India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘CBN నన్ను బోసిడీకే అని తిట్టించాడు. జూబ్లీహిల్స్ 36లోని బాలకృష్ణ బిల్డింగ్ నుంచే షర్మిలపై తప్పుడు రాతలు రాయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వర్రా రవీంద్ర పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ITDP సభ్యుడు ఉదయ్ భూషణ్ చేత మా అమ్మ, చెల్లిని తిట్టించారు. ఫిబ్రవరిలోనే అతడిని అరెస్టు చేశాం’ అని గుర్తు చేశారు.
ఝార్ఖండ్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 38 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ ఎక్స్క్లూజివ్గా WAY2NEWS యాప్లో చూడండి.
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటుహక్కు. దానిని ఉపయోగించుకోవడంలో ఫార్వర్డ్ స్టేట్ మహారాష్ట్ర వెనకబడగా బ్యాక్వర్డ్ స్టేట్ ఝార్ఖండ్ ముందుచూపు కనబరిచింది. అధిక పట్టణ జనాభా, అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్నులుండే మరాఠా రాష్ట్రంలో ఓటేసేందుకు ఉత్సాహం చూపించలేదు. గిరిజనులు, గ్రామీణులు అధికంగా ఉండే ఝార్ఖండ్ భూమిపుత్రులు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. 3PMకు JHAలో 61%, MHలో 45% ఓటింగ్ నమోదవ్వడమే ఇందుకు ఉదాహరణ.
ఆధార్, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 80.6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపింది. ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్మార్క్ నిర్దేశించామంది. ప్రస్తుతం 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేశామని పేర్కొంది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామంది.
ఝార్ఖండ్లో 81 సీట్లు ఉన్నాయి. 2019లో JMM 30, BJP 25, CONG 16 సీట్లు గెలిచాయి. అయితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా UPAకు 43, BJPకి 27 సీట్లు వస్తాయంది. ABP VOTER UPA 35, BJP 32 గెలుస్తాయని చెప్పింది. టైమ్స్ నౌ UPAకు 44, BJPకి 28 సీట్లు వస్తాయంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కరెక్టుగానే అంచనా వేశాయి. మరికాసేపట్లో రానున్న 2024 EXIT POLLSను వేగంగా తెలుసుకొనేందుకు WAY2NEWS ఫాలో అవ్వండి.
BGT సిరీస్ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో గెలుచుకుంటుందని ఆ జట్టు మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. సొంత గ్రౌండ్స్లో ఆడనుండటం, ప్రతిభావంతులైన సీనియర్ బౌలర్లుండటం ఆస్ట్రేలియాకు బలమని వివరించారు. ‘పేస్, బౌన్స్ ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా పిచ్లపై భారత ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. వారి బౌలింగ్ కూడా అనుభవలేమితో కనిపిస్తోంది. అశ్విన్, జడేజా ఇద్దరూ తుది జట్టులో కచ్చితంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.
AP: 2014-19 మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ₹24,792 కోట్లు ఖర్చు చేస్తే YCP హయాంలో ₹43,036 కోట్లు వెచ్చించామని జగన్ తెలిపారు. ఇంత చేసినా CBN, దత్తపుత్రుడు తమపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర రోడ్లపైకి వచ్చే ప్రజల నుంచి <<14653659>>టోల్ వసూలు<<>> చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఇదేనా సంపద సృష్టి అని ఫైరయ్యారు. ప్రజలు ట్యాక్స్ కడితేనే రోడ్లు వేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు.
పోలింగ్ ముగింపు సమయం సమీపించే కొద్దీ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి పెరుగుతోంది. ఆరు పార్టీలు 2 కూటములుగా పోటీచేస్తున్నాయి. 288 సీట్లకు గాను మహాయుతి 144-152 గెలిచి మళ్లీ అధికారం చేపట్టొచ్చని రాజస్థాన్ ఫలోడి సట్టాబజార్ అంచనా వేసింది. రెండు కూటముల మధ్య ఓటింగ్ అంతరం తక్కువే ఉంటుందని, స్వింగ్ కాస్త అటు ఇటైనా ఫలితాలు మారొచ్చంది. హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న సట్టాబజార్ అంచనా తప్పడం గమనార్హం.
గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రాజధాని జార్జ్టౌన్ Key to the City అందుకున్నారు. ఇది ఆ దేశ పాలకుల ద్వారా అతిథికి గౌరవసూచకంగా అందించే మధ్యయుగ కాలం నాటి సంప్రదాయం. ఆ దేశ పర్యటనకు విచ్చేసిన ప్రముఖ వ్యక్తుల పట్ల విశ్వాసం, గౌరవం, స్నేహపూర్వకతకు ప్రతీకగా దీన్ని బహూకరిస్తారు. మోదీపై గౌరవసూచకంగా, ఇరు దేశాల బంధాలు మరింత మెరుగుపడేలా ఆ దేశ పాలకులు ఈ తాళాన్ని బహూకరించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) మారుతున్న కాలంతో పాటు ముందుకెళ్లడం మరచిపోయిందని భారత్ విమర్శించింది. ప్రగతి విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘UNSC ప్రస్తుత పనితీరు 1945 నాటిదే. నేటి వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదు. సహాయంలో UN అద్భుతమే. కానీ ఉద్రిక్తతల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. సంస్థలో సంస్కరణలు అత్యవసరం’ అని UNలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.