News September 20, 2024

తిరుమ‌ల ప్ర‌సాదం క‌ల్తీ వివాదం.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

image

తిరుమ‌ల‌ ప్ర‌సాదం కల్తీ వివాదం నేపథ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజ‌ల‌కు, దీపాలకు, అన్న ప్ర‌సాదాల‌కు నందిని నెయ్యి మాత్ర‌మే వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామ‌లింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.

News September 20, 2024

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..

image

దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో ఈవెంట్ జరుగుతుందని మూవీ టీమ్ ట్విటర్‌లో ప్రకటించింది. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. సినిమా ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

News September 20, 2024

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై విచారణ

image

TG: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్‌టీఎల్ పరిధి 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత రికార్డుల్లో అది 65 ఎకరాలుగా ఉందని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

News September 20, 2024

సీఎం తమ్ముడు, బావమరిదికే అన్ని కాంట్రాక్టులు: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, తోఖన్ సాహూకు లేఖ రాశారు. అర్హతలు లేకున్నా CMరేవంత్ తమ్ముడు, బావమరిదికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల సమాచారాన్ని ప్రభుత్వం తొక్కిపెడుతోందని విమర్శించారు. దీనిపై స్పందించకుంటే కాంగ్రెస్ అవినీతిలో కేంద్రం వాటా ఉందని ప్రజలు నమ్ముతారు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

ప్రకాశం వైసీపీ అధ్యక్షుడిగా బూచేపల్లి

image

AP: ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

News September 20, 2024

కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్

image

TG: సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలోని 25 వేల మందికి రూ.5,000 ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందించనున్నట్లు చెప్పారు. అటు 41వేల మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులకు బోనస్ కింద ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు అందనున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది రూ.20వేలు బోనస్ అదనంగా అందుతోంది.

News September 20, 2024

మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం

image

TG: మూడు యూనిర్సిటీల పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, టెక్స్‌టైల్ అండ్ హ్యాండ్‌లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను ఖరారు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంపైనా క్యాబినెట్ చర్చించింది. అలాగే ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 20, 2024

విరాట్ తప్పిదం.. నాటౌటైనా పెవిలియన్‌కు!

image

బంగ్లాతో తొలి టెస్టులో భారత్ పట్టు సాధించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు మీదున్న విరాట్ స్వీయ తప్పిదంతో పెవిలియన్ చేరారు. హసన్ వేసిన బంతి ఆయన బ్యాట్‌కు తగులుతూ ప్యాడ్‌ను తాకింది. అంపైర్ LBWగా ఔటిచ్చారు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గిల్‌తో మాట్లాడి కోహ్లీ వెనుదిరిగారు. రీప్లేలో బాల్ ఆయన బ్యాట్‌కు తాకినట్లుగా తేలింది. అది చూసి కెప్టెన్ రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి అసహనం వ్యక్తం చేశారు.

News September 20, 2024

బుమ్రా @ది వరల్డ్ క్లాస్ ప్లేయర్!

image

చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పడగొట్టిన నాలుగు వికెట్లు బంగ్లాను తక్కువ మొత్తానికే ఆలౌట్ చేసేందుకు తోడ్పడ్డాయి. సొంతగడ్డపై బుమ్రా ఇప్పటివరకు 9 టెస్టులు ఆడగా 15.94 సగటు& 32.4 స్ట్రైక్ రేట్‌తో 37 వికెట్లు తీశారు. ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 20, 2024

నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది: మోదీ

image

విదేశీ గ‌డ్డ‌పై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్‌లో దేశ‌భ‌క్తి స్ఫూర్తి చ‌చ్చిపోయింద‌ని ఆయన మండిపడ్డారు. ‘పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ల భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాట‌ల‌ను చూడండి. ఇది ‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బ‌న్ న‌క్స‌ల్స్ న‌డుపుతున్న కాంగ్రెస్’ అంటూ ప్ర‌ధాని మండిప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌లోని వార్ధ సభలో ఆయ‌న‌ మాట్లాడారు.

error: Content is protected !!