News November 17, 2024

టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్

image

ఆస్ట్రేలియా టూర్‌లో తొలి మ్యాచ్ మొదలుకాక ముందే గాయాల బెడదతో ఉన్న టీమ్ ఇండియాకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15న ప్రాక్టీస్‌లో గాయపడ్డ KL రాహల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మోచేతికి బంతి బలంగా తాకడంతో ఆయన నొప్పితో మైదానం వీడారు. దీంతో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రాహుల్ అనుమానమేనన్న వార్తలు వచ్చాయి. ఈరోజు ఆయన తిరిగి ప్రాక్టీస్ చేయడంతో అంతా సర్దుకున్నట్లు తెలుస్తోంది.

News November 17, 2024

నాగచైతన్య-శోభిత పెళ్లి శుభలేఖ ఇదేనా?

image

అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే తాజాగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ ఓ శుభలేఖ వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య తరఫున అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ, దగ్గుబాటి రామానాయుడు-రాజేశ్వరి పేర్లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

News November 17, 2024

లౌడ్‌స్పీకర్లతో టార్చర్ చేస్తున్న నార్త్ కొరియా

image

సౌత్ కొరియాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను వేధించడానికి <<13338040>>నార్త్ కొరియా<<>> లౌడ్‌స్పీకర్లతో యుద్ధం మొదలుపెట్టింది. దెయ్యాల అరుపులు, క్రాష్ సౌండ్స్‌ను రోజంతా ప్లే చేస్తూనే ఉంది. దీన్ని ‘నాయిస్ బాంబింగ్’గా పిలుస్తున్నారు. ఈ శబ్దాల వల్ల తమకు నిద్ర కరవైందని, తలనొప్పి, మానసిక సమస్యలు వస్తున్నాయని డాంగ్సన్ గ్రామ ప్రజలు చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఇదే తంతు <<13411726>>కొనసాగుతోందని<<>> వాపోతున్నారు.

News November 17, 2024

LeT సీఈవో అంటూ ఆర్బీఐకి బెదిరింపు కాల్

image

ముంబైలోని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ల‌ష్క‌రే తోయిబా CEOను అంటూ ఓ వ్య‌క్తి బెదిరింపు కాల్ చేశాడు. శ‌నివారం ఆర్బీఐ క‌స్ట‌మర్ కేర్ నంబ‌ర్‌కు ఫోన్ చేసిన నిందితుడు ‘నేను ల‌ష్కరే తోయిబా సీఈవో. బ్యాక్ వే మూసేయండి. ఎల‌క్ట్రిక్ కారు చెడిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదో ఆక‌తాయి ప‌నిలా పోలీసులు అనుమానిస్తున్నారు. RBI భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News November 17, 2024

ఫోన్ వాడుతున్నాడని కొడుకుని చంపేసిన తండ్రి

image

ఫోన్ వ్యసనం ఓ బాలుడి ప్రాణం తీసింది. బెంగళూరుకు చెందిన రవికుమార్ కొడుకు తేజస్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు చదువుపై దృష్టి పెట్టకుండా అస్తమానం ఫోన్‌ చూసేవాడు. ఈక్రమంలోనే మొబైల్ పాడవడంతో రిపేర్ చేయించాలని తండ్రితో వాదనకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవి క్రికెట్ బ్యాట్‌తో అతడిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా తేజస్ తలను బలంగా గోడకేసి బాదాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రాణాలు విడిచాడు.

News November 17, 2024

మణిపుర్ సర్కారుకు మైతేయ్ గ్రూప్స్ అల్టిమేటం

image

సాయుధ మిలిటెంట్లపై చర్యలు తీసుకునేందుకు మణిపుర్‌ ప్రభుత్వానికి అక్కడి మైతేయ్ పౌర హక్కుల సంఘాలు 24 గంటలు టైమ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేశాయి. శనివారం ఓ మూక రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ‘సాయుధ మూకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని మైతేయ్ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

News November 17, 2024

మిడ్ మానేరు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో మొత్తం 10683 కుటుంబాలు నిర్వాసితులు కాగా ఇప్పటికే 5987 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. మిగిలిన వారికి తాజాగా ఇళ్లు మంజూరు చేశారు.

News November 17, 2024

పుష్ప-2 సరికొత్త రికార్డు

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్(DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సా.6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

News November 17, 2024

మణిపుర్‌కు వెళ్లండి మోదీజీ.. రాహుల్ మరోసారి వినతి

image

మ‌ణిపుర్‌లో ప‌ర్య‌టించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మ‌రోసారి కోరారు. మ‌ణిపుర్‌లో మ‌ళ్లీ హింస చెల‌రేగ‌డంపై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏడాది కాలంగా హింస జ‌రుగుతున్నా స‌మ‌స్య‌ పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయ‌ని దేశ ప్ర‌జ‌లు ఆశ‌గా ఎదురుచూశార‌న్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు మోదీ ప్రాధాన్య‌మిస్తుండ‌డాన్ని కాంగ్రెస్ త‌ప్పుబ‌ట్టింది.

News November 17, 2024

మోదీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: సిద్దరామయ్య

image

కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బును మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని PM మోదీ చేసిన ఆరోపణలపై కర్ణాటక CM సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధాని ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. ‘మోదీ ఇష్టానుసారంగా అబద్ధాలాడి వెళ్లిపోతారు. తను చెప్పిన మాటలకు ప్రూఫ్ చూపించగలరా? నా సవాలు స్వీకరిస్తారా? ఆయనకెందుకు భయం?’ అని ప్రశ్నించారు.