India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యేగా సభకు రావొచ్చని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. జగన్ తీసుకొచ్చిన మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడైందని విమర్శించారు. మరోవైపు బర్డ్ ఫ్లూపై నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదే ఏడాది, నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన కేసులో ఆయనను ముద్దాయిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 18న వాదనలు విననుంది. కాగా ఢిల్లీ కంటోన్మెంట్లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నారు.

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సచిన్ 3990 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 545 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన కోహ్లీ 27వేలకు పైగా పరుగులు చేశారు.

స్మాల్, మిడ్క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్లు అధికంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇస్తున్నా ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లపై నమ్మకం ఉంచారు. JANలో MFలో రూ.39,687 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. స్మాల్క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు 22.6% పెరిగి రూ.5,720CRతో రికార్డు గరిష్ఠానికి చేరాయి. మిడ్క్యాప్లో రూ.5147 CR, లార్జ్క్యాప్లో రూ.3,063 CR కుమ్మరించారు. 5 నెలలుగా మార్కెట్ పడుతున్నా క్రమశిక్షణ కనబరుస్తున్నారు.

ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. డబ్బు, ఆహారం రావడంతో ఏ పని చేయడానికీ ఇష్టపడట్లేదని పేర్కొంది. పనిచేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఇలా జరుగుతుందని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే పిటిషన్పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

నటి దీపికా పదుకొణె ‘పరీక్షా పే చర్చ’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువు, క్రీడలు, మోడలింగ్ తర్వాత యాక్టింగ్.. ఇలా జీవితంలో ఎన్నో మార్పులు చూసినట్లు తెలిపారు. 2014 తర్వాత జీవితంలో సమస్యలతో కుంగుబాటుకు గురైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని తెలిపారు. సినిమాల్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్న ఈ అమ్మడు రణ్వీర్ను పెళ్లి చేసుకొని ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు.

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాన్ని అడ్డుకునేందుకు నోటాను అభ్యర్థిగా చేర్చాలని EC సన్నాహాలు చేస్తోంది. MH, హరియాణా వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించే అవకాశముంది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి రీ ఎలక్షన్స్లో పోటీ చేసే అర్హత లేదు. ఇందులోనూ నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

AP: గత ఎన్నికల్లో తాము అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని వైఎస్ జగన్ కార్యకర్తలతో అన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని, 25-30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోనని హెచ్చరించారు.

దేశీయ స్టాక్మార్కెట్లలో షార్ప్ రికవరీ జరిగింది. బెంచ్మార్క్ సూచీలు రోజువారీ కనిష్ఠాల నుంచి బలంగా పుంజుకున్నాయి. ఆరంభంలో 200Pts నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 34 pts లాభంతో 23,108 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ -600 నుంచి +89కి చేరుకొని 76,377 వద్ద చలిస్తోంది. ఫైనాన్స్, మెటల్, బ్యాంకు, మీడియా రంగాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. SBILIFE, BAJAJFINSV, HDFCLIFE, ULTRACEMCO, ADANIENT టాప్ గెయినర్స్.

AP: ఆర్థిక ఇబ్బందులతో కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేయగా పోలీసులు అతణ్ని కాపాడి శెభాష్ అని అనిపించుకున్నారు. అయినవెల్లి CI భీమరాజుకు ఫిర్యాదు రావడంతో లొకేషన్ గుర్తించి అన్నవరంలో ఉన్న SI శ్రీహరికి సమాచారమిచ్చారు. వీడియో లాడ్జీలోనిదని గుర్తించి నగరంలోని లాడ్జీ ఓనర్లను అలర్ట్ చేశారు. ఉరేసుకునేముందు వారు తలుపు నెట్టి కాపాడారు. ఇదంతా 6 నిమిషాల్లోనే జరగడం విశేషం.
Sorry, no posts matched your criteria.