News November 17, 2024

‘చెప్పులు’ నిషేధించాలని స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి.. ఎందుకంటే?

image

MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్‌ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2024

గాలిని కూడా అమ్మేస్తున్నారు!

image

ఇప్పటికే నీటిని కొనుక్కుని తాగుతున్నాం. కాలుష్య స్థాయులు చూస్తుంటే మున్ముందు గాలిని కూడా కొనుక్కోక తప్పేలా లేదు. దీన్ని అంచనా వేసిన కమ్యూనికా అనే సంస్థ గాలిని అమ్మేస్తోంది. ఇటలీలోని లేక్ కోమో సరస్సును ఆనుకుని ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలిని తమ సీక్రెట్ ఫార్ములా ఎయిర్‌తో కలిపి 400 మి.లీ టిన్‌లలో రూ.907కి విక్రయిస్తోంది. ఆ గాలి పీల్చినవారి మనసు తేలికవుతుందని చెబుతోంది.

News November 17, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు

image

తిరుమలలో ఓ వర్గం వారు అన్యమత ప్రచారం చేశారనే వదంతులు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. పాప వినాశనం దగ్గర అన్య మతస్తులు రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం చేశారా? ఇది తిరుమలలోనే జరిగిందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

News November 17, 2024

పకడ్బందీ ఏర్పాట్లతోనే మూసీ నిద్ర: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని బీజేపీ నేతలు మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకునే వారికి ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని ప్రశ్నించారు. పరీవాహక ప్రజలు కలుషిత నీరు, గాలి మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పారు. డీపీఆర్ వచ్చాక ఏం చేయాలనే విషయమై సలహాలు ఇవ్వాలని బీజేపీ నేతలకు సూచించారు.

News November 17, 2024

బొద్దింకలు, పురుగులను వడ్డిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి: కాంగ్రెస్ MP

image

వందే భార‌త్ రైళ్ల‌లో నాణ్య‌త‌లేని ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంపై కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. 8 నెలల పాటు భోజ‌నంలో బొద్దింక‌లు, పురుగులు వ‌డ్డిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ప్ర‌ధాని మోదీకి చురకలంటించారు. ఈ ప‌రిస్థితుల్లో బాధ్యుల‌పై కేవ‌లం ₹50 వేల జ‌రిమానా విధిస్తే స‌రిపోతుందా అంటూ నిల‌దీశారు. ప్రయాణికుల భ‌ద్ర‌త కోసం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

News November 17, 2024

రూ.8 లక్షలతో వ్యాపారం.. ఇప్పుడు రూ.23,567 కోట్ల సామ్రాజ్యం

image

ఫిన్‌టెక్ కంపెనీ mobikwik ఫౌండర్ బిపిన్ ప్రీత్‌సింగ్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తినిస్తోంది. ఢిల్లీ IITలో చదివిన ఆయన డిజిటల్ పేమెంట్స్ హవాను 2000లోనే గుర్తించారు. 9ఏళ్లు కష్టపడి 2009లో ₹8లక్షల సేవింగ్స్‌తో చిన్న రూమ్‌లో MobiKwikను ప్రారంభించారు. భార్య ఉపాసన సహకారంతో కంపెనీని వృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ యాప్‌‌‌లో 10కోట్ల మంది యూజర్లు ఏటా $2bn లావాదేవీలు జరుపుతున్నారు. కంపెనీ విలువ ₹23,567కోట్లకు చేరింది.

News November 17, 2024

BGT: తొలి టెస్టుకు కెప్టెన్ ఎవరంటే?

image

ఆస్ట్రేలియాతో జరిగే BGTలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన స్థానంలో బుమ్రా భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తారని తెలిపాయి. ఇటీవల రోహిత్ భార్య కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబంతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హిట్ మ్యాన్ రెండో టెస్టుకు జట్టుకు అందుబాటులో ఉంటారన్నాయి. మరోవైపు గాయపడిన కేఎల్ రాహుల్ కోలుకున్నట్లు సమాచారం.

News November 17, 2024

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష

image

TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.

News November 17, 2024

BGT: నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆయనను తుది జట్టులో ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీశ్‌తోపాటు దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌లలో ఒకరు డెబ్యూ చేస్తారని టాక్.

News November 17, 2024

బీజింగ్‌లో చేసినట్లే ఢిల్లీలో చేయండి: నెటిజన్లు

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్‌లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.