి న్యూ లుక్లో కనిపించారు. తన పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ఉన్న పిక్ను నమ్రతా శిరోద్కర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా రాజమౌళి డైరెక్షన్లో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న సినిమాలో మహేశ్ నటించనున్నారు. ఈ మూవీ కోసం ఆయన పొడవాటి జుట్టుతో లుక్ మొత్తం మార్చేశారు.
3 సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్లను చోరీ నుంచి రక్షించుకోవచ్చు. ముందుగా డివైజ్ లాక్ తప్పనిసరి. తద్వారా దొంగ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు. ఆ తర్వాత ‘notification on lock screen’ ఆఫ్ చేయండి. దీంతో పాటు ‘find my device’ ఎనేబుల్ చేయండి. ఈ సెట్టింగ్స్ చేశాక ఎప్పుడైనా మీ ఫోన్ కనిపించకపోతే వేరే డివైజ్లో మీ మెయిల్తో లాగిన్ అయ్యాక గూగుల్లో ‘android/find’ అని వెతికితే లొకేషన్ కనిపిస్తుంది.
TG: హైదరాబాద్లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన ‘హైడ్రా’ దూకుడు పెంచింది. ఫలితంగా ఆరుగురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDA ఏపీఓ, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై EAO (ఆర్థిక నేర విభాగం)లో ఫిర్యాదు చేసింది. వీరంతా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని తెలుస్తోంది.
AP: మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడు ప్రమోషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నేటితో ఆయన రిటైర్ కానుండగా నిన్న DSP నుంచి ASPగా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కి ఆయనకు ప్రమోషన్ కల్పించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆయన ఒక్కరి కోసం 32 మందికి ASPలుగా ప్రమోషన్ ఇచ్చారని విమర్శిస్తోంది. వీరంతా ASPలుగా రిటైరైతే ఖజానాపై అనవసర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
AP: భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2,3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్నిబట్టి ఇవాళ పింఛన్ అందనివారికి రేపు, ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు.
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4 నుంచి జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని సమాచారం. గులామ్ అహ్మద్ మిర్ పోటీ చేస్తున్న దూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకుంది. 90కి గాను 32 చోట్ల పోటీ చేస్తోంది. ఇప్పటికే తొమ్మిది మందితో తొలి జాబితా విడుదల చేసింది.
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, విపత్తు నిర్వహణ శాఖ పంపే అలర్ట్ మెసేజ్లను గమనిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు సహాయం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
TG: రేవంత్ సర్కార్ గృహజ్యోతి పథకం పేరుతో పేదలను నమ్మించి నట్టేట ముంచిందని BRS పార్టీ X వేదికగా విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి షరతులు లేకుండా కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని చెప్పిందని, ఇప్పుడేమో ముక్కు పిండి వసూలు చేస్తోందని ఆరోపించింది. మీకు ఉచిత విద్యుత్ అందుతోందా? కామెంట్ ద్వారా తెలియజేయండి.
దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులను ఢిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు శంభూ సరిహద్దులో ఫిబ్రవరి 13 నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.