News February 20, 2025

టీమ్ ఇండియాతో మ్యాచ్.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాతో ఆదివారం జరిగే మ్యాచుకు ముందు పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ ఫఖర్ జమాన్ దూరమైనట్లు పీసీబీ పేర్కొంది. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచులో గాయం కారణంగా మధ్యలోనే ఫీల్డ్ వీడగా ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపింది. దీంతో అతడు దుబాయ్ వెళ్లట్లేదని వెల్లడించింది. ఫఖర్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ను తీసుకుంటారని సమాచారం.

News February 20, 2025

మోదీ x రాహుల్: బైడెన్ ఎవరిని గెలిపించాలని అనుకున్నారు?

image

ఓటింగ్ శాతం పెంచేందుకు USAID $21M కేటాయించడాన్ని బట్టి 2024 లోక్‌సభ ఎన్నికలను అమెరికా ప్రభావం చేసినట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. చాలా NGOలు ఓటర్ల నమోదు డ్రైవ్స్ చేపట్టడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. భారత్‌లో జోబైడెన్ ఎవర్నో గెలిపించేందుకు ప్రయత్నిచారని <<15519378>>ట్రంప్<<>> చెప్పడంతో ఫోకస్ మోదీ, రాహుల్‌పై మళ్లింది. మరి ఆయన వారిద్దరిలో ఎవరికి మద్దతిచ్చినట్టు? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News February 20, 2025

చైనాలోనే ఎందుకిలా..!

image

అడవి జంతువులను చూసేందుకు వచ్చే సందర్శకులను ఫూల్స్ చేయడంలో చైనా షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జంతు ప్రదర్శనశాల ముందుంటుంది. గతంలో కుక్కలకు రంగేసి పాండాలు, సింహాలుగా చూపించి జూ నిర్వాహకులు వార్తల్లో నిలిచారు. తాజాగా గాడిదలకు నలుపు, తెలుపు చారలను గీసి జీబ్రాలుగా మార్చారు. దీనిని సందర్శకులు గమనించడంతో తీవ్రంగా విమర్శలొస్తున్నాయి. వినోదం కోసం ఇలా చేశామని నిర్వాహకులు సమాధానమిచ్చారు.

News February 20, 2025

‘ఛావా’ కలెక్షన్ల ప్రభంజనం

image

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ మూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి మూవీ ఇదేనని పేర్కొన్నాయి. లీడ్ రోల్‌లో విక్కీ కౌశల్ నటన అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తెలుగులోనూ రిలీజ్ చేయాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.

News February 20, 2025

JNTUలో వారానికి 5 పనిదినాలే!

image

TG: JNTU, దాని అనుబంధ కాలేజీల్లో పనిదినాలను 5 రోజులకు తగ్గించాలని కొత్త VC కిషన్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ విధానంతో మెయిన్ క్యాంపస్‌తోపాటు పాలేరు, మహబూబాబాద్, వనపర్తి, సిరిసిల్ల, సుల్తా‌న్‌పూర్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. 2008కి ముందు JNTUలో 5 పనిదినాలే ఉండేవి. ఆ తర్వాత వచ్చిన VCలు ఈ విధానానికి స్వస్తి పలికారు.

News February 20, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. BIG UPDATE!

image

TG: ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10 వరకు నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. ఆ లోపు పునాదులు తీసి బేస్‌మెంట్ నిర్మిస్తే తొలి విడతలో రూ.లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నేడో, రేపో రూ.1,000 కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రేపు నారాయణ పేటలోని అప్పక్కపల్లిలో లబ్ధిదారుడి ఇంటికి సీఎం రేవంత్ ముగ్గు పోయనున్నారు.

News February 20, 2025

రాజలింగమూర్తి హత్య.. సీఎం ఆరా!

image

TG: భూపాలపల్లిలో నడిరోడ్డుపై రాజలింగమూర్తి <<15516581>>హత్య ఘటనపై<<>> సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు మేడి‌గడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమని కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా భూవివాదమే హత్యకు కారణమని సమాచారం.

News February 20, 2025

హైకోర్టులో వంశీకి ఎదురుదెబ్బ

image

AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. మరోవైపు దళితుడిని కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న కేసులో ఇప్పటికే వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 20, 2025

‘డాకు మహారాజ్’ నుంచి ఊర్వశీ సీన్లు ఔట్?

image

నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, స్ట్రీమింగ్‌కు ముందు ‘నెట్‌ఫ్లిక్స్’ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊర్వశీ రౌతేలా నటించిన సీన్లు చిత్రంలో నుంచి తొలగించినట్లు ‘NDTV’ పేర్కొంది. పోస్టర్ నుంచీ ఊర్వశీ ఫొటోనూ తొలగించడంతో ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురిచేసినట్లు వెల్లడించింది. కాగా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

News February 20, 2025

పాక్ ఫసక్! ముక్కలవ్వడం పక్కా!

image

పాకిస్థాన్ 4 ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్, జియోపొలిటికల్ నిపుణుల అంచనా. మరికొన్ని రోజుల్లో బలూచిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకోవచ్చని వారు అంటున్నారు. పాక్ పార్లమెంటులో దీనిపై చర్చించడాన్ని ఉదహరిస్తున్నారు. ఇదే జరిగితే ఆ దేశం 30% భూమి కోల్పోవడం ఖాయమే. మరోవైపు బుల్లెట్లు పేల్చకుండానే PoKను స్వాధీనం చేసుకొనేందుకు భారత్ సిద్ధమైందని, సౌదీ, ఖతర్‌ అడ్డుచెప్పకుండా పావులు కదిపిందని చెప్తున్నారు.