India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. TG చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్కు బాటలు వేసేలా శాఖను తీర్చిదిద్దాలన్నారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేయాలని సూచించారు.

దేశంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని, కార్బన్ డయాక్సైడ్, మిథైన్, గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు.

TG: DSC 2008 అభ్యర్థులను కాంట్రాక్టు SGT(సెకండరీ గ్రేడ్ టీచర్)లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. HYD మినహా మిగిలిన జిల్లాల్లో 1,382 మందిని కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుంటున్నట్లు తెలిపింది. వీరికి నెలకు రూ.31,040 చెల్లించనుంది. జిల్లాల వారీగా DEOలకు అభ్యర్థుల లిస్టును పంపినట్లు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించామన్నారు.

AP: వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించారని టీడీపీ ట్వీట్ చేసింది. ‘వంశీ ఐదేళ్లలో మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా రూ.195 కోట్లు సంపాదించినట్లు విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ నివేదికలో పేర్కొంది. ఇది గాక మరెన్నో అక్రమ దందాలతో, బెదిరింపులతో రూ.1000 కోట్లకు పైనే సంపాదించాడని ప్రజలు చెబుతున్నారు’ అని పేర్కొంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్తో ‘కల్కి 2898 AD’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, మూవీ చేసేందుకు ఆలియా భట్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ తర్వాతే దీనిని తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇకపై ట్రాన్స్జెండర్లను సైన్యంలో చేరడానికి అనుమతించబోమని US ఆర్మీ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ట్రాన్స్ జెండర్లకు సంబంధించి కొత్త నియామకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

వాట్సాప్లో ‘సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్’ అనే ఫీచర్ త్వరలో రానుంది. దీని ద్వారా యూజర్లు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్కు సంబంధించిన లింక్స్ను వాట్సాప్ ప్రొఫైల్కు యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్లో ఉన్న వారు ఆ లింక్స్ సాయంతో ఇతర ప్లాట్ఫామ్లలోనూ ఆయా యూజర్లతో కనెక్ట్ అయ్యేందుకు వీలుంటుంది. ఇది ఆప్షనల్ ఫీచర్. లింక్స్ యాడ్ చేయాలా వద్దా అనేది యూజర్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

TG కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులైన <<15464666>>మీనాక్షి నటరాజన్<<>> 1999-2002 NSUI అధ్యక్షురాలిగా, 2002-2005 మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్గా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009-2014 వరకు మాందసౌర్ MPగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడారు. 2022లో భూదానోద్యమానికి 75yrs పూర్తయిన సందర్భంగా TGలో పర్యటించారు. 2023 TG అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు.

AP: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు ఇవాళ నెల్లూరు(D)లో పర్యటించనున్నారు. ఉ.11.45 గంటలకు కందుకూరు TRR కాలేజీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

US నుంచి INDకు అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానాలను అమృత్సర్లో ల్యాండింగ్ చేస్తుండటంపై పంజాబ్ CM భగవంత్ మాన్ ఆగ్రహించారు. ‘ఢిల్లీకి బదులు ఇక్కడ ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారు. మా రాష్ట్రాన్ని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? తొలి విమానంలో వచ్చిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ వాళ్లే ఉన్నారు. ఎందుకు ఫ్లైట్ను అహ్మదాబాద్లో ల్యాండింగ్ చేయలేదు?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.