India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఏడాదిలోగా వరంగల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తామని, కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్టులకు లైన్ క్లియర్ అయినట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్- వరంగల్ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఉన్న ఫ్లై ఓవర్ పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఉప్పల్- మేడిపల్లి ఫ్లైఓవర్ పనులు మరో ఏడాదిలో పూర్తవుతాయని సెక్రటేరియట్లో చెప్పారు.
FY25 చివరికి మరో 500 SBI బ్రాంచీలను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆ సంఖ్య 23,000లకు చేరుకుంటుందని తెలిపారు. దేశంలో SBIకి 50crకు పైగా కస్టమర్లు ఉన్నారని, మొత్తం డిపాజిట్లలో 22.4% వాటా ఉందని చెప్పారు. రోజుకు 20cr UPI లావాదేవీలను నిర్వహిస్తోందన్నారు. ముంబైలోని SBI ప్రధాన కార్యాలయం వందో వార్షికోత్సవం సందర్భంగా రూ.100 స్మారక నాణెంను ఆమె ఆవిష్కరించారు.
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి <
TG: రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ను అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అని KTR ట్వీట్ చేశారు.
AP: షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
* TTD ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం
* 2,3గంటల్లో సర్వదర్శనం అయ్యేలా చర్యలు
* తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు
* తిరుపతి ఫ్లై ఓవర్కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ
* TTDలోని అన్యమత ఉద్యోగులకు VRS, లేదంటే బదిలీ
* తిరుపతి వాసులకు ప్రతినెలా తొలి మంగళవారం దర్శనం
* అన్నప్రసాదంలో కొత్త పదార్థాలు
* ప్రైవేట్ బ్యాంకుల్లోని TTD నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ
* ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు
<<14644158>>మణిపుర్లో<<>> శాంతి స్థాపనకు కేంద్రం జమ్మూకశ్మీర్ స్ట్రాటజీని అమలు చేయనుందని సమాచారం. ఇందుకోసం ఏడాది గడువు నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త సీఎంను నియమించడం లేదా రాష్ట్రపతి పాలన విధించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముందు కుకీ మిలిటెన్సీ అనుకూల అధికారుల్ని గుర్తించి వ్యవస్థను ప్రక్షాళన చేయనుంది. సాయుధ బలగాలతో కుకీ టెర్రరిస్టులను ఏరేస్తూ మయన్మార్ బోర్డర్ను పటిష్ఠంగా మార్చనుంది.
పాకిస్థాన్ వన్డే జట్టుకు నెలలోనే మూడో హెడ్ కోచ్ వచ్చారు. ఆ స్థానంలో మాజీ ఆల్రౌండర్ అకీబ్ జావేద్ను నియమించినట్లు PCB ప్రకటించింది. మేనేజ్మెంట్, ఆటగాళ్లతో విభేదాలతో గత నెల 28న ODI జట్టు కోచ్ పదవికి గ్యారీ కిర్స్టెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక కోచ్గా గిలెస్పీని ఎంపిక చేసింది. ఇప్పుడు ఆయననూ తప్పించి అకీబ్కు ఛాన్స్ ఇచ్చింది. ఈయన పాక్ తరఫున 163 ODIలు, 22 టెస్టులు ఆడారు.
AP: బడ్జెట్లో దీపం-2 పథకానికి పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు కేటాయించలేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ప్రశ్నించారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ‘రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. ఇప్పటికే 30 లక్షల మందికి డెలివరీ చేశాం. ఈ కార్యక్రమం పూర్తిపారదర్శకంగా జరుగుతోంది. దీనికి పూర్తి నిధులు కేటాయించాం’ అని చెప్పారు.
కర్ణాటకలో గత BJP సర్కారు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు 40% కమీషన్లు తీసుకున్నట్టు ఆధారాలేమీ లేవని లోకాయుక్త వెల్లడించింది. BBMPలో కాంట్రాక్టులు పొందేందుకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని టీవీల్లో పేర్కొన్న అంబికాపతికి ఐదేళ్లపాటు 2022 వరకు అసలు కాంట్రాక్టులే రాలేదంది. 2023, NOV 27న ఆయన చనిపోయారని, ఆయన కొడుకూ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్పై BJP విమర్శలకు దిగింది.
Sorry, no posts matched your criteria.