India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలామంది వెండి నగలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వెండి కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బంగారంలానే వెండికీ BIS 92.5% హాల్మార్కింగ్ ఉంటుంది. వెండి స్వచ్ఛతకు 80, 83.5, 92.5, 95.8, 99, 99.9 గ్రేడ్స్ ఉన్నాయి. 92.5తోనే ఆభరణాల్ని ఎక్కువగా చేస్తారు. హాల్మార్కింగ్ లేదా క్రెడిబిలిటీ ఉండి, సర్టిఫికెట్ ఇచ్చే షాపుల్లోనే కొనడం మంచిది.

TG: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. హైడ్రా, SDRF బృందాలతోపాటు బోట్లు, ఇతర సామగ్రిని తక్షణమే ఆ ప్రాంతాలకు పంపాలని CS, DGPలకు CM రేవంత్ సూచించారు. ఆ ప్రాంతాల్లోని ప్రభుత్వ సిబ్బంది సెలవులను రద్దుచేయాలని ఆదేశించారు. ముంపులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని చెప్పారు.

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 98 jr టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://vendor.avnl.co.in/

TG: మొంథా తుఫానుతో భారీ వర్షాలు పడి వరద పోటెత్తిన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో CM రేవంత్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నేడు వరంగల్ పర్యటనకు ఆయన వెళ్లాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణంతో వాయిదా పడింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వాలని CM సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

* పల్నాడు(D)లోని పులిచింతల ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 4.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
* ఎన్టీఆర్(D) మునేరుకు 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. లింగాల, పెనుగంచిప్రోలు వద్ద కాజ్వేలపైకి వరద రావడంతో రాకపోకలు నిలిపివేత.
* గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు వద్ద నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

NEET PG-2025 ఫేజ్-1 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంటు ఈనెల 28 నుంచి ఆరంభమైంది. MD, MS, PG డిప్లొమో కోర్సుల్లో ఛాయిస్ ఫిల్లింగ్కు NOV5 వరకు గడువు ఉంది. 8న సీట్లు కేటాయిస్తారు. 2026 జనవరి నాటికి మొత్తం 4 రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తిచేయాలని MCC భావిస్తోంది. ఆల్ ఇండియా PG మెడికల్ సీట్లలో 50% కోటా ఈ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. సీట్ల అప్రూవల్ పెండింగ్, సుప్రీంలో కేసులతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2-5 గంటల వరకు ఈ పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో తెలియక దోషాలు జరిగితే వాటి నివారణకు కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ అని EO అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తెలంగాణలో రేపు కూడా వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కురిసిన అతిభారీ వర్షాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలను అతలాకుతలం చేశాయి.

ఎల్ఐసీలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO)- జనరలిస్ట్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి జాబితా <

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సుప్రీం విచారించింది. మాజీ MP ఉండవల్లి అరుణ్కుమార్ వర్చువల్గా వాదనలు వినిపిస్తూ సంస్థ RBI నిబంధనల ఉల్లంఘనపై విచారించాలన్నారు. అయితే ప్రధాన పిటిషన్పై విచారణలో వాటిని హైకోర్టుకు చెప్పాలని SC సూచించింది. ₹2300 CR డిపాజిట్లలో చాలా వరకు చెల్లించామని సంస్థ తరఫున సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. అటు కేసులో ఉండవల్లి ప్రతివాదే కాదని AP ప్రభుత్వ న్యాయవాది SCకి తెలిపారు.
Sorry, no posts matched your criteria.