India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ రేపటి(NOV 18) నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ జీవో ప్రకారం ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్కు వందశాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ముంగిట ఓ భారీ రికార్డు ఉంది. ఆసీస్పై అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కపిల్ దేవ్ (51) పేరిట ఉంది. ప్రస్తుతం అశ్విన్ 39, బుమ్రా 32 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కపిల్ రికార్డును అధిగమించటానికి అశ్విన్కు 13, బుమ్రాకు 20 వికెట్లు అవసరం. ఒకవేళ BGT టూర్కు ఎంపికైతే షమీ(32)కీ ఈ ఛాన్స్ ఉంది.
TG: వికారాబాద్ కలెక్టర్పై దాడి వెనుక కేటీఆర్ ఉండి ఉంటారని మంత్రి సురేఖ ఆరోపణలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విదేశాల్లో దాచారన్నారు. నిజాలు తేల్చాక KTRపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్-1’ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. ఇప్పటికే రిలీజైన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకోగా.. ప్రీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, కన్నడతో పాటు మొత్తం 7 భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.
TG: వరంగల్లోని మామూనురు ప్రాంతంలో ఎయిర్పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విమానాశ్రయం విస్తరణలో అవసరమైన భూసేకరణ కోసం రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. DPR సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి లేఖ రాసింది.
AP: విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ CBIకి పట్టుబడ్డారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి ₹25 లక్షలు డిమాండ్ చేశారు. ముంబైలో ₹10 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా సీబీఐకి దొరికారు. DRMను ప్రస్తుతం CBI విచారిస్తోంది. విశాఖ DRM బంగ్లాలోనూ CBI అధికారులు సోదాలు చేశారు. రైల్వే చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన 2వ DRM సౌరభ్.
నటి పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఒక హీరోయిన్ను స్టార్ హీరో వేధిస్తున్నారని రాసుకొచ్చారు. ఆమె తనతో పాటు ఓ ఫాంటసీ చిత్రంలో నటించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత హీరోయిన్గానూ చేసి సినిమాలకు దూరమైనట్లు తెలిపారు. ఇటీవల ఆమెను విమానంలో కలిసినపుడు ఓ హీరో వెంటపడి వేధిస్తున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమెను తాను ఓదార్చినట్లు చెప్పారు. అయితే వారిద్దరూ ఎవరనే విషయాన్ని పూనమ్ వెల్లడించలేదు.
గోవా టూరిజంను తిరిగి గాడిలో పెట్టడానికి నెట్టింట కొన్ని సలహాలు వినిపిస్తున్నాయి. అవి: స్థానిక ట్యాక్సీ మాఫియా ఆగడాలను అరికట్టాలి *Luxury Roomsపై ఉన్న 28% GSTని తగ్గించాలి. *సన్ సెట్ పాయింట్లు మాత్రమే కాకుండా అమ్యూజ్మెంట్ పార్క్లు, భారీ బీచ్ క్లబ్స్, సుదీర్ఘ కాలినడక మార్గాలు ఏర్పాటు చేయాలి. *ట్రాఫిక్ నియంత్రణ, విదేశీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరిచ్చే సలహాలు ఏంటి?
పుష్ప-2కి ఉత్తరాది రాష్ట్రాల్లో క్రేజ్ పీక్స్లో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్లో ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. హిందీలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ల రికార్డు జవాన్(రూ.63.90 కోట్లు) పేరిట ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లలో RRR (రూ.223 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. పుష్ప-2కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రెండింటినీ దాటేందుకు మంచి అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
తెలంగాణలో BRSను నిషేధించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న BRS విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన అసమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక TGలో ఇద్దరు సీఎంలు(రేవంత్, KTR) ఉన్నారని, కాంగ్రెస్, BRS కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు.
Sorry, no posts matched your criteria.