News September 27, 2024

Jr.NTR ‘దేవర’ రివ్యూ & రేటింగ్

image

భయమెరుగని వారికి ‘దేవర’ భయాన్ని ఎలా పరిచయం చేశాడనేదే సినిమా. డబుల్ రోల్‌లో Jr.NTR ఇరగదీశారు. ఫైట్లు, ఆయుధపూజ సీన్స్, అనిరుధ్ BGM మూవీకే హైలైట్. విలన్‌గా సైఫ్ అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ ట్విస్ట్ సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెంచింది. అయితే ఫస్టాఫ్‌లోని హైప్‌‌ను సెకండాఫ్‌లో కొరటాల కొనసాగించలేకపోయారు. VFX, స్క్రీన్‌ప్లే‌పైనా మరింత దృష్టి పెట్టాల్సింది. జాన్వీకి పెద్దగా స్కోప్ లేదు.
రేటింగ్: 3/5

News September 27, 2024

INDvsBAN: రెండో టెస్టు ముంగిట వర్షం

image

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగాల్సిన కాన్పూర్‌లో రాత్రి వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ జరిగే గ్రీన్‌పార్క్‌ స్టేడియం పిచ్‌పై కవర్స్ కప్పారు. అయితే ప్రస్తుతం వర్షం లేకపోవడంతో వాటిని తొలగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

News September 27, 2024

నేడు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్?

image

AP: నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3,736 వైన్ షాపులు ఏర్పాటు చేస్తారు. వీటిలో 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 50 వేలలోపు ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలలోపు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల పైన ఉంటే రూ.85 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాలి.

News September 27, 2024

తొలి దశలో 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

image

TG: రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తుందని సమాచారం. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ఇవ్వనుంది.

News September 27, 2024

MBBS కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

image

TG: రాష్ట్రంలో MBBS ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ రోజు ఉ.6గంటల నుంచి ఈ నెల 29వ తేదీ సా.6గంటలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కన్వీనర్ కోటా కింద దివ్యాంగులు, EWS, PMC, సైనిక ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల కోసం tspvtmedadm.tsche.inను సందర్శించాలి.

News September 27, 2024

₹10,000 కోట్లతో స్విగ్గీ IPO

image

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ గురువారం సెబీ వద్ద IPO పేపర్లను సబ్మిట్ చేసింది. ₹10వేల కోట్ల విలువతో వస్తోంది. పేటీఎం (₹18,300 కోట్లు) తర్వాత భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ IPO ఇదే. వచ్చే వారం షేర్‌హోల్డర్ల మీటింగ్ తర్వాత ఈ విలువను ₹11,700 కోట్లకు పెంచుతారని అంచనా. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹3750 కోట్లు, OFS ద్వారా మిగిలిన డబ్బును సమీకరిస్తారు. స్విగ్గీ రైవల్ జొమాటో ₹9,375 కోట్లతో IPOకు వచ్చింది.

News September 27, 2024

నేడు ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రారంభం

image

TG: విదేశాల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా HYDలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కోసం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్య ఒక వారధిలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

News September 27, 2024

‘దేవర’లో కొన్ని సీన్లు కట్ చేశారా?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా థియేటర్లలో రిలీజైంది. అభిమానులు ప్రీమియర్ షోల్లో సందడి చేస్తున్నారు. హిందీలో కూడా ఇంతే క్రేజ్‌తో భారీ ఎత్తున రిలీజవుతోంది. అయితే 2.50 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీని హిందీ ప్రేక్షకుల కోసం 7 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నటీనటులకు సంబంధించిన కొన్ని సోలో సన్నివేశాలను కత్తిరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

News September 27, 2024

శ్రీశైలానికి అతి పెద్ద ఫ్లైఓవర్

image

TG: రాష్ట్రంలోని మన్ననూర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు 55 KM మేర అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం, NTCAకు పంపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.7,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది కార్యరూపం దాలిస్తే దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్‌గా నిలవనుంది. మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వెళ్లవచ్చు.

News September 27, 2024

సెమీ కండక్టర్ల ప్లాంట్: మోదీని కలిసిన టాటా సన్స్, PSMC టీమ్

image

టాటాసన్స్, తైవాన్ కంపెనీ PSMC లీడర్‌షిప్ టీమ్ PM నరేంద్రమోదీని కలిసింది. గుజరాత్‌ ఢోలేరాలో నెలకొల్పే సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ FAB అప్డేట్స్‌ను ఆయనకు తెలియజేసింది. భారత్‌లో తమ ఫూట్‌ప్రింట్ పెంచుకొనేందుకు PSMC ఆసక్తి ప్రదర్శించినట్టు మోదీ ట్వీట్ చేశారు. FAB కోసం ఈ 2 కంపెనీలు రూ.91000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రతి నెలా 50వేల వేఫర్స్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ 20వేల జాబ్స్ క్రియేట్ చేయనుంది.

error: Content is protected !!