India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. బీఈ/బీటెక్ చేసిన వారిని అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్ను బట్టి వయో సడలింపు ఉంది. శాలరీ గరిష్ఠంగా రూ.55,000 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: www.ntpc.co.in.

సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు అయ్యాయి. మస్క్కు చెందిన AI సంస్థ XAI గ్రోక్-3 సేవల్ని అందుబాటులోకి తెచ్చి ధరల్ని పెంచింది. యూజర్లు ఈ AI మోడల్ ఫీచర్స్ వాడాలంటే ‘X’లో ప్రీమియం+ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ధర నెలకు రూ.1750 ఉండగా.. రూ.3,470కి పెంచింది. ఏడాది ప్లాన్ రూ.18,300 నుంచి రూ.34,340కి చేరింది. 2023లో ‘X’ ప్రీమియం+ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.1300 ఉండేది.

TG: రాష్ట్రంలో CMRF నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మార్చి 4 వరకు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలోని 33 జిల్లాలకు 24 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో చెక్కుల పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.

రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను అప్పట్లో ఫ్లాప్ చేయడంపై ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అప్పుడు హిట్ చేసే వయసు మాకు రాలేదు. ఇంకో 50, 100 ఏళ్ల తర్వాత కూడా ఆరెంజ్ సినిమా క్లాసిక్’ అని రాసుకొచ్చాడు. దీనిపై డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు. ‘చాలా థాంక్స్. సినీ పరిశ్రమ జీవితంలో అంతర్లీనం. కేవలం కొన్ని భావోద్వేగాలను చూపించాలనుకున్నా. కాబట్టి నాకు ఎటువంటి విచారం లేదు’ అని తెలిపారు.

ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అంచనా వేశారు. దేశంలోనే ఇదో అతిపెద్ద ఎకనామిక్ ఈవెంట్ అన్నారు. దీంతో స్థానిక వ్యాపారాలు పుంజుకున్నాయన్నారు. డైరీస్, క్యాలెండర్లు, జూట్ బ్యాగులు, స్టేషనరీ, ఫుడ్, పానీయాలు, పూజా సామగ్రి, హోటల్, వస్త్ర, రవాణా, కళాకృతులకు డిమాండ్ పెరిగిందన్నారు. కాశీ, అయోధ్యకూ ఈ క్రేజ్ పాకిందని పేర్కొన్నారు.

బెంచ్మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,932 (-12), సెన్సెక్స్ 75,939 (-28) వద్ద ముగిశాయి. ఉదయం లాభాల్లో చలించిన సూచీలు క్రమంగా పతనమయ్యాయి. ఇంట్రాడే కనిష్ఠం నుంచి పుంజుకొని ఫ్లాటుగా క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎగిశాయి. ఐటీ, ఫార్మా, హెల్త్కేర్ షేర్లు నష్టపోయాయి. BEL, హిందాల్కో, ఐచర్, యాక్సిస్ బ్యాంక్, LT టాప్ గెయినర్స్.

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

AP: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో <<15497063>>అగ్నిప్రమాదం ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగు చూశాయి. మస్కిటో కాయిల్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బెడ్ పక్కనే కాయిల్ పెట్టుకొని విద్యార్థి పడుకోవడంతో ఫ్యాన్ వేగానికి మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో పొగ గది మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 70 మంది విద్యార్థులున్న గదికి ఒకటే ద్వారం ఉండటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
Sorry, no posts matched your criteria.