News November 17, 2024

తమిళనాడులో టాటాకు చెందిన ఐఫోన్ ఫ్యాక్టరీ

image

తమిళనాడులో ఐఫోన్ ప్లాంట్ కోసం తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌తో టాటా సీల్స్ ఒప్పందం చేసుకుంది. ఐఫోన్ ప్లాంట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ అంగీకరించింది. 10,000 మంది ఉద్యోగులున్న ఈ ప్లాంట్‌లో టాటా 60% & పెగట్రాన్ 40% వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 5 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో టాటాకు చెందిన మూడో ఐఫోన్ ఫ్యాక్టరీ ఇది.

News November 17, 2024

Investing: ఈ స్కీమ్స్ మహిళలకు ప్రత్యేకం

image

మ‌హిళ‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త‌, మంచి రిట‌ర్న్ ఇచ్చే పోస్టాఫీసు స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. సుక‌న్యా స‌మృద్ధి స్కీం కింద ప‌దేళ్లలోపు ఆడపిల్లల పేరిట 15 ఏళ్ల‌పాటు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 8.2% వ‌డ్డీ ల‌భిస్తుంది. నెలవారీ ఆదాయానికి Monthly Income Scheme, మ‌హిళా స‌మ్మాన్ సేవింగ్ స‌ర్టిఫికెట్ కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు. National Savings Certificate, PPF Schemes అందుబాటులో ఉన్నాయి.

News November 17, 2024

అతనితో జాగ్రత్త.. ఆసీస్ ప్లేయర్లకు మెక్‌గ్రాత్ సూచన

image

భారత స్టార్ ప్లేయర్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాజీ ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రాత్ సలహా ఇచ్చారు. బిగ్ గేమ్స్ అంటే కోహ్లీ చెలరేగుతాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైనా అతడిని తక్కువ అంచనా వేయొద్దన్నారు. అతడి జోలికి వెళ్లకుండా ఉంటే ఆసీస్‌కే మేలని అభిప్రాయపడ్డారు.

News November 17, 2024

రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్ మార్పు?

image

APలో హైస్కూళ్ల టైమింగ్స్ మార్చడంపై విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిలబస్ కవర్ చేయడం సహా టీచర్లు ఒత్తిడి లేకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పేలా సా.5 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రతి మండలంలో ఒక స్కూలులో ఈ టైమింగ్స్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. దీని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.

News November 17, 2024

మా ప్రభుత్వంపై కుట్రలు : దామోదర

image

TG: గత 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ‘రూ.50వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. 10 నెలలు కాకుండానే మా ప్రభుత్వంపై కొందరు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని రూపుమాపేలా కాంగ్రెస్ శ్రేణులు సంఘటితం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News November 17, 2024

మణిపుర్‌లో బీజేపీకి NPP మద్దతు ఉపసంహరణ

image

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. 60 స్థానాలున్న మణిపుర్‌లో బీజేపీకి 32, NPPకి 7 సీట్లు ఉన్నాయి. మొత్తంగా NDAలోని పార్టీలకు 53 స్థానాలు ఉండగా, NPP సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో బలం 46 స్థానాలకు పడిపోతుంది. ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు.

News November 17, 2024

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా జావేద్.. గిలెస్పీ ఔట్?

image

పాకిస్థాన్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీకి పీసీబీ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. నూతన కోచ్‌గా పాక్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్‌ను నియమిస్తారని సమాచారం. అన్ని ఫార్మాట్లకు ఆయనే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. రేపు దీనిపై పీసీబీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా పీసీబీ ఇటీవలే గిలెస్పీని హెడ్ కోచ్‌గా నియమించింది. ఇంతలోనే ఆయనపై వేటు వేసింది.

News November 17, 2024

‘తగ్గేదే లే’ సిగ్నేచర్ మూమెంట్‌తో క్రికెటర్లు

image

‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజం, ఆటిట్యూడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు క్రికెటర్లూ ఫిదా అయ్యారు. ఈక్రమంలో వివిధ మ్యాచుల్లో వారంతా తగ్గేదే లే స్టెప్పులేశారు. తాజాగా ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో ఆ సన్నివేశాలను అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వారిలో కోహ్లీ, వార్నర్, జడేజా, రబాడా, రషీద్ ఖాన్, SRH ప్లేయర్లు, IND ఉమెన్ ప్లేయర్లు ఉన్నారు.

News November 17, 2024

రేపటి నుంచి శ్రీవారి సేవా టికెట్ల బుకింగ్

image

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి-2025కు సంబంధించి లక్కీ డిప్(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 18వ తేదీ ఉ.10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉ.10 వరకు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో పేర్లు వచ్చిన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పేమెంట్ చేయవచ్చని TTD తెలిపింది.

News November 17, 2024

మొబైల్ వినియోగదారులకు అలర్ట్

image

బ్రెయిన్ క్యాన్సర్‌కు మొబైల్ వినియోగంతో సంబంధం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ & WHO జరిపిన అధ్యయనంలో ఫోన్‌కు మెదడు & హెడ్ క్యాన్సర్‌తో సంబంధం లేదని తెలిసింది. 1994 నుంచి 2022 మధ్యకాలంలో 5వేల మందిపై స్టడీ చేసిన తర్వాత ఈ విషయం కనుగొన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలను క్యాన్సర్ కారకాలుగా గతంలో IARC పేర్కొంది.