India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించారు. ఈ ఏడాది పూరన్ 2,059 పరుగులు చేశారు. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(2036 రన్స్-2021)ను ఆయన అధిగమించారు. వీరిద్దరి తర్వాత అలెక్స్ హేల్స్ (1946 రన్స్-2022), జోస్ బట్లర్ (1833 రన్స్-2023) ఉన్నారు. 2022లోనూ మహ్మద్ రిజ్వాన్ (1817 రన్స్) అత్యధిక పరుగులు చేశారు.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. చియా, ఫ్లాక్స్, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. ఖర్జూరంలో ఉండే పీచు, పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డ్రై బ్లూబెర్రీస్ & రాస్ప్బెర్రీలు తినండి. ఇవన్నీ రోజూ ఓ పిడికెడు తింటే చాలా మంచిదని వైద్యులు సూచించారు.
AP: వైసీపీ శ్రేణులు శనివారం పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చిన జగన్.. ఇవాళ ఎటు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశ్నించారు. ‘పూజల్లో పాల్గొనాలని మీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరి మీరు ఎక్కడ? మీరు దగ్గరలోని ఆలయానికి ఎందుకు వెళ్లలేదు? మీరు నిజంగా ఆచారాలను గౌరవిస్తే ఎందుకు వెళ్లలేదు? అందుకే టీటీడీ డిక్లరేషన్ అడుగుతోంది. నాయకులు చెప్పడమే కాదు చెప్పిన మాటను గౌరవించాలి’ అని ట్వీట్ చేశారు.
పొలంలో పాము కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతో ఓ వ్యక్తి మరణించాడు. బిహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రామ్ లఖన్ ప్రసాద్ అనే వ్యక్తిని పాము కాటేయడంతో ఆస్పత్రికి పరిగెత్తాడు. మద్యం తాగి పరిగెడుతున్నాడని అనుమానించి పోలీసులు అడ్డుకున్నారు. పాము కాటు గురించి చెప్పినా నమ్మలేదు. వదిలేయాలంటే రూ.2వేలు లంచం అడగ్గా అతని సోదరుడు రూ.700 ఇచ్చి తీసుకెళ్లాడు. లేట్ అవడంతో రామ్ చనిపోయాడు.
దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తున్న BSNL కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. తాజాగా 60 రోజుల వ్యాలిడిటీతో రూ.345 ప్రీప్రెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. డేటా లిమిట్ పూర్తయ్యాక నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది. ఇలాంటి ప్లాన్ జియో, ఎయిర్టెల్, Viలో లేదు.
AP: సనాతన ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. ‘భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉంది? చేగువేరా ఆదర్శాలు ఎటు వెళ్లిపోయాయి? బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు. అలాగే తన భార్య క్రిస్టియన్, పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని తెలిపారు. ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో చెప్పాలి?’ అని ప్రశ్నించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన వారు రైతులు కాదంటూ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ వ్యాఖ్యానించారు. పంజాబ్కు చెందిన కొందరు రైతుల ముసుగులో కేంద్రం, హరియాణా ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఆ మారువేషంలో ఉన్న వ్యక్తులు ట్రాక్టర్లతో రాజధానికి చేరుకొని ఎర్రకోటపై దాడి చేశారని, వారంతా రైతులు కాదని కట్టర్ పేర్కొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గాత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సందర్భంలో ఆయనతో పాట పాడించేందుకు కీరవాణి డిసైడ్ అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా దీనికి ఓకే చెప్పినట్లు టాక్. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా మృతితో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. నస్రుల్లా మృతిపై ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్తో ఖమేనీ సమావేశమైనట్టు The New York Times తెలిపింది. అలాగే తదుపరి క్యాచరణపై హెజ్బొల్లా, ప్రాంతీయ గ్రూప్లతో ఇరాన్ చర్చలు జరుపుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.
విదేశీ చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా స్వాగతిస్తూ సొంత పౌరులను అపహాస్యం చేసే అర్బన్ నక్సల్స్ నియంత్రణలో కాంగ్రెస్ పార్టీ ఉందని PM మోదీ విమర్శించారు. జమ్మూ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నడూ జవాన్ల త్యాగాలను గౌరవించలేదని ఆరోపించారు. ఈరోజు JKలో జరుగుతున్న మార్పులతో కాంగ్రెస్-NC, PDPలు రెచ్చిపోతున్నాయని, ఇక్కడి ప్రజల అభివృద్ధి వారికి నచ్చడం లేదని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.